Showing posts with label telugu desam. Show all posts
Showing posts with label telugu desam. Show all posts

Friday, May 4, 2012

కాపు కాస్తున్నాయ్‌!

kapu 
రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలపై అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్నేశాయి. సీమాం ధ్రలో ప్రధాన సామాజిక వర్గమైన కాపుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజికవర్గ దన్ను కోసం మూడు పార్టీలూ పరితపిస్తు న్నాయి.  

కాంగ్రెస్‌ పార్టీకి అనాదిగా సంప్రదాయ ఓటు బ్యాంకుగా కొన సాగుతోన్న రెడ్డి సామాజికవర్గం జగన్‌ వైపు వెళుతోందన్న భావనతో ఉన్న కాంగ్రెస్‌ నాయకత్వం వారికి ప్రత్యామ్నాయంగా అంతకంటే మూడింతల సంఖ్యాబలం ఉన్న కాపు, బలిజలకు చేరువయేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా చిరంజీవికి రాజ్యసభ సీటు ఇచ్చి కాపు-బలిజను దువ్వే ప్రయత్నాలు ప్రారంభించింది.

ఆ తర్వాత బలిజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి కూడా ఇచ్చి రాయలసీమలో బలిజలకు చేరువయింది. తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధి కంగా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నిర్ణయాత్మకశక్తిగా ఉన్న కాపులకు గాలం వేసేందుకు కాంగ్రెస్‌ శతవిధాలా పావులు కదుపుతోంది. రాయలసీమలో కడప, చిత్తూరులో నిర్ణయాత్మకశక్తిగా ఉన్న బలిజలకు చేరువయేందుకు ఆయా కుల నేతలను ప్రోత్సహిస్తోంది. నెల్లూరులో కూడా బలిజల హవా ఎక్కువే. తాజా ఉప ఎన్నికల్లో నర్సాపురం, రామచంద్రాపురం కాపులకు, తిరుపతి బీసీ బలిజలకు ఇచ్చిన కాంగ్రెస్‌ నాయకత్వం ఆ ప్రయోజనాన్ని మిగిలిన నియోజకవర్గాల్లో పొందాలని భావిస్తోంది. ఇక చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం వల్ల కాపులు గంపగుత్తగా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తోంది.

అందుకే కాపు, బలిజ సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో చిరంజీవిని ప్రచారంలోకి దింపాలని నిర్ణయించింది. కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న కృష్ణా జిల్లా, ప్రధానంగా విజయవాడ నగరంలో దివంగత కాపు నేత వంగవీటి రంగా తనయడు వంగవీటి రాధా ఇటీవల వైకాపా తీర్ధం తీసుకోవడంతో కలవరపడిన కాంగ్రెస్‌.. ఆయనతో పాటు కాపులు చేజారకుండా ఉండేందుకు ఆ వర్గానికి చెందిన నేతలను రంగంలోకి దించింది. అందులో భాగంగా యాదవ వర్గానికి చెందిన మంత్రి పార్ధసారథి ఇటీవల కాపు నేతలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా కాపులు కాంగ్రెస్‌లోనే ఉంటారని, రాధా పార్టీ మారినప్పటికీ ఎన్నాళ్ల నుంచో రంగాతో ఉన్న కాపులు మాత్రం జగన్‌ పార్టీలో చేరరని పార్ధసారథి సమక్షంలోనే కాపు నేతలు భరోసా ఇచ్చారు. కాపులంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.

చిరంజీవికి పార్టీలో అధిక ప్రాధాన్యం లభిస్తోందని గుర్తు చేశారు. కోస్తాలో కాపులు జగన్‌ వైపు వెళ్లకుండా నిరోధించడంతో పాటు, తన వైపు మళ్లించుకునేందుకు కాంగ్రెస్‌ తన ముందున్న అన్ని ప్రత్యామ్నాయాలనూ అన్వేషిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ కూడా కాపు-బలిజ వర్గంపై కన్నేసింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు తనతో కొనసాగిన కాపు-బలిజ సామాజికవర్గాన్ని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో విలీనమయినప్పటికీ ఇంకా కాంగ్రెస్‌లో చేరని ఆ సామాజికవర్గాన్ని దరిచేర్చుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా, రాయలసీమలో రాజంపేట, రాయచోటి, తిరుపతిలో బలిజ తూర్పు గోదావరిలో రామచంద్రాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం కాపులకు, అనంతపురంలో అనంతపురం అర్బన్‌లో బలిజకు అవకాశం ఇచ్చారు. ఆ మేరకు కాపు-బలిజ సంఘ నేతలు బాబును అనంతపురంలో కలసి తమ వర్గానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తమ వర్గానికి చెందిన అభ్యర్ధులను గెలిపించుకోవడంతో పాటు, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. సీమలో మొదటి నుంచీ టీడీపీకి బలిజలు సంప్రదాయ ఓటు బ్యాంకుగానే ఉన్నారు. కోస్తాలో కాపులు పూర్తి స్దాయిలో లేనప్పటికీ కాంగ్రెస్‌-టీడీపీకి చెరిసగం మద్దతునిచ్చేవారు. చిరు పార్టీ పెట్టిన తర్వాత ఆ సమీకరణలో మార్పు వచ్చిన నేపథ్యంలో, తిరిగి ఆ సామాజికవర్గాల ఓటు బ్యాంకు కోసం టీడీపీ వ్యూహరచన చేయడంతో పాటు, దానిని కార్యాచరణలో పెట్టింది. ఇక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా కాపులను దువ్వే పనిలో ఉంది. విజయవాడలో వంగవీటి రాధా చేరికతో ఆ ప్రాంతంలో కాపులకు చేరువ కావాలని యోచిస్తోంది.

తూర్పు గోదావరిలో ఇప్పటికే జ్యోతుల నెహ్రు వంటి కాపు నేతలు పార్టీలో ఉన్నారు. జగన్‌ ఓదార్పు యాత్ర సందర్భంగా తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులు చాలామంది జగన్‌ వైపు మొగ్గు చూపారు. ముద్రగడ పద్మనాభం వంటి అగ్రనేత కూడా జగన్‌తో కలసి నడిచారు. అయితే జగన్‌ ఒంటెత్తు పోకడలు, వన్‌మ్యాన్‌షో నచ్చని ముద్రగడ వైకాపా నుంచి పక్కకు తప్పుకున్నారు. చిరంజీవి, చంద్రబాబునాయుడు ఆ రెండు జిల్లాల్లో కాపులపై దృష్టి సారిస్తుండటంతో జగన్‌ వైపు వచ్చేవారు తక్కువయిపోతున్నారు. కానీ, కోస్తాలో కాపులను ప్రోత్సహించడం ద్వారా అధికారంలోకి సులభంగా రావచ్చని జగన్‌ అంచనా వేస్తున్నారు.
- సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్‌

Sunday, January 22, 2012

* డా. మైసూరారెడ్డి - Inner View

 http://www.tv5news.in/en/politics/photos/2549/mysura.jpg
మైసూరమ్మ మీదుగా మైసూరారెడ్డి
మైసూరారెడ్డిని బాగా ఎరిగినవాళ్లతో మాట్లాడితే ఆయన వ్యక్తిత్వం కొంత అర్థమవుతుంది. ఆయనకు జనాన్ని ఆకర్షించేంతటి వాగ్దాటి లేకపోయినా, సబ్జెక్టును స్టడీ చేసి మెప్పించే ఓపిక ఉంది. ఈగోయిస్ట్‌గా కనబడినా, ముక్కుసూటి మనిషి. రాజకీయాల్లో ఉన్నా ‘రాజకీయం’ చేయరు. ఫ్యాక్షన్ గొడవలకు దూరం పాటిస్తారు. పైగా సెన్సిటివ్. అందువల్లే ఆయన గౌరవనీయ నాయకుడయ్యారు. అయితే ఈ లక్షణాలే ఆయన్ని ఎదగాల్సినంత ఎదగనివ్వకుండా చేశాయా? ‘ఎక్కడో పల్లెటూళ్లో పుట్టి, ఈ స్టేజ్‌కు వచ్చినాము కదా, ఇది చాలదా!’ అంటారు. 
  కడప జిల్లా నిడిజివ్వి గ్రామంలో జన్మించిన మైసూరా ‘రాయలసీమ ఉద్యమం’లో కీలక పాత్ర పోషించారు. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర హోంమంత్రిగా పనిచేశారు. సుమారు 25 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగి 2004లో తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎం.వి.మైసూరారెడ్డితో ‘సాక్షి’ ప్రతినిధులు డి.శ్రీనాథ్, పూడూరి రాజిరెడ్డి సంభాషించారు. సారాంశం ఆయనదైన రాయలసీమ మాండలికంలోనే...http://desiboost.com/telugu/wp-content/uploads/2011/04/mysoora-reddy-300x267.jpg
 
మొదట్నుంచీ రైతు కుటుంబము. సిర్రాజుపల్లి అనే చిన్న గ్రామం నుంచి మా అబ్బ నిడిజివ్వికి ఇల్లటం వచ్చినాడు. మా వూల్లల్లో తండ్రి తండ్రిని అబ్బ అంటాము. తల్లి తండ్రిని తాత అంటాము. మా తండ్రి చనిపోయేంతవరకు అన్‌అపోజ్డ్‌గా గ్రామ సర్పంచిగా చేసినాడు. మా అమ్మ అన్నగారు(మాజీ ఎంపీ, ప్రముఖ అడ్వకేట్ ఊటుకూరి రామిరెడ్డ్డి) కూడా రాజకీయాల్లో ఉంటూ వచ్చినాడు. అలా మొదట్నుంచీ రాజకీయాలతో సంబంధాలుండేవి.

ప్రొద్దుటూరు దగ్గర తాళమాపురం అనే ఊరుంది. అక్కడ ఉన్న గ్రామదేవత మైసూరమ్మ. అందుకే మైసూరయ్య, మైసూరప్ప, మైసూరమ్మ అని పేర్లు పెట్టుకుంటారు. ఆమె పేరు మీదనే నాకూ మైసూరారెడ్డి అని పెట్టినారు. మానాన్న కూడా బాలమైసూరారెడ్డి. బయటి ప్రాంతాల్లో ఇది విచిత్రంగా ఉంటుంది. ఏదో మైసూరు ఉంది కదా, అదేమో అనుకుంటారు.


మేము నలుగురం అన్నదమ్ములం. ముగ్గురు చెల్లెళ్లు. అందర్ల్లోకీ నేనే పెద్దోణ్ని. నిడిజివ్విలోనే ఐదో తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత ఎర్రగుంట్ల స్కూలు. గొప్పలకు ఎందుకు పోవాల? యావరేజ్ స్టూడెంట్‌నే. తిరుపతి, ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ చదివిన. అప్పట్లో దాన్ని డబ్బా రేకుల కాలేజీ అనేవాళ్లు.



 












 
ఫీజులేని డాక్టరుగా...
మా కుటుంబంలోగానీ, మా బంధువుల్లోగానీ ఎవరూ పెద్ద చదువు చదివింది లేదు. మా తండ్రి కోరిక ఏమంటే నేను డాక్టర్ చదవాలని. ఎంబీబీఎస్ డొనేషన్ కోసం లెక్క కూడా కూడబెట్టినాడు. గుల్బర్గాలో అయితే ఐదువేలు, కాకినాడలో అయితే పదివేలు. అయితే నాకు 82 శాతం మెరిట్ మీదనే కర్నూలు కాలేజీలో సీటు వచ్చినాది.

హౌస్ సర్జెన్సీ అయిపోతానే ఐదు సంవత్సరాలు ఎర్రగుంట్లలో ప్రాక్టీస్ చేసినాను. పరీక్ష చేయిచ్చడమూ, వాళ్లకు కావాల్సిన మందులో, ఇంజెక్షన్లో రాయిచ్చడమో చేసేవాణ్ని. కన్సల్టేషన్ ఫీజు తీసుకునేది లేదు. మొదట్నుంచీ ఉన్నోళ్లమే కాబట్టి, వాళ్లిచ్చే రెండ్రూపాయలో, మూడ్రూపాయలో తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇది నాకు కొంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. రాజకీయాల్లోకి వచ్చాక ప్రాక్టీస్ మానేసినాను. కొందరైతే సలహా గూడా ఇచ్చినారు, ‘రోజూ ఓ గంటన్నా ప్రాక్టీస్ చేయగూడదా’ అని. న్యాయవాది రాజకీయాల్లో ఉన్నాగని ఫరవాలేదు. డాక్టర్‌కు ఏడ కుదురుతుంది? క్లైంట్ వెయిట్ చేస్తాడుగానీ పేషెంట్ ఆగలేడు కదా!


పుస్తకం చదువుకుని బాధ్యతలు తెలుసుకున్నా...

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే కాబట్టి, మెడికల్ కాలేజీలో స్టూడెంట్ రిప్రజెంటేటివ్‌గా ఉంటి. తండ్రి చనిపోయిన తర్వాత ఊరికి సర్పంచ్‌గా చేసినాను. తర్వాత కమలాపురం సమితి అధ్యక్షుడిగా పదివేల ఓట్లతో గెలిచినా(1981-85). అప్పుడు నాకు 32 ఏళ్లు. చిన్నవయసుగదా ఏం చేస్తాడో, ఎట్ల చేస్తాడో అని అందరికీ అనుమానముండె.

స్థానిక సంస్థల విధులేమిటి, ప్రెసిడెంటుగా ఏం చెయ్యాలి, అని రూల్స్ బుక్కు తీసుకోని చదివి, ఫస్ట్ మీటింగుకు పోతనే అధికారులతో మాట్లాడినా. అందులో ఉన్న బాధ్యతల ప్రకారం రివ్యూ చేసి, ‘ఫలానా చోట ఉంది చూసుకోలేదా?’ అనంగనే, ‘ఓయమ్మ ఈయన అసాధ్యుడే’ అనుకున్నారు. గ్రామాల్లో తిరగటం, మట్టిరోడ్లు వేయించటం, చదువు చెప్తాండారా లేదా అని స్కూళ్లు ఇన్‌స్పెక్ట్ చేయడం... అట్ల మంచిపేరే వచ్చింది.


స్టేజ్ ఫియర్‌తోనే రాయలసీమ ఉద్యమంలోకి...

ఆ సమయంలోనే ఎన్టీఆర్ ప్రభుత్వం తెలుగుగంగ పనులు మొదలుపెట్టింది. తెలుగుగంగ పేరు మీద నెల్లూరుకు, మద్రాసుకు దొంగదారిన నీళ్లు పోతాయి, రాయలసీమకు అన్యాయం జరుగుతుందేమో అని ఒక భయం మొదలైంది. ‘రాయలసీమ విమోచన సమితి’ అని మొదలుపెట్టి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి, లక్కిరెడ్డిపల్లె రాజగోపాలరెడ్డి, బద్వేలు వీరారెడ్డి రాయలసీమంతా పర్యటిస్తాన్నరు(కొంతకాలానికి రా.వి.స. ఆగిపోయింది. తర్వాత రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి బలం పుంజుకుంది).

ఎన్.శివరామిరెడ్డి, ఎన్.సి.గంగిరెడ్డి, మాసీమ రాజగోపాలరెడ్డి ఇంకా కొంతమంది నాయకులు, అందులో సీపీఐ, కాంగ్రెస్, అన్ని పార్టీలవాళ్లున్నరు. ‘యువకుడు కదా, ఓపిగ్గా తిరుగుతాడు, అఖిలపక్షం కన్వీనర్‌గా మైసూరారెడ్డిని పెడదాం’ అని పెద్దవాళ్లంతా నిర్ణయించినారు. అయితే నాకు స్టేజ్ ఫియరుండేది. ఐదు నిమిషాలు మాట్లాడాలంటే అరగంట ఆలోచించి ప్రిపేర్ అయ్యేవాణ్ని. తర్వాత స్టేజి మీద మాట్లాడడం అలవాటయ్యింది.


పోతిరెడ్డిపాడు సామర్థ్యం పదివేల క్యూసెక్కులు పెట్టినారు. దాని సామర్థ్యం పెంచాలనేది ప్రధాన డిమాండు. తర్వాత శ్రీశైలం కుడికాలువ చిత్తూరు జిల్లాకు పొడిగించాలనీ, ఉద్యోగాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందనీ, కృష్ణానది నికర జలాల్లో వాటా కావాలనీ, రేణిగుంట నుంచి గుంతకల్లుకు రైల్వే డబ్లింగ్ లైన్ కావాలనీ, కడప ఆకాశవాణిని అభివృద్ధి చేయాలనీ, థర్మల్ స్టేషన్ కావాలనీ డిమాండ్లు పెరిగిపోయినాయి. అయితే ప్రత్యేక రాష్ట్రం కావాలని మాత్రం కోరలేదు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నొక్కి చెబుతున్నా... రాష్ట్రంలో ఉంటూనే అభివృద్ధి కావాలనుకున్నాం.


పాదయాత్రలు ఎట్ల జేస్తారు?

ఉద్యమంలో భాగంగా రాయలసీమ ఉద్యోగుల సంఘాలతో కలిసినాం. యూనివర్సిటీ హాస్టల్స్‌కు వెళ్లి విద్యార్థులను కూడగట్టినాం. పత్రికల ఎడిటర్లను కలిసి సమస్యలు ఏమిటో వివరించినాం. నాలుగు జిల్లాల్లో ధర్నాలు చేసినం. సభలు జరిపినం. అయితే డిమాండ్లను ఎట్ల ప్రజల్లోకి తీసుకొనిపోవాల? పాదయాత్ర చేస్తే గ్రామగ్రామాన చెప్పొచ్చు కదాని ఆలోచించినాం.


మరి పాదయాత్రలు ఎట్లా జేస్తారు? ఏదో మఠాధిపతులు చేయడము చూసినాముగానీ రాజకీయ నాయకులు పాదయాత్ర ఏరకంగా చేస్తారో తెలీదు కదా! గాంధీజీ దండి సత్యాగ్రహం బుక్కు గూడా సంపాదించి చదివినా. ఏయే ఊర్లున్నాయి, ఎట్ల నడవాలి, ఎక్కడ ఆగాలి అని ప్లాన్ వేసినాం. తిరుపతి నుంచి కదిరి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, మైదుకూరు మీదుగా పోతిరెడ్డిపాడు వెళ్లాలని ఐడియా. ఇదే వైఎస్ రాజశేఖరరెడ్డికి చెప్పినాం. ఎంవీ రమణారెడ్డి కూడా మంచి ఆలోచనే అన్నాడు. అప్పుడింకో సమస్యొచ్చింది. ఇంతమంది నాయకులు ఎట్ల వెళ్లడం?


అందుకే మరో ఆలోచన జేసి, తిరుపతి(నేను), లేపాక్షి(వైఎస్), కళ్యాణదుర్గం(రమణారెడ్డి), ఆదోని(రఘునాథరెడ్డి), కదిరి(సీహెచ్. చంద్రశేఖర్‌రెడ్డి) నుంచి ప్రారంభమయ్యేట్టుగా ఐదు గ్రూపులు చేసినాం.
అన్ని గ్రూపులూ నంద్యాలలో కలిసి ఆడనుంచి పోతిరెడ్డిపాడుకు వెళ్లాలనేది ఆలోచన. అదే ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్రలకు నాంది అని చెప్పుకోవచ్చు. రోజుకు సగటున 20 కిలోమీటర్లు నడవాలనేది ప్రణాళిక. ఒకరోజు 18 రావొచ్చు, ఒకరోజు 22 రావొచ్చు, కాని మొత్తంగా 420 కిలోమీటర్లను 22 రోజుల్లో పూర్తిచేయాలి.

వెంబడి టెంట్లు, భోజనాలు ఇలా ఏమీ తీసుకెళ్లింది లేదు. కొంచెం పెద్ద గ్రామం చూసుకోవడం, అక్కడే గ్రామస్తులు వండిపెట్టిన పులగమన్నమో, పప్పో తినడం, బడి లాంటిది చూసుకుని పడుకోవడం... వెళ్తూ గ్రామస్తులకు సమస్యలు అర్థమయ్యేట్టు జెప్పడం... దీంతో రాయలసీమ ఉద్యమానికి ఒక ఊపొచ్చింది. తర్వాత వివిధ దశల్లో, వివిధ ప్రభుత్వాల్లో మేము పెట్టిన డిమాండ్లు చాలామట్టుకు పూర్తవుతూ వచ్చినై.

http://www.thehindu.com/multimedia/dynamic/00114/HY10MYSOORA_REDDY_114968e.jpg
బొక్కల దవాఖాన
సమితి ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే రాయలసీమ ఉద్యమం మొదలైంది. అది సహజంగానే రాజకీయంగా ఎదగడానికి తోడ్పడింది. అందువల్లే కమలాపురం నుంచి ఎమ్మెల్యే ఎన్నిక సేఫ్ ల్యాండింగ్ అయింది. అప్పుడు ఎన్టీఆర్ హవా ఉన్నప్పటికీ, టీడీపీ అభ్యర్థి సీతారామయ్య మీద 35,000 మెజారిటీతో గెలిచినాను(1985).

పాత బిల్డింగులో శాసనసభ మొదటి సమావేశం. బీజేపీ సభ్యుడు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతున్నాడు. నిజాం ఆర్థొపెడిక్ హాస్పిటల్ గురించిన అంశం అనుకుంటా. బొక్కల దవాఖాన అన్నాడు. ఇదేంది బొక్కలు అంటాండడు అనుకున్నా. ‘ఏంది ఇంద్రసేన్ ఏదో బొక్కలు అంటివి?’ అని అడిగితి. ‘బొక్కలు బొక్కలు అవే బోన్స్’ అన్నాడు. ఓహో, శాసనసభలో మన భాష మనం మాట్లాడుకోవచ్చు!


రాయలసీమ భాషంటే జంకూగొంకు ఉండే. ఉంటాదిగదా! అప్పట్నుంచీ భాష ఏం మాట్లాడతాండరు అని ఎప్పుడూ ప్రాధాన్యం ఇయ్యలే. వాళ్లు మాట్లాడేదాంట్లో సబ్జెక్టుందా లేదా ఇదే చూస్తాంటి. తర్వాత మైసూరారెడ్డి మాట్లాడితే సామెతలు, పిట్టకథలు చెబుతాడని నా భాష కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ మాట్లాడేటప్పుడు ఏదైనా కొత్త అంశం మాట్లాడగలమా? అని ఆలోచన జేస్తా. ఒకసారి రాజ్యసభలో జ్యుడీషియల్ అకౌంటబిలిటీ బిల్లు ఇంట్రడ్యూస్ అయింది.


అందులో అస్సెట్స్ డిక్లరేషన్‌కు సంబంధించిన ఒక క్లాజ్ ఉన్నింది. ఏందిరా అనంటే హైకోర్టు జడ్జీలు, కిందిస్థాయి జడ్జీలు వారి ఆస్తులకు సంబంధించిన వివరాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికిస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తేమో రాష్ట్రపతికిస్తాడు. ఇవన్నీ ఎలా ఇస్తారు? సీల్డు కవర్లలో! అందరూ సీల్డు కవర్లలో ఇస్తే ఇంగేంటికి? ఇంట్లో బీరువాలో పెడితే పోతాదిగదా అని పాయింట్ లేవనెత్తినాను. దాంతో బిల్లు వెనక్కిపోయింది. అప్పుడు బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ ‘రెడ్డీ, హౌ డిడ్ యు గెట్ దట్ పాయింట్? అర్ యు యాన్ అడ్వొకేట్ ఆర్ వాట్?’ అన్నారు.

http://www.aircargonews.com/FT10/Mysoora-Reddy.gif
చీటీలో మంత్రిపదవి
అప్పుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రి. కాకి మాధవరావు ఆయన పర్సనల్ సెక్రటరీ. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో రాజభవన్‌లో ప్రమాణస్వీకారం అయిపోయి, గ్రూప్‌ఫొటో అయిపోతానే, ‘పోండి, మీ పోర్టుఫోలియోస్ ఆ రూములో ఉన్నాయి చూసుకోపోండి’ అన్నాడు మాధవరావు. వినూత్నంగా ఉండాలని వాళ్లు రాత్రే చీటీల్లో రాసిపెట్టినారు. ఆ రూములో కొంచెం లైటింగ్ తక్కువుంది. చూస్తే హోమ్ అని ఇంగ్లీషులో నాలుగక్షరాలే కనపడినాయి.

బయటికి వస్తానే చెంగారెడ్డి, అడ్వకేట్‌గదా, ‘ఏమయ్యా హోంమంత్రీ, సీఆర్‌పీఎఫ్ తెలుసునా, ఐపీఎస్ తెలుసునా’ అనే. యాదో తెలిసినకాడికి తెలుసులే, లేకపోతే వాళ్లే నేర్పిస్తారుగదాంటి. (లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది కాబట్టి) అప్పటికి అది అంత ప్రాధాన్యత గల శాఖ కాదు. మావాళ్లంతా గూడా ఇదేంటికి, చిన్న శాఖైనా సరే ఇంకేదైనా మార్పించుకో అన్నారు. సర్లేబ్బా ఏదో ఇచ్చినారు, దాన్నే మెప్పించేట్టు పనిచేసుకుందాం అంటి.


నేదురుమల్లి నన్ను హోం మినిస్టర్‌గా ఎంపిక చేయడమే కాకుండా, ఫ్రీహ్యాండ్ ఇచ్చినాడు. నిజాయితీపరున్నని ఆయనకు ప్రత్యేక అభిమానం. అప్పుడు ఐజీ(లా అండ్ ఆర్డర్) వీరనారాయణరెడ్డి ఉండే. దూరపు బంధువు గూడా. ఏదో మీటింగ్ అయిపోయాక చనువుకొద్దీ
‘హోంమంత్రి అయినావుగదా, రాయలసీమ ఆందోళనలో నిన్ను చిత్తూరులో లాకప్‌లో ఏసి కొట్టినాడుగదా, ఆయన గుర్తున్నాడా? ఆయనదేమైనా పనివుంటే జేస్తావా?’ అన్నాడు. రూల్స్ ప్రకారముంటే ఆయనకొచ్చేది ఆయనకిద్దామంటి. ఆయన ప్రమోషన్ పెండింగులో ఉండే. ఓకే చేస్తి. దాంతో నేనేదైనా నార్మ్స్ ప్రకారం చేస్తానని పోలీసుల్లో అభిమానం పెరిగింది.

అట్లనే అప్పుడు నక్సల్స్ యాక్టివిటీస్ ఎక్కువ. ల్యాండ్‌మైన్స్‌లో పోలీసులు చనిపోతాండిరి. దాంతో పోలీసుల్లో భయం ఉంటుండె. చనిపోయినా వాళ్ల శాలరీ కంటిన్యూ అయ్యేట్టుగా నిర్ణయం తీసుకుంటిమి. అలాగే ఐదేళ్ల తర్వాత ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందంటే ఆ ప్రమోషన్ శాలరీ ఇచ్చేది. రిటైర్ అయితే రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేట్టు చేస్తిమి. ప్రాణం ఇవ్వలేముగాని ఉద్యోగ భద్రత కల్పించినాం. దాంతో పోలీసుశాఖలో గౌరవం పెరిగింది. ఈ విధానాన్నే తర్వాత కేంద్రం ఛత్తీస్‌ఘడ్ లాంటి రాష్ట్రాల్లో అమలుచేస్తోంది.

















వైఎస్ నన్ను ‘డాక్టర్’ అని సంబోధించేవారు
రాజశేఖరరెడ్డిని నేను ‘సార్’ అనీ, ‘ఏమండీ’ అనీ పిలిచేవాణ్ని, ఆయన నన్ను ‘డాక్టర్’ అని పలకరించేవారు. కడపలో అందరమూ కాంగ్రెస్‌వాళ్లమే అయినా కందుల ఓబుల్‌రెడ్డిది ఒక వర్గం. బద్వేలు శివరామకృష్ణయ్య, రఘురామిరెడ్డి, నేను... మేమంతా వైఎస్ వర్గం. అయితే 1989,90 ప్రాంతం నుంచి నాకూ, వైఎస్‌కూ కొన్ని కారణాల వల్ల డిఫరెన్సెస్ వచ్చి ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగిపోయింది.

అయినాగూడా వైఎస్ నా రెండో కుమారుడి పెళ్లికి వచ్చినాడు. ఒకసారి అనుకోకుండా ఢిల్లీ నుంచి ఒకే ఫ్లైట్‌లో వస్తుంటే కలిసినాము. కరువు ప్రాంతాలకోసం ఏం చేస్తే బాగుంటుందని అడిగినాడు. నేను పశువుల గడ్డి, తాగునీరుకు సంబంధించి కొన్ని సూచనలు చెప్పాను. అదే అనుకుంటా ఆయన్తో చివరిసారి మాట్లాడటం.


ఎదుగుదలకు పరిమితి ఏముంది?

కొన్ని కారణాల వల్ల నేను 2004లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లాను. అక్కడ కూడా నా గౌరవం నాకుంది. పార్టీనుంచే గదా రాజ్యసభకు వెళ్లాను. గల్లీనుంచి ఢిల్లీస్థాయిలో పేరు తెచ్చుకోవడానికి పార్టీ అవకాశం ఇచ్చిందిగదా!
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiQ4aHsGyMVVD0OCuK17KsRZnmXnYKxnSTWlQUVRQId3aUIh7pEJ79RjUj_ZatjrVNrEBh6Dz2XIbhbEKtNsOx_tpfIE-3NcJCigH2UaZETxTaCqSEXbrCySRV_PDbWzMD1NjfID-96LCw/s1600/newspics+mysoora+babu.JPG
రాజకీయాల్లో ఎదుగుదలకు పరిమితి అంటూ ఏముంది? ఎంతైనా ఎదగొచ్చు. నేను ఎదగాల్సినంతగా ఎదిగానా అన్నదికాదుగానీ నాకైతే ఏ రకంగానూ అసంతృప్తి లేదు. పరిస్థితులు, ప్రభావాలవల్ల కొందరు కొన్నిసార్లు ముఖ్యమంత్రులు కూడా అయినారు. నసీబ్ అంటారు కదా అది కూడా ఉండాలి. నిబంధనలకు లోబడి నేను ఏం చేయగలనో అది చేయడానికే ప్రయత్నించినాను. ఏనాడూ ఏడ్చిందీ లేదు, అయ్యో ఇలాంటి నిర్ణయం తీసుకుని ఒకరిని బాధపెట్టినామే అనుకున్నదీ లేదు. వాళ్లెవరో అంత ఎదిగినారు అని కాకుండా, రైతు కుటుంబంలో పుట్టి ఇంతదాకా వచ్చినాము కదా అనుకుంటాండ.

ప్రొఫైల్...

పూర్తి పేరు : మూలె వెంకట మైసూరారెడ్డి
తల్లిదండ్రులు : సుబ్బమ్మ, బాల మైసూరారెడ్డి
జన్మదినం : 28.2.1949
జన్మస్థలం : కడప జిల్లా నిడిజివ్వి
వృత్తి : కర్నూలులోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశాక డాక్టర్‌గా ప్రాక్టీస్ చేశారు.
భార్య : స్వరూప
పిల్లలు : ఇద్దరు కుమారులు; హర్షవర్ధన్‌రెడ్డి, రఘుకార్తీక్‌రెడ్డి (ఒకరు ఇంజినీరింగ్, మరొకరు డిగ్రీ చదివారు. మైనింగ్ బిజినెస్‌లో ఉన్నారు.)
నియోజకవర్గం : కమలాపురం
ఎమ్మెల్యే : 1985-94; 1999-2004
హోం, ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ : 1990-94
సందర్శించిన దేశాలు : చైనా, దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్, శ్రీలంక, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ.
ప్రస్తుతం : 2006 ఏప్రిల్ నుంచి రాజ్యసభ సభ్యుడు

సైడ్‌లైట్
ఇంటర్వ్యూ సాగుతున్న సమయంలో మైసూరా రెండున్నరేళ్ల మనవడు శ్రీతన్ ‘అబ్బా’ అంటూ వచ్చి, ఆయన ఒళ్లో కూర్చున్నాడు. ‘ఇదేం పేరు సర్?’ అంటే, ఇప్పుడందరికీ యాడలేని పేరుగావాలిగదా, అని నవ్వారు. వెంకటేశ్వరస్వామికి ఇదో పేరని తర్వాత చెప్పారు.

పర్సనల్ ట్రివియా...


విద్యార్థి దశలో సినిమాలు అవీ చూసేవాణ్ని. పేక కూడా బాగా ఆడేవాణ్ని. రాజకీయాల్లోకి వచ్చాక రెండూ పోయాయి.

నచ్చే నాయకుడిగా గాంధీజీ పేరే చెబుతాను. ఆయనకున్న దూరదృష్టి సామాన్యమైనది కాదు.
పుస్తకాలు చదువుతానుగానీ సాహిత్యాభిలషతో కాదు. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చేవే చదువుతాను.
గాడ్‌ఫాదర్లంటూ ఎవరూ లేరు, సంఘటనలే నన్ను మలిచాయి.
మాది పెద్దలు కుదిర్చిన పెళ్లే. అంతకుముందు మా కుటుంబాలకు బంధుత్వం ఏమీ లేదు. అమ్మాయిని చూశా, నచ్చింది, చేసుకున్నా.
ఏ భర్తకైనా, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్లకైతే భార్య సహకారం తప్పనిసరి. ఇంట్లో రొద ఉంటే, బయట ఎలా తిరుగుతాం? ఆ విషయంలో ఆమె పూర్తి సహకారం అందించింది.
ఇద్దరబ్బాయిలకూ రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి కనబడటం లేదు. నేనూ వారిని బలవంతపెట్టి తేవాలని అనుకోవట్లేదు.
ఎక్కడ పుట్టినానో, ఎక్కడ పెరిగినానో అక్కడ ఇప్పటికీ మాకు ఇల్లుంది. జిల్లాకు పోతే ఇప్పటికీ రాత్రికి ఊర్లోనే ఉంటాను.
నేను ఆస్తికుడినీ కాదు, నాస్తికుడినీ కాదు. ఇంట్లోవాళ్లు మాత్రం పూజలవీ చేసుకుంటాంటరు.
విదేశాల్లో ఏదో గొప్ప అభివృద్ధి జరుగుతుందన్న భ్రమ నాకు లేదు. చైనాలో అవినీతి లేదంటారుగానీ నాకు అక్కడే ఎక్కువ ఉన్నట్టు కనబడింది.
అన్నివేళలా నాకు అండగావుండే బంధువులు, మిత్రులే నా బలం. 

- సాక్షి Daily

Saturday, January 14, 2012

పందెం పోరులో రాజకీయ పుంజులు

 

కొక్కొరొ... కొ.. అంటే కొట్లాట
పందెం పోరులో రాజకీయ పుంజులు
ఓట్లు బెట్ కాస్తూ జనం ముందుకు
పొలిటి'కోళ్లు' 

ప్రత్యర్థులపై విచ్చు కత్తులు
తమలో తామే 'కూల్చే ఎత్తులు'
కాంగ్రెస్ బరిలో అనేక కోళ్లు
టీడీపీ, టీఆర్ఎస్‌లో ఫ్యామిలీ ఫైట్
ఎన్నికలు రాక ముందే బరిలోకి
కళ్లలో కసి... కదలికలో వ్యూహం... కత్తిగట్టిన కాలిదెబ్బ... అబ్బో! బరిలో దిగిన పందెం కోళ్ల పౌరుషాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు. సంక్రాంతి అంటేనే కొ... క్కొ...క్కొరోకో... కోళ్ల పందేలు! ఇది ఏడాదికో పండగ! కానీ... రాజకీయ పందెం కోళ్లకు నిత్యం సంక్రాంతే! చాన్స్ చిక్కిందంటే... కొట్టుకోవడమే! ఈకలు పీక్కోవడమే! ఈ పొలిటికల్ కోళ్లు ప్రత్యర్థి కోళ్లపై విరుచుకుపడుతుంటాయి. మైకులు పట్టుకు నమిలేస్తుంటాయి. తెలుగుదేశం - కాంగ్రెస్ - టీఆర్ఎస్ ఈ మూడు పార్టీల పందెం కోళ్లు ఒకదానిపై ఒకటి మీదపడి రక్కేసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

తెలుగుదేశం - కాంగ్రెస్ - వైఎస్ఆర్ కాంగ్రెస్ కోళ్లు కూడా కాలి వేళ్లకు కత్తులు కట్టుకుని ఎగురుతుంటాయి. ఇలా పార్టీల మధ్య జరిగే పందేలు ఒకవైపు... ఒకే పార్టీలో ఉంటూ పరస్పరం కొట్టుకునే కోళ్లు మరో వైపు! మొదటిరకం పందేలు అందరికీ తెలిసినవే. రెండో రకం కోళ్ల పందేలు మాత్రం తెరవెనుక జరుగుతుంటాయి. ఈ కోళ్లు అదను చూసుకుని 'కత్తి గోరు' విసిరేందుకు వేచి చూస్తుంటాయి. ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా లేకుండా... అన్ని పార్టీల్లోనూ ఈ కుమ్ములాటల కోళ్లు ఉన్నాయి. ఇక చూసుకోండి వాటి రక్కిసలాట...

కాంగ్రెస్‌లో ఎన్నెన్ని కోళ్లో..
ఎక్కడైనా, ఏ బరిలోనైనా ఒక బరిలో, ఒకే సమయంలో రెండు కోళ్లే కొట్టుకుంటాయి. కానీ... కాంగ్రెస్ బరి తరీఖానే వేరు. ఒకేసారి ఆరేడు కోళ్లు బరిలోకి దిగి కీచులాడుకుంటాయి. ఒకే కోడి మీదికి నాలుగైదు కోళ్లు కాలు దువ్వుతాయి. అలాగని ఆ నాలుగైదు కోళ్లు కలిసి మెలిసి ఉంటాయా అంటే అదీ లేదు. ప్రధాన పోటీ మాత్రం... సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సల మధ్యే ఉంటుంది. బరిని విచ్చలవిడిగా ఏలుదామని వచ్చిన కిరణ్‌కు బొత్స పెను సవాల్‌గా మారారు. చీటికి మాటికి ఢిల్లీ పెద్దలను కదలడం, కిరణ్‌ను ఇరుకున పెట్టేలా గుడిసెపైకి ఎక్కి 'కొక్కొరొకో' అనడం బొత్సకు షరా మామూలే.
vestrana

అయితే... మద్యం సిండికేట్‌పై ఏసీబీ దాడులతో బొత్సను డిఫెన్స్‌లో పడేయడంలో కిరణ్ విజయం సాధించారనే చెప్పాలి. ఒక 'కోడి' కొంత దారిన వచ్చిందని అనుకునేలోపే... ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మరింత పెద్ద కత్తులు కట్టుకుని దిగారు. సమన్వయ కమిటీ సమావేశంలో సీఎంను 'అంశాల' వారీగా నిలదీసినట్లు కనిపించినప్పటికీ... పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమని నిరూపించుకోవడమే రాజనర్సింహ అసలు లక్ష్యం.
అత్యంత ముఖ్యమైన తెలంగాణ అంశంపైనా పార్టీ వైఖరికే కట్టుబడి ఉంటానని ప్రకటించడం, తరచూ ఢిల్లీకి వెళ్లి తన 'ప్రయత్నాలు' సాగించడం ద్వారా రాజనర్సింహ బరిలోని 'పెద్ద కోడి'కి చికాకు తెప్పిస్తున్నారు. బరిని ఏలేందుకు చేతిలో కర్చీఫ్ పట్టుకుని తిరుగుతున్నారు. ఇక చిరంజీవి, నాదెండ్ల మనోహర్ కూడా బరిలో ఉన్నప్పటికీ... కిరణ్‌తో హోరాహోరీగా మాత్రం పోరాడటంలేదు. 'టైమ్ వస్తే దూకుదాం' అని వేచి చూసే రకం! మంత్రి శంకర్రావు వంటి 'చిలిపి కోళ్లు' ఉండనే ఉన్నాయి. అయితే... కాంగ్రెస్ బరిలో ఎప్పుడు, ఏయే కోళ్లు కీచులాడుకుంటాయనేది ఎప్పుడూ ఆసక్తికరమే!
'దేశం' పుంజుల కోలాహలం
తెలుగుదేశం బరిలో రకరకాల కోళ్లు కొట్టుకుంటున్నాయి. టీడీపీ తెలంగాణ ఫోరం బరిలో ఒకవైపు ఎర్రబెల్లి దయాకర రావు, మరోవైపు మోత్కుపల్లి నర్సింహులు! పైకి గాయాలు కనిపించకుండా కొట్టుకోవడమే వీరి 'ఫైట్' ప్రత్యేకత. టీ-టీడీపీ ఫోరం కన్వీనర్‌గా తనకే గుర్తింపు రావాలన్నది ఎర్రబెల్లి ఆరాటం. కేసీఆర్‌పై గొంతు చించుకుని, మేడెక్కి అరిచేది తాను కాబట్టి, తనకే 'పెద్ద కోడి'గా పట్టం కట్టాలనేది మోత్కుపల్లి పోరాటం! అయితే... ఈ రెండు కోళ్లకూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. మోత్కుపల్లిలా గట్టిగా అరవలేకపోవడం ఎర్రబెల్లి బలహీనత. ఎర్రబెల్లి స్థాయిలో సమన్వయ నైపుణ్యం లేకపోవడం మోత్కుపల్లి వీక్‌నెస్.

తెలుగుదేశం 'ఫ్యామిలీ' బరిలోనూ కోళ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. 'పెద్దకోడి' చంద్రబాబుకు తెలుగుదేశం బరిని మరో పదేళ్లపాటు ఏలగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ... 'నెక్ట్స్ ఎవరు?' అనే అంశంపై తేల్చుకునేందుకే పోరు సాగుతోంది. అయితే... ఈ పోరు ఇతర ప్రేక్షకులకు కనిపించేది కాదు. అంతా అంతర్గతమే. ఈ పోరు బరిలో ఉన్నది ఎవరో కాదు! అన్నదమ్ములైన హరికృష్ణ, బాలకృష్ణలే! భవిష్యత్ రాజకీయాలపై వీరిమధ్య అపార్థాలునెలకొన్నాయి. తన కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ కోసం బరిని సిద్ధం చేయాలని హరికృష్ణ ఇప్పటి నుంచే తహతహలాడుతున్నారు.

ఇందుకు బాలకృష్ణ అడ్డొస్తాడన్నది ఆయన భయం. బాలయ్య తన అల్లుడైన నారా లోకేశ్‌నే ప్రమోట్ చేస్తారని భావిస్తున్నారు. దీనికి తగినట్లుగానే, ఇటీవల బాలయ్య 'కూత' ఈమధ్య జోరందుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. ఈ మధ్య హరికృష్ణ, బాలకృష్ణ పరస్పరం మాట్లాడుకోవడం తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ వైపు చూడటమే మానేశారు.

టీఆర్ఎస్‌లో మామా అల్లుళ్ల సవాల్
టీఆర్ఎస్‌లోనూ తెలుగుదేశం తరహా కోళ్ల పందెమే జరుగుతోంది. అటు తెలంగాణ బరిలో, ఇటు టీఆర్ఎస్ పార్టీ బరిలో ఇప్పుడు కేసీఆర్ మాటకు ఎదురే లేదు. ఆయనే నెంబర్ వన్! 'నెంబర్ 2' కోడి ఎవరో తేల్చుకునేందుకు హరీశ్‌రావు, కేటీఆర్‌ల మధ్య పోరాటం జరుగుతోంది. ఇప్పటికే పార్టీలో హరీశ్‌వర్గం, కేటీఆర్ వర్గం అనే విభజన వచ్చింది.
http://images.blogs.hindustantimes.com/dabs-and-jabs/post/KCR.jpg
కేటీఆర్‌తో పోల్చితే... పార్టీని నడపడం, వ్యూహ రచనలు, సమన్వయ సాధనలో హరీశ్‌రావుకే ఎక్కువ మార్కులు పడతాయి. కానీ... పార్టీ తరఫున అధికారికంగా మాట్లాడే అవకాశం ఎక్కువ సందర్భాల్లో కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్‌కే దక్కుతోంది. దీనిపై హరీశ్‌లో అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోకున్నప్పటికీ... గ్రూపులు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. వీరిద్దరి మధ్య పార్టీలోని 'చిన్న కోళ్లు' నలిగిపోతుండటం మాత్రం నిజం.

'దేశం'పై జగన్ గురి

ఇదో చిత్రమైన బరి! ఈ పార్టీలో పెద్ద కోడి జగన్. అయితే... రాష్ట్ర రాజకీయ పోరు మాత్రం జగన్ పార్టీ చుట్టూనే తిరుగుతోంది. 2014లోపు జగన్‌ను బలహీనం చేస్తే తనకు ఎదురేలేదని చంద్రబాబు... బాబును దెబ్బతీస్తే అధికారం తనదేనని జగన్ భావిస్తున్నారు. అత్యంత చిత్రంగా... ఈ పోరులో అధికార కాంగ్రెస్ బరి నుంచి పక్కకు వెళ్లిపోయింది. ఇరుప్రాంతాల్లోనూ కాంగ్రెస్ బలహీనపడిందని జగన్, చంద్రబాబు భావిస్తుండటమే దీనికి కారణం. టీడీపీలోని ప్రధాన పందెం కోళ్లన్నీ జగన్‌ను ఎదుర్కోవడంపైనే దృష్టి పెట్టాయి.

డేగ కళ్లు, వాడి కాళ్లు వేసుకుని... చిన్న అవకాశం దొరికినా దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. జగన్ కూడా అంతే! తాను కేసుల్లో ఇరుక్కోవడంతో చంద్రబాబుపైనా తన తల్లితో కేసులు వేయించారు. విషయాన్ని సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లారు. తనపైనా, తన తండ్రిపైనా ఎవరు ఏ ఆరోపణలు చేసినా, దాని మూలాలు చంద్రబాబు హయాంలోనే ఉన్నాయంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. మొత్తానికి... అధికార పార్టీ అస్త్ర సన్యాసం చేయగా, రెండు ప్రతిపక్ష పార్టీలు కొట్టుకోవడం బహుశా రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదే మొదటిసారి.

బహు బరులు... బడా కోళ్లు
కిరణ్ - జగన్, కిరణ్ - చంద్రబాబు, చంద్రబాబు - కేసీఆర్... ఇలా బడా కోళ్ల మధ్య భారీ పోరాటమే జరుగుతోంది. కిరణ్‌ను ముఖ్యమంత్రిగా నియమించడంతో... ఇక తనకు తలుపులు మూసేసినట్లేనని జగన్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చేశారు. ఆ క్షణం నుంచి కిరణ్‌ను బలహీనం చేయడంపై దృష్టి సారించారు. పథకాలు మూలనపడ్డాయని ప్రతి సభలో తిట్టిపోయడం ఇందులో భాగమే. అవిశ్వాసం ద్వారా కోలుకోలేని దెబ్బ కొట్టాలని జగన్ భావించినప్పటికీ... ఈ విషయంలో కిరణ్‌దే పైచేయి అయ్యింది. సామాజిక వర్గం, ప్రాంతం, ఎమ్మెల్యేల మధ్య తమ పట్టు నిలుపుకొనేందుకు కిరణ్, జగన్ మధ్య పోరు జరుగుతూనే ఉంది.

ఇక, తెలంగాణలో చంద్రబాబును బలహీన పరచాలని కేసీఆర్... టీఆర్ఎస్‌ను ఎంతోకొంత నిలువరించాలని చంద్రబాబు పరస్పరం కలహించుకుంటూనే ఉన్నారు. టీడీపీని దెబ్బతీస్తే తెలంగాణలో 80 శాతం సీట్లు స్వీప్ చేయవచ్చన్నది కేసీఆర్ ఆలోచన. ఆ చాన్స్ ఇవ్వకుండా... తెలంగాణలో కొన్ని, సీమాంధ్రలో భారీగా సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు ప్రయత్నం. అందుకే... టీఆర్ఎస్, టీడీపీ కోళ్ల మధ్య తెలంగాణలో హోరాహోరీ పోరు జరుగుతోంది. 'నువ్వొకటంటే నేను నాలుగంటా' అన్నట్లుగా పోటా పోటీ ప్రెస్ మీట్లు, విమర్శలు! రాజకీయ బరిలో ఇదో రసవత్తర పోరు!

ఈ కోళ్లూ ఉన్నాయ్...

రాజకీయ కోళ్ల పందెంలో సీపీఎం, సీపీఐ బాగా వెనుకబడ్డాయి. 2004-09 మధ్య కాళ్లకు కత్తులు కట్టుకుని వీరోచితంగా పోరు సాగించిన సీపీఎం ఈ మధ్య కాలంలో అస్త్ర సన్యాసం చేసింది. టీడీపీ, కాంగ్రెస్‌లతో వెళ్లలేక... జగన్‌తో జట్టుకట్టే విషయంపై తేల్చుకోలేక... అత్యంత అయోమయంలో పడింది. సీపీఎంతో పోల్చితే సీపీఐ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. 'పుంజు కోడి' నారాయణ నోరే ఈ పార్టీకి కొండంత బలం. వారూ వీరని కాకుండా, ఎవ్వరిపైనైనా ఇంతేసి నోరు వేసుకుని పడటం, ఏదో ఒకస్థాయి పోరాటాలతో ఆయన పార్టీ ఉనికిని కాపాడటంలో విజయవంతం అయ్యారు. టీడీపీతో దోస్తీ సాగించాలని నిర్ణయించుకున్నారు.

ఇక... బీజేపీ పరిస్థితి కూడా అయోమయంలోనే ఉంది. 'తెలంగాణ' నినాదాన్ని టీఆర్ఎస్ తర్వాత అత్యంత స్పష్టంగా భుజానికెత్తుకున్న ఈ పార్టీ సీమాంధ్రలో అడుగుపెట్టలేక పోతోంది. అలాగని... తెలంగాణలో దూసుకుపోతోందా.. అంటే అదీ లేదు. జేఏసీ భాగస్వామ్య పార్టీగా టీఆర్ఎస్ నీడ నుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే యాత్రల ద్వారా సొంత వ్యూహం రచిస్తోంది.

కొసమెరుపు: పార్టీల పందెం కోళ్లు ఎంతగా కొట్టుకుంటున్నా... ఎవరి బలం ఎంతో తేలేందుకు 2014 దాకా ఆగాల్సిందే. కానీ, బరి సిద్ధకాకముందే, పోటీని వీక్షించే ప్రజలు గుమికూడక ముందే కోళ్లు కొట్టుకోవడం మొదలుపెట్టాయి. మరో రెండేళ్లకు ఎవరి కత్తులు మొద్దు బారిపోతాయో, ఎవరివి వాడిగా ఉంటాయో వేచి చూడాలి మరి! 
http://www.thehindu.com/multimedia/dynamic/00503/16_P1_CARTOON_503599e.jpg

Sunday, April 24, 2011

కడపలో పంచతంత్రం

ఆ ఐదుగురూ ఐదుగురే. ఒక్కోరిదీ ఒక్కో స్టైల్‌. ఎవరి వ్యూహాలు వారివి. ప్రజల పల్సు పట్టేందుకు ఎవరి దారిలో వారు పయనిస్తున్నారు. వీరికి ఎన్ని సానుకూల అంశాలు న్నాయో.. అన్ని ప్రతికూలాంశాలు ఉన్నాయి. వీరికి ఈ ఎన్నికలు ఒక పరీక్ష. ఒక సవాలు. ఇప్పుడు ప్రచారంలో వాటినే ఎదుర్కొంటున్నారు.వచ్చే నెలలో జరగనున్న కడప పార్లమెంటు, పులివెందుల ఉప ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్ధులుగా మారిన ఐదుగురు నేతలు అప్రతిహతంగా, అవి శ్రాంతంగా పోరాడుతున్నారు. పులివెందులలో వదిన -మరిది మధ్య హోరాహోరీ సంగ్రామం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి తనయుడు స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ చేస్తున్నారు. ఆమెపై వైఎస్‌ సోద రుడు, సొంత మరిది వైఎస్‌ వివేకానందరెడ్డి బరిలో ఉన్నా రు. వారిద్దరూ వారి వారి కుటుంబసభ్యుల దన్నుతో ప్రచా రంలో ముందున్నారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బీటెక్‌ రవి బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మధ్యనే పోటీ నెలకొంది. వారిద్దరి మధ్య చీలే ఓట్లతో బయటపడాలన్నది బీటెక్‌ రవి ఆశగా కనిపిస్తోంది. విజయ లక్ష్మి మరోసారి సానుభూతి ఓట్లపై ఆశపెట్టుకున్నారు.

ఇక పార్లమెంటు అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ స్వయంగా అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఎంపీ మైసురారెడ్డి రంగంలో ఉన్నారు. ముగ్గు రూ అవిశ్రాంతంగా ప్రచారబరిలో దూసుకువెళుతున్నారు.అయితే ఈ ముగ్గురు అభ్యర్ధులకు సొంత జిల్లా కంటే బయట జిల్లాల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్న వారే ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం.

అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించిన జగన్‌కు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ..గురునాధరెడ్డి, కొండా సురేఖ, రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, శేషారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, షాజ హాన్‌, శోభానాగిరెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, జూపూడి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావు, సినీ నటి రోజా వంటి ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. పులి వెందులలో విజయలక్ష్మికి మద్దతుగా కుటుంబసభ్యులం తా బరిలో నిలిచారు. ఆమె ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రతి ఇంటికీ తిరుగుతున్నారు. కూతురు షర్మిల ఆమెతోనే ఉంటున్నారు. జగన్‌ ఎక్కువగా తన తండ్రి మృతి చెందిన సానుభూతి ఓట్లపైనే ఆధారపడుతున్నారు.

ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి డీఎల్‌ రవీంద్రారెడ్డికి మద్దతుగా మంత్రులు ప్రచారంలో నిలుస్తున్నారు. ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో.. మంత్రి ధర్మాన ప్రసాదరావు, బొత్స, అహ్మదుల్లా, మోపిదేవి, మహీధర్‌ రెడ్డి, ఆనం, రఘువీరారెడ్డి, గల్లా, మాణిక్యవరప్రసాద్‌, బస్వరాజు సారయ్య వంటి ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే లు కూడా కడపలోనే మోహరించారు. మంత్రులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మండలా నికి ఒక్కో ఎమ్మెల్యే బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుం డగా, ఈనెల 28 నుంచి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి మూడురోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో జగన్‌ కు వచ్చిన ఓట్లలో చీలికతో జగన్‌ గట్టెక్కరని డీఎల్‌ ఆశాభావంతో ఉన్నారు. పులివెందులలో కాంగ్రెస్‌ అభ్యర్ధి వైఎస్‌ వివేకానందరెడ్డి అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నా రు. ఆయనకు కుటుంబసభ్యులు దన్నుగా నిలస్తున్నారు. మంత్రులు పులివెందుల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.

ఇక్కడ విజయలక్ష్మి కంటే వివేకానందరెడ్డే ఎక్కువగా ప్రజలతో ఎక్కువ సేపు గడుపుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎం.వి.మైసురారెడ్డి కూ డా అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. నామా నాగేశ్వరరావు, రమేష్‌రాథోడ్‌, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, తుమ్మల నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్‌, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్‌.రమణ, తలసాని శ్రీనివాసయాదవ్‌, రేవంత్‌రెడ్డి, శ్రీరాం తాతయ్య, పల్లె రఘునాధరెడ్డి, రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అబ్దుల్‌ఘనీ, రామకృష్ణ, సీఎం రమేష్‌, గరికపాటి మోహన్‌రావు, బాబూ రాజేంద్రప్రసాద్‌, సినీ నటి కవిత, తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి తదితరులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యే ఇన్చార్జిగా, వారికి సహాయకులుగా రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Jagans 


       సానుకూలత
  • వైఎస్‌ మృతి సానుభూతి. కొడుకుగా వాటిని పొందే యత్నం.
  • గ్రామ నేతలపై పట్టు. క్రిస్టియన్లు, ముస్లిం ఓటు బ్యాంక్‌.
  • కాంగ్రెస్‌ ఓట్లలో భారీ చీలిక.
  • అంతమంది కలసి ఒక్కడిని ఓడించేందుకు యత్నిస్తున్నారన్న స్థానిక సెంటిమెంట్‌.
  • నాలుగు నియోజకవర్గాల్లో సొంత ఎమ్మెల్యేల బలం.

    ప్రతికూలత
  • గతంలో తనకు వచ్చిన ఓట్ల చీలికతో నష్టం. గెలిస్తే బీజేపీతో కలసిపనిచేస్తారన్న ప్రచారంతో కలవరం. దానివల్ల క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు, ముస్లిం ఓట్లు దూరమయ్యే ప్రమాదం.
  • తన వర్గీయులపై పోలీసుల కట్టడితో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గే ప్రమాదం. అది తగ్గితే మెజారిటీ ఎంతన్నది అనుమానం.
  • ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటారన్న కారణంతో స్థానికంగా ఉండరన్న విమర్శలు. అవినీతిపరుడన్న ప్రచారం మైనస్‌ పాయింట్‌. ఆరేళ్లలో లక్షకోట్లు అక్రమంగా సంపాదించారన్న విమర్శలు.
  • గతానికి భిన్నంగా కాంగ్రెస్‌-టీడీపీలను ఏకకాలంలో ఎదుర్కోవలసి రావడం.

    డీఎల్‌ రవీంద్రరెడ్డి
  • సానుకూలతravin.(Maidukuru)
  • వివాదరహిత ముద్ర.
  • గతంలో జగన్‌కు పడిన ఓట్ల చీలి కపై ఆశ.
  • ప్రభుత్వ యంత్రాంగం మద్దతు.
  • ఎస్సీ, మైనారిటీల ఓటు బ్యాంకుపై ఆశ.
  • అందుబాటులో ఉంటారన్న సానుకూలత.

    ప్రతికూలత

  • ఎవరికీ పనులు చేయరని, అహంకార పూరితంగా వ్యవహరిస్తారని, ఎవరినీ కనీసం గౌరవించరన్న విమర్శలతో కొంత మైనస్‌.
  • సొంత నియోజకవర్గంలోనే పలుకుబడి లేని వైనం. జగన్‌కే ఎక్కువ బలం ఉండటం.
  • ప్రచారంలో జగన్‌ వర్గీయుల నుంచి ప్రతిరోజూ ఎదురీత. ప్రజల నుంచి నిరసనలు.
  • బలవంతంగా పోటీకి దిగారన్న అప్రతిష్ఠ.
  • పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు లేకపోవడం.

    మైసూరారెడ్డి
    mysooraeddyసానుకూలత
  • కడప జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేతగా, పాదయాత్రలు చేసిన సీమ నేతగా సుదీర్ఘకాల గుర్తింపు.
  • వివాద రహిత ముద్ర.
  • హంగు, ఆర్భాటాలకు దూరం.
  • అవినీతి ముద్ర లేకపోవడం.
  • విశ్వసనీయత కలిగిన నేతగా గుర్తింపు.

    ప్రతికూలత
  • కడప జిల్లాలో ఉండే సమయం తక్కువ.
  • రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు ఉన్నప్పటికీ ఎక్కువగా తన నియోజకవర్గ, తన మండలం, తన గ్రామానికే పరిమితం కావడం.
  • సాధారణ నేతల మాదిరిగా జనాలతో మమేకం కాలేకపోవడం.
  • జిల్లా నేతలతో అంతంత మాత్రపు సంబంధాలు.
  • పెద్ద వక్త కాకపోవడం. ఎదుటి వారి మనోభావాలను పట్టించు కోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం.

    వైఎస్‌ విజయలక్ష్మి

    vijyasmaసానుకూలత
  • వైఎస్‌ భార్యగా సానుభూతి.
  • ఎప్పుడూ బయటకు రాని ఆమె ఈ ఎన్నికల్లో ప్రతి గడప ఎక్కడంతో పెరుగుతున్న సానుభూతి.
  • భారీ బలగం ఉన్న కుటుంబసభ్యుల అండ.
  • ఇతరులకు సహాయపడాలన్న తత్వం.
  • వివాదరహిత మనస్తత్వం.

    ప్రతికూలత

  • ఇంతకాలం ప్రజలకు దూరంగా ఉండటం.
  • సమస్యలపై అవగాహన లేకపోవడం. వక్త కాకపోవడం.
  • రాజకీయ కుటుంబంలో ఉన్నా రాజకీయాలపై అవగాహన లేకపోవడం.
  • స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవడం.
  • ఒకసారి అసెంబ్లీకి గెలిపించినా ఒక్కసారి కూడా సభకు రాలేదన్న అపఖ్యాతి. సానుభూతి ఈసారి ఎన్నికలో పనిచేస్తుందా లేదానన్న సంశయం.

    వైఎస్‌ వివేకానందరెడ్డి
    YS-Vivekanadareddyసానుకూలత

  • అందరికీ అందుబాటులో ఉండే నైజం.
  • మండలాలు, గ్రామాల్లో అందరినీ పేరు పెట్టి పిలిచేంత పరిచయాలు, చనువు. విస్తృతమైన బంధుత్వాలు.
  • సమస్యలపై పూర్తి అవగాహన.
  • ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్‌కు ఆయనే రధసారథి కావడంతో పెద్దగా సమస్యలు లేని సానుకూలత.
  • అవినీతిపరుడన్న ముద్ర లేకపోవడం.

    ప్రతికూలత

  • వైఎస్‌ కుటుంబంతో విబేధాల వల్ల ఆ కుటుంబ మద్దతు కోల్పోవడం.
  • వైఎస్‌ బంధుగణాలు మూకుమ్మడిగా దూరమవుతున్న వైనం.
  • ఆపదలో అన్న కొడుకుకు అండగా నిలబడలేదన్న అపవాదు.
  • కాంగ్రెస్‌ ఓట్లలో చీలిక.
  • ఇన్నాళ్లూ ‘అన్న’ బలమే తన బలమని భావించారు. ఫలితంగా ఇప్పుడు సొంత వర్గమంటూ లేకపోవడం.

    బీటెక్‌ రవి
    prsonసానుకూలత
  • రాజకీయాలకు కొత్త.
  • అవినీతి ముద్ర లేకపోవడం.
  • యువకుడు కావడం.
  • నియోజకవర్గంలో పార్టీకి శాశ్వ త ఓటు బ్యాంకు ఉండటం.
  • ధనబలం ఉండటం.

    ప్రతికూలత
  • సొంత పార్టీలోనే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత.
  • బలమైన వర్గం లేకపోవడం.
  • పార్టీ నేతలతో సంబంధాలు అంతంతమాత్రమే.
  • సమస్యలపై అవగాహన లేకపోవడం.
  • కొత్త అభ్యర్ధి కావడం, జగన్‌ కుటుంబస్థాయిలో ఆర్థి కంగా బలంగా లేకపోవడం.

Saturday, January 8, 2011

కిం.. కర్తవ్యం ?

Babu
శ్రీ కృష్ణ కమిటీ నివేదిక పెట్టిన చిచ్చు మూడు ప్రధాన రాజకీయ పార్టీలో ఇంకా రగులుతోంది. కాంగ్రెస్‌-టీడీపీ ఒకేరకమైన సమస్యతో సతమత మవుతుంటే, టీఆర్‌ఎస్‌ మరో రకమైన సమస్యతో ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై అనుసరించాల్సిన వైఖరి కాంగ్రెస్‌-టీడీపీలకు ప్రాణసంకటంలా మారగా, కేసీఆర్‌ మాత్రం తన భవిష్యత్‌ రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో కాంగ్రెస్‌పై అనుసరించాల్సిన వ్యూహమేమిటో తెలియక అయోమయంలో ఉన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ-సీమాంధ్రలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఎలాంటి వైఖరి అనుసరిం చాలో తెలియక అవస్థలు పడుతోంది. ఏ ప్రాంతం వైపు మొగ్గుచూపినా మరొక ప్రాంతంలో దెబ్బ తింటా మన్న భయం వెన్నాడుతోంది.

తెలంగాణ వైపు మొగ్గుచూపినా ఆ రాజకీయ లబ్థి టీఆర్‌ఎస్‌- బీజేపీకి వెళుతుందన్న భయం కూడా లేకపోలేదు. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాజీ నామా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. వారు గతంలో అనుసరించిన వైఖరిని బట్టి, ఈసారి కూడా అంత సీను ఉండదని, మళ్లీ అధిష్ఠానం హెచ్చరికలతో మరోసారి అస్తస్రన్యాసం చేస్తారన్న అంచనా తెలం గాణ ప్రజల్లో ఉంది. పీసీసీ అధ్యక్షుడుడీఎస్‌ స్వయంగా తెలంగాణ నేత అయినప్పటికీ, పార్టీ వైఖరిని ప్రకటిం చలేకపోతున్నారు. మరోవైపు పార్టీ వైఖరితో ప్రజల్లో ముఖం చూపించలేక తెలంగాణ ఎంపీలు తల్లడిల్లిపోతున్నారు. అందుకే భేటీల మీద భేటీలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.

kcrr 

ఇక తెలంగాణ కోసం ఏర్పడిన టీ ఆర్‌ఎస్‌ మరో విచిత్ర మైన ఇరకాటంలో ఇబ్బంది పడింది. సోనియాగాంధీ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేసిందని, చంద్రబాబు నాయుడు ఒక్కరే తెలంగాణకు అడ్డుపడుతున్నారని మొన్నటి వరకూ ప్రచారం చేసిన కేసీఆర్‌ ఇప్పుడు యుపీఏ అడ్డం తిరగడంతో ఆత్మరక్షణలో పడ్డారు. శ్రీ కృష్ణ కమిటీ తెలంగాణకు వ్యతిరేక తీర్పు ఇవ్వడంతో సోనియాగాంధీని విమర్శించాలో, వద్దో అర్థం కాక సతమతమవుతున్నారు. నిజంగా సోనియాగాంధీ తెలంగాణ ఎప్పుడో ఇచ్చినట్టయితే, శ్రీ కృష్ణ కమిటీ నివేదిక, దానిపై చిదంబరం భేటీ, మళ్లీ ఈనెలాఖరులో చిదంబరం భేటీ ఎందుకన్న ప్రశ్నలు తెలంగాణలోని సామాన్య జనంలో మొదలు కావడం ఇబ్బంది కలిగిస్తోంది.

తన దీక్ష విరమణ సందర్భంగా డిసెంబర్‌ 9న చిదంబరం చేయవలసిన ప్రకటనను తానే నిర్దేశించానని సగర్వంగా చెప్పు కున్న కేసీఆర్‌.. ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఎందుకు ప్రకటన చేయించలేదంటూ టీఆర్‌ఎస్‌ ప్రతర్థి వర్గాలు నిలదీస్తుండటం ఆ పార్టీకి ఇరకా టంగా పరిణమించింది. బహుశా ఇలాంటి ఇరకాటం తోనే కేసీఆర్‌ జోరు తగ్గించారని, పార్లమెంటు సమావేశాల వరకూ గడువు ఇచ్చి, ఆ లోగా జరిగే పరిణామాలను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలన్న భావనతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇప్పటికీ కేసీఆర్‌ సోనియాగాంధీని విమ ర్శించకపోవడం కూడా చర్చనీయాంశమయింది. భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసమే ఆయన సోనియాను విమర్శించడం లేదని, కాంగ్రెస్‌ను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేకనే ఆయన వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

D.-Sriniva 

అందుకే గత డిసెంబర్‌ ముందున్న స్పీడు, జోరు ఆయనలో కనిపించడం లేదంటున్నారు.అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా తెలంగాణపై సంకట స్థితినే ఎదుర్కొంటు న్నారు. తెలంగాణకు ప్రత్యేక శాఖ ఏర్పాటుచేయా లన్న డిమాండ్‌ పెరుగుతుండటంతో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. గతంలో శ్రీ కృష్ణ కమిటీపై పెదవి విప్పకుండా రెండు ప్రాంతాల నేతలతోనే మాట్లాడించిన బాబు, ఈసారి కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. సీమాంధ్రలో కూడా పార్టీని కాపాడుకునే అవసరం ఉన్నందున, తెలంగాణ నేతల స్వేచ్ఛకు అడ్డు రాకుం డానే అటు పార్టీని, ఇటు రెండు ప్రాంతాల నాయకుల ను కాపాడుకోవటం సవాలుగా పరిణమించింది.

ఇటీవల చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి గైర్హాజరవడం ద్వారా తెలంగాణ విద్యార్థి జేఏసీలు, ఉద్యమ సంఘాల వ్యతిరేకత తగ్గించుకున్న బాబు, ఈనెలాఖరులో మళ్లీ ఢిల్లీలో జరిగే భేటీకి హాజరుకా వాలా వద్దా అన్న అంశంపై తర్జనభర్జన పడుతు న్నారు. సోనియా ఎప్పుడో తెలంగాణ ఇచ్చేసిందని, తానే అడ్డుపడుతున్నానంటూ కేసీఆర్‌ ఇప్పటివరకూ చేసిన ఆరోపణలో నిజం లేదని తెలంగాణ ప్రజలకు స్పష్టమయినందున, ఆ తర్వాత పరిణామాలు తమ పార్టీకి ఏ మేరకు లాభిస్తాయోనని వేచిచూస్తున్నారు. ఈలోగా తెలంగాణ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ను ముద్దాయిగా నిలబెట్టా లన్న వ్యూహం అనుసరిస్తున్నారు.

Saturday, January 1, 2011

2011 నే ‘తల’ రాతలు

నేను మారానంటే నమ్మరే.. !
newsofap 

(వృషభరాశి20 ఏప్రిల్‌ 1950)గోచారరీత్యా వృషభరాశిలో జన్మించిన చంద్ర బాబునాయుడు గురువుయొక్క స్థానం మీన రాశి నుంచి కర్కాటక రాశిపై పంచమదృష్టి కలిగి ఉం డడం వల్ల చంద్రలగ్నాత్‌, ఈ జాతకుడికి ఈ సంవ త్సరం జనవరి నుంచి జులై వరకూ ఎంతో బాగుం టుంది. డైనమిజాన్ని వృద్ధి చేసుకుంటారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తాయి. ఐడియలిస్ట్‌ పర్సనా లిటీ ఇంప్రూవ్‌ చేసుకునేందుకు ఈ సంవత్స రం మొదటి అర్థభాగం ఉపయోగ పడుతుంది.సున్నిత భావా లపై స్పందించడం, మీడియాకు ఎక్కువగా రావడం..., నలుగురిలో కలసి పోవడం, తప్పులు పసిగట్టడం,ఎదురుదాడికి దిగడం లాంటి లక్షణాలు పెంపొందించుకుంటారు. రెబల్‌ పర్సనాలిటీగా మారుతారు.

ఈ సంకేతం ద్వారా తన చుట్టుపక్కల వారికి, ఆంతరంగికులకు, ప్రజలకు మార్పు చూపిం చేందుకు, వారి నమ్మకాన్ని గెలుచుకునేందుకు సర్వప్రయత్నాలు చేస్తారు. అందులో చాలావరకు విజయం సాధిస్తారు. అదే సమయంలో, సామాజిక, రాకీయ, ఆర్థిక వ్యవస్థలలో మార్పు నకై పోరాటం చేస్తారు. ప్రజల ఆర్థిక స్థితిగతులపై బాగా దృష్టి పెడుతారు. ఆయన లాజికల్‌ వ్యూస్‌ను చాలావరకు అంతా ప్రశంసిస్తారు. అది ప్రభుత్వంపై ఒత్తిళ్ళను పెం చుతుంది. ఈ ప్రయత్నంలో చాలా మంది సానుభూతిని చంద్రబాబు పొందు తారు. ఈ ప్రవర్తన వల్ల ఆంతరంగికులు కూడా పునరాలోచనలో పడు తారు. ఆయనలోని నాయకత్వ లక్ష ణాలను కొత్తరకం గా చూసే స్థాయిలో చంద్రబాబు వారిని ప్రభావితం చేయగలుగుతారు. చంద్రబాబు టీమ్‌ వర్కర్‌ కాదని చాలా మంది భావిస్తుంటారు. అది తప్పని నిరూ పించేలా చంద్రబాబు టీమ్‌ వర్క్‌ ఉంటుంది.

gakhtaసంవత్సరాదిలో చేసిన ప్రయత్నాలన్నీ అప్పటి పరిస్థితులపై సగటు మనిషి దృష్టిని ఆకట్టుకోవ డంలో విజయం సాధించినప్పటికీ, సంవత్సరం రెండో అర్థభాగంలో మాత్రం అప్పుడు చోటు చేసు కునే సామాజిక, రాజకీయ పరిణామాలను బ్యాలెన్స్‌ చేయ డంలో ఒత్తిళ్ళకు లోనవుతారు. ఈ ఒత్తిళ్ళ నేపథ్యంలో తన ఒరిజినల్‌ నేచర్‌ (నేను, నాది, నేనే)కు వచ్చేస్తారు. దీన్నంతా బ్యాలెన్స్‌ చేయలేక తనకు తెలియ కుండానే తనపై, తన ధోరణిపై ఇతరుల్లో అయోమయాన్ని కలిగిస్తారు. తన ఇమేజ్‌కు తానే చేటు తెచ్చుకుం టారు. రెండో అర్థవార్షికం ఆయన పొలిటికల్‌ కెరీర్‌ను ఓ చౌరస్తాలో నిలబెడుతుంది.

babu-health 

ఈ మొత్తం ప్రక్రియలో ఆయన ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎదగనీయడంలేద నే భావన కలుగు తుంది. వ్యూహం అనేది లేకుండా దాడికి దిగడం చేస్తుంటారు. కొంత నిరాశకు గురికావడం, బలమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తీసు కున్న నిర్ణయా లు అచ్చిరాకపోవడం వంటివి ఉంటాయి. సక్సెస్‌ కంటే ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. తాను అనుకున్న వాటిని ఆచరణలో పెట్టే సమయంలో మాత్రం వ్యక్తిత్వపు లోపాలు ఆయనను తిరిగి పూర్వస్థాయికి తీసుకు వస్తాయి. ఇందుకు కారణం, చంద్రలగ్నాత్‌, పంచమ స్థానమైనటువంటి కన్యరాశిలో ఉన్న శని అని చెప్పవచ్చు. జాతకుడు మానసిక భావోద్వేగాల పరంగా కూడా పరిపక్వత సాధించాలి. లేనిపక్షంలో ఎదుటివారి తప్పులెంచుతూ, ఎదురు దాడి చేస్తూ విపక్షంలోనే కొనసాగాల్సి వస్తుంది.

మైండ్‌సెట్‌
ఈ రాశిలో పుట్టిన వారికి క్రిటికల్‌ మూమెంట్స్‌లో ప్రజల దృష్టిని ఆకట్టుకోవడం లో ఎంతగా సక్సెస్‌ అవుతారో, సాధారణ సమయాల్లో వారి దృష్టిని ఆకట్టు కోవడంలో మాత్రం అంతగా విజయం సాధించ లేకపోతారు. వీరికి రేషనాలిటీ ఉండదు. దృక్పథం తక్కువ. అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునేం దుకు ప్రయత్నిస్తూ, చేసిన వాగ్దా నాలను, బాధ్యతలను మర్చిపోతుంటారు. తప్పు లు గుర్తించడం, ఎన్వి రాన్‌మెంట్‌ను రెచ్చగొట్టడం లాంటి వాటికి ఎంతగా చేస్తారో, వ్యవస్థలో తప్పులను గుర్తించి, పరిష్కార మార్గాలను సూచించ డంలో అంతగా శక్తి వెచ్చించరు.

ఎదుటి వారిని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. వ్యూహాల్లో, ఆలోచనలు విలువలు తక్కువగా ఉంటాయి.ఈ ప్రక్రియలో తీవ్రమైన దూషణ లకు అలవాటు పడుతారు. దీనికి పరిష్కారం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకో వడం తగ్గించుకోవాలి. వ్యూహాలు, ఆలోచనలు, పథకాలు లాంటివాటిని నిశితం గా పరిశీలిస్తే, వాటిల్లో తిరిగి కపటమే కన్పిస్తుంటుంది. అదే సమయంలో, వీరు తమ అనుచరులను కూడా అదే విధంగా ప్రభావితం చేస్తారు. వారి నుంచి వచ్చే సలహా ల్లో తమకు నచ్చే వాటినే స్వీకరిస్తారు. నిర్మాణాత్మక విమర్శలనూ భరించ లేరు. ఈ ధోరణితోనే రెండో అర్థవార్షికంలో ప్రజలకు ‘బోరింగ్‌ పర్సనాలిటీ’గా మారే అవకాశం ఉంది.

గ్రహబలం
గోచారరీత్యా మారుతున్న గ్రహస్థితులు వృషభరాశిలో జన్మించిన చంద్రబాబు నాయుడికి క్లిష్టపరిస్థితులను కలిగిస్తాయి. చంద్రలగ్నాత్‌, జాతకరీత్యా నాయక త్వపు లక్షణాలను, పోటీ తత్వాన్ని పెంపొందించే కుజుడి స్థానం శత్రుస్థానాలతో సాంగత్యం చేస్తున్నది. అది నాయకుడిగా ఆయన ఎదుగుదలను అడ్డు కుంటుంది. ఆగస్టు నుంచి కుజుడు బలహీన పడడం ప్రతికూల వాతావరణానికి అవకాశం కల్పిస్తుంది. శుక్ర, బుధ స్థానాలు కూడా ప్రేక్షక పాత్ర వహించడానికి కారణాల వుతాయి. పబ్లిక్‌ అట్రాక్షన్‌, గ్లామర్‌ లాంటి వాటికి అధిపతి అయిన శుక్రుడు శత్రుసాంగత్యం చేయడం వల్ల జాతకుడు సుస్థిరత, టెంపర్‌మెంట్‌ కోల్పోతారు. బుద్ధి బలానికి అధిప తి అయినటువంటి బుధుడు కొంత అనుకూలంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని, తాను అనుకున్న వ్యూహానికి కట్టుబడి ఉండగలగుతారు.

కొత్త బాటలో.. కొత్త గొంతుకతో...!
y-s-jagan-mohan 

(21 డిసెంబర్‌ 1972 మిథునరాశి)జగన్‌ ప్రాథమికంగా స్వేచ్ఛాప్రియుడు. సొంతంగా ప్రణాళికలు, వ్యూహాలు రూ పొం దించుకోవడంలో మాత్రం బలహీనం. చాలావరకు తక్షణ స్పందనలే అధికం. భావాల వ్యక్తీకరణలో ధైర్య,సాహసాలు అధికం. చాతుర్యం ఉండదు. వ్యూహాత్మకంగా వ్యవహరించలేరు. వైఫల్యా లను ఆధ్యాత్మికంగా స్వీకరిస్తారు. ఆచరణాత్మక ధోరణి ఉండదు. ఈ ధోరణి వ్యవస్థను ప్రశ్నించేలా చేస్తుం ది. అది ఇతరులను ఆలోచనల్లో పడేస్తుంది. అంకిత భావం ఉండే స్వభావం. అవతలి వారి నుంచి కూడా దాన్ని తాను ఆశిస్తున్నానన్న సంకేతం ఉంటుంది. నమ్మితే సొంత మనుషులుగా భావిస్తారు. మాటల తో చెప్పకుండానే అవతలి వారి నుంచి తాను ఏది ఆశిస్తున్నదీ సూచనప్రాయంగా వెల్లడిస్తారు. ఇతరులను అంత తేలిగ్గా నమ్మరు.

వారికి అంత స్వాతంత్య్రం ఇవ్వరు. ఇతరులతో వ్యవహారాల్లో ప్రయోజనాన్ని ఆకాక్షించే భావోద్వేగాలను కలిగిఉంటారు. నమ్మితే అది చివరి వరకూ ఉంటుంది. స్వతంత్ర భావాలు, వ్యూహాలు, తర్కం, వినూత్నం, చివరి వరకూ ఓటమిని అంగీకరించని తత్వం...ఇవన్నీ ఉన్నా కూడా సొంత నిర్ణయాలు తీసుకోరు. ఇతరుల సలహాలు ఆయన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది దీర్ఘకాలంలో ఆయనకు మేలు చేస్తుంది. ఏ పని చేసి నా అది అవతలి వారి దృష్టిని ఆకర్షించేందుకు అని గాకుండా కమిట్‌మెంట్‌తో చేస్తారు. ఇన్నర్‌ డిగ్నిటీ అనేది ప్రవర్తనలో కనబడదు గానీ ఆలోచనలతో ఇతరులను ప్రభావితం చేసేటప్పుడు అది బయటపడుతుంది. అది ఇతరుల్లో ఆయనపై భయభక్తులను పెంచుతుంది. జగన్‌లో చిన్నపిల్లాడి మనస్తత్వం కూడా ఉంటుంది. ఎప్పుడూ చీకటిని గాకుండా వెలుగును చూస్తుంటారు.

మంచిచెడుల అన్వేషణ చేస్తుం టారు. డూ వాట్‌ ఈజ్‌ రైట్‌ , డోంట్‌ థింక్‌ హూ ఈజ్‌ రైట్‌ అనేది ఆయన తత్వం. ఇదే అనుచరుల్లో ఉంటే హర్షిస్తారు. ఎప్పుడైనా మాట జారినా కూడా అనుచరులు దూరం గాకుండా ఈ లక్షణం కాపాడుతుం ది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడం కన్నా కూడా ఎక్కువగా వినూత్నం, ప్రోగ్రెసివ్‌కు ఇష్టపడుతారు. ఇతరుల సూచనలను ఇష్టపడుతారు. సమస్య చిన్నదో, పెద్దదో అని చూడకుండా అకస్మాత్తుగా భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోతారు. అలాంటి సందర్భాల్లో అవతలివారితో డిస్‌కనెక్ట్‌ అయిపోతారు. ఆశయాలు, ఆకాంక్షలు అనంతం. వాటిపైనే ఫోకస్‌. ఇది ఇతరులకు అత్యాశ, అపరి మిత ఆసక్తి అన్పిస్తుంది. టైమ్‌ మేనేజ్‌మెంట్‌, పర్‌ఫెక్షనిజం ఈ రెండు కనబడని బలాలుగా ఉంటాయి. చేసే పనుల్లో ఈ లక్షణాలు కన్పిస్తుంటాయి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఆయన ఫిలాసఫీ మైండ్‌ ఆయనను అనుభవంతో పాఠాలు నేర్చుకునేలా చేస్తుంది. తొందరగా మాస్‌ పీపుల్‌ను అట్రాక్ట్‌ చేస్తుంది ఈ లక్షణం.

మైండ్‌సెట్‌
సృజనాత్మక ఆలోచనలపై దృష్టి సారించడంలో అమిత ఉత్సాహం. చొరవ తీసుకోవడంలో అద్భుత శక్తి. అందివచ్చిన అవకాశాలను సొంతం చేసు కుం టారు. అనుభవంతో వచ్చే ఊహాశక్తి, సాహసోపేత స్వభావం ఆయన ప్రాథ మిక బలాలు. ప్రతికూల వాతావరణాన్ని ముందుగానే పసిగట్టగలరు. క్లిష్ట పరిస్థితుల్లో లొంగిపోరు. భయపడి పారిపోరు. ఆత్మవిశ్వాసంలో, కష్టాలను అధిగమించడంలో మేటి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే ఆయనలోని శక్తులు వెలుగుచూస్తాయి. ఈ ధోరణి ఆయన చుట్టుపక్కల వాతావరణానికి, వ్యక్తులకు స్ఫూర్తిని ఇస్తుంది.

అట్టడుగు వర్గాల మేలుకోసం పని చేసేందుకు తొందరగా చొరవ తీసుకుంటారు. వ్యక్తుల గుణగణాలను విశ్లేషించడంలో మేటి. క్రాస్‌చెక్‌ చేయకుండా నిర్ణయం తీసుకోరు. కొన్ని కీలక అంశాల్లో నిర్ణయం తీసుకునేందుకు ఎక్కువ సమ యం తీసుకున్నా, తీసుకున్నంత మాత్రాన ఆ కాల వ్యవధి అనుత్పాదకతగా ఉండదు. ఆ విషయాన్ని ప రిశీలించేందుకే ఆ సమయం తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఆ టైమ్‌గ్యాప్‌ను కవర్‌ చేస్తారు. వైఫల్యాలను అంత తేలిగ్గా అంగీకరి ంచరు. మనస్సాక్షిని నమ్ముతారు.

ఇలాంటి వారికి బేసికల్‌గా చుట్టుపక్కల వ్యవస్థ నుంచి మంచి పేరు రాదు. నమ్మిన వారికి మాత్రం దేవుడే. ఆయన ధోర ణి క్రమశిక్షణారాహిత్యంగా కన్పిస్తుంది. సెల్ఫ్‌సెంటర్డ్‌గా,అవకాశవాదిగా, స్వేచ్ఛావాదిగా కన్పిస్తారు. విజ న్‌ లేదు, ఇంకా మానసికంగా ఎదగలేదు అని ఇతరులు బురద చల్లేందుకు ఈ ధోరణి అవకాశం కన్పిస్తుంది. ఆయనకు అటువంటి పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా ఉండడం అవసరం. ఎవరితోనూ సుదీర్ఘ సంభాషణలు మం చివి కావు. అందులోనుంచి భవిష్యత్‌ ప్రణాళిలు బయటపడవచ్చు. అమాయకత్వం, ముక్కుసూటి తత్వం ఎక్కువగా ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు.

భావోద్వేగాలు
ప్రతీ చిన్న విషయాన్ని మనస్సులో పెట్టుకుంటారు, అప్పటికప్పుడు వ్యక్తపర్చకపోయినా. ఎప్పుడో ఒకసారి అది బ్లాస్ట్‌ అవుతుంది. పరిణామాలను ముందుగానే ఊహించి, వాటికి పరిష్కారాలను అందించేందుకు ఇష్టపడుతారు. అవకాశాన్ని సొంతం చేసుకోవడం ఆయన బలమైనప్పటికీ, అది ఇతరులకు మరో కోణంలో కన్పిస్తుంది. ఆయన వ్యవహార శైలిలో పరిపక్వత, డిప్లమసీ లోపించినట్లుగా అన్పిస్తుంది. విమర్శలపై వివరణ ఇచ్చేందుకు ఇష్టపడరు. ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే సుదీర్ఘ వివరణలు ఇస్తారు. ఆ వివరణ, ధోరణి ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తుంది.

ఒక నాయకుడికి ఉండే భావోద్వేగాల కన్నా కూడా బిజినెస్‌మ్యాన్‌కు ఉండే భావోద్వేగాలు అధికం. స్వేచ్ఛ ఇచ్చి క్రమశిక్షణను ఆశిస్తారు. అందులో అపారమైన అవకాశాలు ఇస్తా రు. లాభాన్ని, ఉపయోగాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందులో పరిపక్వతతో, ఆచరణాత్మకంగా ఉంటారు. తనపై పూర్తిగా ఆధార పడి ఉండే భావోద్వేగాలను ఇష్టపడరు. అవి తప్పనిసరి అయితే, వ్యూహాత్మకంగా, ఆదా వచ్చేలా ప్లాన్‌ చేస్తారు. తొందరగా అసహనానికి గురై అవతలి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. భావోద్వేగాల్లో ప్రేమకు, క్రమశిక్షణకు పెద్దగా తేడా ఉండదు.

గ్రహబలం
జాతకరీత్యా మిథున రాశి...చంద్రలగ్నాత్‌ సప్తమ స్థానమైనటువంటి ధనుర్‌రాశి అధిపతి గురువు స్వక్షేత్రంలో ఆత్మకారకుడైనవంటి రవితో కలసి ఉండడం వల్ల, చంద్రగురువులు సమసప్తమంలో ఉండడం, గజకేసరి యోగం ప్రభా వం కలిగి ఉండడం వల్ల పేరుప్రఖ్యాతులు ఉంటాయి. ఈ ఏడాది ఆరంభదశలో వ్యవస్థను ప్రభావితం చేస్తూ కొత్త దిశగా నడిపించడంలో పునాది పడుతుంది. తన ఆలోచనలు, వ్యూహాలు జాతీయస్థాయిలో కూ డా సంచలనం కలిగించే రీతిలో గ్రహస్థితి అనుకూలిస్తుంది.

లగ్న చతుర్ధాధిపతి అయిన బుధుడు, పంచమవ్యయాధిపతి అయిన శుక్రుడితో వృశ్చిక రాశిలో ఉండడం వల్ల కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూ పొత్తులు పెట్టుకోవాల్సి వస్తుంది. నాయకత్వ లక్షణాలకు, పోటీ తత్వానికి అధిపతి అయిన కుజుడు తులారాశిలో ఉండడం వల్ల తీసుకునే నిర్ణయాలు, చేసే పనిలో ఎంతో మందిని ప్రభావితం చేయగలుగుతారు. అనుచరులు, సహచరులు అధికమవుతారు. కుజుడు పంచమస్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాలు మాటల వెనుక భావాలు వ్యవస్థను నిర్మాణాత్మకరీతిలో ప్రభావితం చేస్తాయి. చంద్రలగ్నాత్‌ అష్టమ భాగ్యాధిపతి అయిన శని వ్యయం (వృషభరాశి)లో, మిత్రస్థానంలో ఉండడం వల్ల మహిళల సానుభూతి అధికంగా ఉంటుంది. ప్రథమార్థంలో కన్నా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, ద్వితీయార్థంలో జాతీయ స్థాయిలో గుర్తింపు బాగా ఉంటుంది.

రాజకీయ గ్లామర్‌ కావాలి !
Chiranjeevi 

(22 ఆగస్టు 1959 కన్యారాశి)చిరంజీవి ఇతర అంశాలు వేటితో నిమిత్తం లేకుండా గ్లామర్‌ పొందుతారు. పాలిటిక్స్‌ నుంచి కాకుండా సినిమాల ద్వారా ఈ గ్లామర్‌ సాధించగ లుగుతారు. అభిమానాన్ని సొమ్ము చేసుకొని లైమ్‌లైట్‌లోకి రావడానికి సకల ప్రయత్నాలు చేస్తా రు. సెప్టెంబర్‌ వరకు పొలిటికల్‌గా ఆయన ధోరణి అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నారా లేదా అనే అనుమానం కలిగించేదిలా ఉంటుంది. గత అనుభవాలను, జ్ఞాపకాలను గుర్తుకు చేసుకునే స్వభావం అధికం. ప్రతి చిన్న విషయానికి ఆత్మపరిశీలన అధికం. పార్టీలో, ఆంతరంగికుల్లో వచ్చే మార్పులకు తనను తాను బాధ్యుడిని చేసుకుంటూ వాటిని మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత లను విస్మరిస్తారు. ఎక్కువగా ఆత్మపరి శీలన చేసుకోవడం ఆయనలో బుద్ధిబలాన్ని సన్నగిల్లేలా చేస్తుంది.

ఇది చూసే వారికి ఆయన ద్వంద్వవైఖరి కలిగిఉన్నట్లు భావిం చేలా చేస్తుంది. ఈ దశలో కూడా సహ చరులు, అనుచరుల నుంచి ఆయన గౌరవాన్ని, అంకితభావాన్ని, సమగ్రతను, హోదా, ఆర్భాటం లాంటి వారిని కోరుకుం టారు. పార్టీ అధినేతను ఆకట్టుకునే ప్రయ త్నాల్లో అనుచరులు ఉంటారు. చిరం జీవి ధోరణి చివరకు అనుచరుల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. పార్టీపై, సహ చరులపై పట్టు కోల్పో తారు. అలా కావాలనే చేస్తున్నాడనే అభిప్రాయం కలుగు తుంది. ఒక పద్ధతి ప్రకారం తాను రాజకీ యాలకు దూరమవుతూ, అనుచరులు పార్టీకి దూరమ య్యేలా చేస్తున్నారన్న భావన ఇతరుల్లో కలుగుతుంది. ఫిలిం పర్సనాలిటీగా ఎంతగా దర్పం ప్రదర్శించారో, అలాంటి దర్పాన్ని ఇప్పుడు కూడా ప్రద ర్శిస్తునే ఉంటారు. క్రమంగా టీమ్‌లో ఎవరికి వారు బాస్‌గా వ్యవహరిస్తుంటారు.

మైండ్‌ సెట్‌
మన:కారకుడు అయిన చంద్రుడు కన్యారాశిలో ఉండడం జాతకుడి భావోద్వేగా లను ప్రభావితం చేస్తుంది. దేన్నయినా చూసి మనస్సు మార్చుకోవడమనేది ఉండ దు. కన్పించని ఆవేశాన్ని, క్రోధాన్ని అణచుకుంటూ ప్రతికూలమైనటు వంటి పరి స్థితులు, వ్యక్తుల యొక్క రాజకీయ అనుభవాలను, వారి సూచనలను స్వీకరించ లేకపోవడం,..ఆత్మరక్షణలో భాగంగా ఎదుటి వారిలో తప్పులెన్నడం లేదా వారిని విస్మరించడం చేస్తారు. పరిస్థితులకు అనుగుణంగా తనను తీర్చిదిద్దుకోవడంలో అశక్తత. దీంతో నిరాశానిస్పృహలకు గురవుతారు.

చిక్కుముళ్ళను ఎదుర్కోలేకపోతారు. యుక్తవయస్సులో ఏర్పడినప్పటి ముద్రలన్నీ కూడా ఆయన నిర్ణయాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. వాటిని బట్టి ఎదుటి వారిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. వాటిని సృష్టించుకునే ప్రయత్నాలు చేయలేకపోతారు. చేసినా అవి అతి స్వల్పకాలమే. ఈ ప్రయత్నంలో అవకాశాలు జాప్యం కావడం, నిరాశా నిస్పృహలు ఏర్పడుతాయి. అవన్నీ సహ చరులపై ప్రభావం కనబరుస్తాయి.

చిరాకు, విసుగు లాంటి వాటిని బయటకు ప్రదర్శించకపోయినా, మౌనంగా, మొండిగా ఉండడంవల్ల మరిన్ని అపార్థాలు వచ్చేలా చేసుకుంటారు. ఆ సమయంలో సహచరుల నుంచి బుజ్జగింపును కోరుకుంటారు. ఈ విషయంలో చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరమంతా జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఓప్రేక్షకుడిలా, పరిశీలకుడిలా, తనకు పరిస్థితి అర్థమవుతున్నట్లుగా ఉంటారు గానీ తీసుకోవాల్సిన చర్యలను విస్మరిస్తున్నట్లుగా ఉంటారు. ప్రణాళిక బద్ద నిర్ణయాలు ఉండవు. సందర్భానికి తగినట్లు అనిగాకుండా, అప్పటికప్పుడు భావోద్వేగాల పరంగా స్పందించి నిర్ణయం తీసుకుంటారు. తాను లైమ్‌లైట్‌లోకి రావాలనుకుంటే తిరిగి సినిమాలను ఆశ్రయించకతప్పదని భావిస్తుంటారు.

భావోద్వేగాలు
మను:కారకుడైన చంద్రుడి ప్రభావం భావోద్వేగాల పరంగా ఉంటుంది. ఆచరణలో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తుంటారు. బయటకు కన్పించే భావోద్వేగాలకు అతీతంతగా తన మనస్తత్వాన్ని గోప్యంగా ఉంచుకుం టారు. ఆబ్సెంట్‌ మైండ్‌నెస్‌ ఉంటుంది. ఆయా పరిస్థితుల్లో వెంటనే స్పందించే లక్షణం కన్పించదు. తను మాట్లాడే మాటలు కొన్ని సందర్భాల్లో పరిపక్వత లేనివిగా లేదా అందరి దృష్టిని ఆకట్టుకోవాలనే తపనతో కూడుకున్నవిగా ఉంటాయి.

అసందర్భంగా తన భావోద్వేగాలు బయటపెట్టి నవ్వులపాలయ్యే అవకాశం ఉం టుంది. సినిమా పరంగా తను ఊహిస్తున్న గ్లామర్‌ను పొందడంలో విజయం సాధిస్తారు. సినిమా రంగం ఆత్మసంతృప్తి కలిగించేలా ఉంటుంది. ఈ సంవత్సరంలో అనేక మార్లు చుట్టుపక్కల వారి బలాబలాలతో ప్రయోజనం పొందే స్థాయిలో ఉంటారు. అలా ప్రయోజనాలను అందించిన వారిని గుర్తించడంలో, ప్రశంసించడంలో మాత్రం ద్వంద్వ ప్రమాణాలతో, డిప్లమసీగా ఉంటారు. మద్దతు దారులను కూడా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యవహారధోరణిలో తన స్థాయి, హోదా లాంటి వాటిని చూస్తుంటారు. ఆ ధోరణిలో మార్పు ఉండదు. అవసరాలు తీర్చుకోవడంలో చలాకీతనం ప్రదర్శిస్తారు. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేయడమని గాకుండా, తెప్పను కూడా వెంట తీసుకెళ్ళేరకం.

నమ్మకాలు రాజకీయపరంగా దెబ్బతినడం వంటి లక్షణాలు (ప్రజలు ఇచ్చిన షాక్‌) ఆయన రాజకీయ జీవితంలో కొట్టొచ్చినట్లుగా కన్పిస్తాయి. గ్రహబలం: చిరంజీవి తులాలగ్నంలో, కన్యరాశి చిత్తా నక్షత్రంలో జన్మించారు. గోచారరీత్యా జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు తాను ఎంచుకున్న రంగంలో (సినిమా)లో నిర్విఘ్నంగా ప్రయత్నాలు సాగుతాయి. సామాజికం, ఆగ్రహంలతో కూడిన సినిమా కాగలదు. సామాజిక సందేశాన్ని ఇచ్చే ఈ సినిమాకు ఈ సంవత్సరం ఆదిలోనే బీజం పడుతుంది. షూటింగ్‌ కూడా సజావుగా సాగుతుంది. అది సినిమారంగ పరంగా ఆయనకు సంతృప్తినిస్తుంది.

రాజకీయపరంగా సందిగ్దపరిస్థితుల ను ఎదుర్కొంటారు. ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. జీర్ణసంబంధ, గ్యాస్ట్రిక్‌ సమస్యలు రావచ్చు. జూన్‌ తరువాత ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చు. ఈ సంవత్సరం ఆయనకు ఆత్మపరిశీలనకు సమయం ఎక్కువగా కేటాయిస్తారు. తనను తాను ఎంతో ఉన్నత స్థాయిలో భావించుకున్నప్పటికీ, ఆ ఇమేజ్‌ చట్రం నుంచి బయటకు వచ్చి సగటు మానవుడితో కలిసే ప్రయత్నం చే యడం మంచిది. ప్రాథమికంగా ఆయన అల్పసంతోషి. చిన్నచిన్న వాటికి ఉబ్బిపోయే మనస్తత్వం. నైతికత, సేవాభావంతో కూడిన కార్యక్రమాలు చేపడితే మనశ్శాంతిగా ఉండడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.

నిరంతర బాటసారి !
KCR-Arrest 

(17 ఫిబ్రవరి 1954 కర్కాటక)కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. గోచారరీత్యా చంద్రలగ్నాత్‌ (కర్కాటకం) గురు దృష్టి కర్కాటకలగ్నంపై ఉండడం మూలంగా ఈ సంవత్సరం ఆయన మేథోసంపత్తి ఆయనకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇంటెలిజెన్స్‌, రిటెన్‌టివ్‌ పవర్‌ (నిలదొక్కుకునే శక్తి), పర్‌సిస్టెన్స్‌ పేషెన్స్‌ (సహనం) బాగా ఉంటాయి. ఈ రాశివారి ప్రాథమిక లక్షణాలు అవి. కావాల్సిన పనులు చేసి లేదా మాటలతోనో వీరిని ఎవరూ బుట్టలో వేసుకోలేరు. ఎదుటి వారి క్యారెక్టర్‌ను విశ్లేషించడంలో, అంచనా వేయడంలో పరిపక్వత కలిగిన సైకాలజిస్ట్‌లుగా వీరిని చెప్పవచ్చు. ఇతరుల క్యారెక్టర్‌ను, వారి ఉద్దేశాలు, లక్ష్యాలను ఏకకాలంలో అర్థం చేసుకోగలుగుతారు. మను: కారకుడైన చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి అవడం దీనికి కారణం. ఇతరులను బాగా పరిశీలించగలుగుతారు. ఆ స్థాయి సహనం ఉంటుంది. ఇతరులు ఏం చేస్తుంటారో పరిశీలిస్తారు. వారి చర్యలను చూస్తారు.

ఆ తరువాతే తాను రియాక్ట్‌ అవుతారు. ఆయన ఇంటెలిజెంట్‌ అయినప్పటికీ, గ్రాహక శక్తి మాత్రం తక్కువే. ఫ్రెష్‌ ఐడియాస్‌ గ్రహించడంలో స్లో అయినప్పటికీ కూడా గ్రహించిన దాన్ని నిలబెట్టుకునే శక్తి అధికం. ఫలితంగా విశాల దృక్పథం అలవడుతుంది. ఎప్పుడూ నిత్యనూతనంగా, వినూత్న ఆలోచనలను కలగి ఉంటారు. ఈ లక్షణాలు ఉండడం మూలంగా పర్‌ఫెక్షనిజాన్ని కలిగిఉంటా రు. మూర్ఖపు విశ్వాసాలు ఉంటాయి. తిరుగుబాటు మనస్తత్వం.

kcr-spee 

ఎదుటి వారిని తన కంట్రోల్‌ తెచ్చుకునేందుకు మాత్రమే దీన్ని వాడుతారు. పెట్రోల్‌ పోయడమే వచ్చు తప్ప ఆర్పడం రాదు. అదే సమయంలో మంటలు రేగుతుంటే బాధపడే సు న్నిత మనస్తత్వం. పరిస్థితి విషమిస్తే అక్కడి నుంచి జారకుంటారు. నచ్చితే అందలం. నచ్చకుంటే పాతాళం.బలమైన మనస్థితులు కలిగిన వ్యక్తిత్వం.అలాంటి మూడ్స్‌ అన్నీ కూడా అంతశ్చేతన స్థితిలో ఉంటాయి. పని చేసే విధానంలో అసూ య ఉంటుంది. కంపేర్‌ చేసుకొని వారి కంటే అధికం అయ్యే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మంచి గుర్తింపు సాధించగలుగుతాడు. సాధారణ పరిస్థితుల్లో కాకపోయినా, చుట్టుపక్కల వారి సలహాలను ఆపత్కాలంలో పూర్తిస్థాయిలో పాటిస్తారు.

మైండ్‌సెట్‌
ఈ సంవత్సరం నుంచి అంతర్‌బుద్ధి (ఇంట్యూషన్‌), మేధస్సు (ఇంటెలిజెన్స్‌) ఏకకాలంలో పని చేస్తాయి. అంతరాత్మ సూచనలను నమ్మితే అంతర్‌బుద్ధి పని చేస్తుం ది. ప్రస్తుత సంఘటనలను తార్కికంగా, హేతుబద్దంగా విశ్లేషించుకుంటూ పని చేస్తారు. బాటిల్‌ మూత ఓపెన్‌ చేయడంలో సక్సెక్‌ అయినప్పటికీ, అందులోని అం శాన్ని వివరించంలో విజయం పాళ్ళు తక్కువే. గతజ్ఞాపకాలను స్ఫురణకు తెచ్చు కోవడం అధికం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆ రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో మొదటి ఆరు నెలలు ఆడింది ఆట, పాడింది పాట. జులై వరకు ఈ పరిస్థితి ఉంటుంది.

అక్కడి నుంచి సెప్టెంబర్‌ వరకు ఆయనను వేరే వారు ఉపయోగించుకుంటారు. అపార్థాలకు గురయ్యే స్థాయికి పరిస్థితులు దిగజారుతాయి. ఈ ప్రక్రియలో న్యాయం, సమానత్వం బ్యాలెన్స్‌ చేస్తూ చేసే యుద్ధంలో తనను బాగా విశ్వసించే వారి సానుభూతిని మాత్రమే పొందగలుగుతారు. కృతజ్ఞతాభావం ఉన్నవారు, నమ్మిన వారు మాత్రమే ఆయన పక్కన ఉం టారు. వ్యూహం, చొరవ, వ్యక్తిత్వం, సమగ్రత ఉన్న వారు ఆయనకు దూరం అవుతారు. అప్పటి వరకూ ఉన్న స్పష్టత ఆయనలో పటాపంచలు అవుతుంది. అయోమయ దశకు వెళ్ళిపోతారు. ఆ సమయంలో భావోద్వేగాలు, సెంటిమెంట్‌లపై ఆధారపడుతారు. అప్పుడు తనను తిరిగి నిలబెట్టగల వ్యక్తుల, పరిస్థితుల కోసం, స్పష్టత కోసం పరితపిస్తారు. మూడ్‌స్వింగ్స్‌ ఉంటాయి. తీసుకునే నిర్ణయా ల్లో అనుభవం ద్వారా పొందిన పాఠాలపై ఆధారపడుతారు. గతంలో ఉన్న చొరవ, పట్టుదల ఉండకపోవచ్చు. పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉంటుం ది. దీర్ఘకాలంగా దాచిన గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఆయన పరిస్థితిని సంక్లిష్టం చేస్తాయి.

భావోద్వేగాలు
కేసీఆర్‌ ప్రాథమికంగా సంప్రదాయవాది. ఎదుటి వారిని ప్రభావితం చేసి పని చేయించడంలో ఎంత కష్టపడుతారో అంతకంటే ఎంతో త్వరగా డిటాచ్‌ (అనుబంధం తెంచుకోవడం) కాగలుగుతారు. ప్రేక్షకపాత్ర పోషించే అవకాశం ఉంది. సెకండ్‌ హాఫ్‌లో ఈ వ్యక్తిత్వాన్ని చూడవచ్చు. సూక్ష్మదృష్టి, దీర్ఘకాలిక ప్రణాళిక బలహీనంగా ఉండడం, పరస్పరం సంఘర్షించే భావోద్వేగాలు, కెయాటిక్‌ ఎమోషన్స్‌ ఉంటాయి.
వ్యక్తులతో, సంస్థలతో సంబంధాలు, అనుబం ధాలు దెబ్బతింటాయి. పరిస్థితులు తన నియం త్రణ తప్పుతాయి. పరిస్థితుల్లో అనుకోని మార్పులకు ఆజ్యం పోస్తారు. తనకు వ్యూహాలకు అనుగుణమైన నిర్ణయాలు, సంకేతాలు చాలామందిని ఆశ్చర్యపరుస్తాయి. భావోద్వేగాలపరంగా కలగూరగంపలా మారిపోతా రు. జులై - అక్టోబర్‌ మధ్య కాలంలో అసంకల్పితంగా ఆయన తీసుకునే నిర్ణయాలు సామాజిక అస్థిరతను కలిగిస్తాయి.
గ్రహబలం
గోచారరీత్యా చంద్రలగ్నాత్‌, అష్టమాధిపతి అయినటు వంటి శని కన్యారాశిలో దృష్టి వ్యయస్థానాన్ని చూడడం (మిథునరాశి) వల్ల తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలుంటాయి. శారీరక శక్తి సామర్థ్యాలు సన్నగిల్లుతాయి. పరిస్థితులను, వ్యక్తులను శాసించాలనుకునే ప్రక్రియలో వాటికి అనుగుణంగా మారుతూ అక్కడ ఇమడలేరు. చాలా వరకు వ్యూహాలను తగ్గించుకుంటారు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించరు. వెనుక ఉండి నడిపించరు. భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురువు స్వక్షేత్రంలో (మీనరాశి) ఉండడం, ప్రథమార్థంలో కొంతవరకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి తోడ్పడుతుంది.తన ప్రణాళికలకు అనుగుణంగా నడిపించేందుకు సమయం, సందర్భం కలసి వచ్చినప్పటికి కూడా శని దృష్టి ప్రభావం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కుటుంబసభ్యులపైన లేదా పిల్లలకు సంబంధించిన అంశాలపై ఇతరుల నుంచి ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది. మారుతున్న గ్రహస్థితికి అనుగుణంగా అనుకున్నది సాధించడంలో వ్యక్తిగా రెండో అర్థవార్షికం మేలు చేయదు. పార్టీలోనే ప్రత్యామ్నాయ నాయకులు వస్తారు. సమష్టి దృష్టి పోయి వ్యక్తిగత ధోరణి పార్టీలో పెరుగుతుంది.

Nagnathఇదంతా కూడా శని ప్రభావం అని చెప్పవచ్చు. ఆయన ద్వారా కదలాల్సిన పాచికలను ఆయన ఉద్దేశపూర్వకంగా ఆపినప్పుడు, ఆ ప్రభావం చుట్టుపక్కల వారిని చైతన్యపరుస్తుంది. దిశానిర్దేశం లేకపోవడం, అనుకూల పరిస్థితుల్లో అతి విశ్వాసం చోటు చేసుకుంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో, తనకు తాను మౌల్డ్‌ చేసుకోవడంలో జాప్యం లేదా అందుకు అనుగుణంగా మారలేకపోవడం ఇలాంటి లక్షణాలతో అయోమయ స్థితిలో పడుతారు. లైమ్‌లైట్‌లో మాత్రం ఉంటారు. అనుకున్నది సాధించడంలో కన్నా సాధించే ప్రక్రియలో గుర్తింపు పొందడంలో మాత్రం సక్సెస్‌ కాగలుగుతారు.(ఈ విశ్లేషణ అంతా కూడా ప్రచారంలో ఉన్న పుట్టిన తేదీ ఆధారంగా, ఆయా జాతకుల 27.12.2010 నాటి గ్రహస్థితి ఆధారంగా)
- ఎస్‌వి నాగ్‌నాథ్‌
ఆస్ట్రో-సైకాలజిస్ట్‌

Wednesday, December 15, 2010

రైతుల ఓట్లు దున్నేదెవరు ?

Farmer
రాష్ట్ర రాజకీయాలు రైతుజపంతో మార్మోగుతోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్‌ - తెలుగుదేశం - జగన్‌ పార్టీలు మధ్యంతర ఎన్నికల వ్యూహంతో రైతులపై ఇప్పటినుంచే ఓట్ల గాలం వేస్తున్నాయి. రాష్ట్ర - దేశ రాజకీయాల్లో రాజకీయ అస్థిర పరిస్థితి నెలకొన్నందున, మధ్యంతరం ఎప్పుడయినా తధ్యమన్న ముందుచూపుతో ఈ మూడు పార్టీలూ హటాత్తుగా రైతుల ఓట్లు దున్నేందుకు సరికొత్త వ్యూహాలకు తెరలేపాయి. తమ విజయసోపానికి నిచ్చెన వంటి రైతుల ఓట్లను సాధించేందుకు రకరకాల ఎత్తుగడ లకు శ్రీకారం చుట్టాయి. తామే రైతుల ఆత్మబంధువులమనే ముద్ర వేయించుకునేందుకు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి.

ఈ క్రమంలో.. ఇటీవల రాష్ట్రంలో వచ్చిన తుపాన్లకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, తక్షణం రుణాలు మాఫీ చేయాలని, కౌలు రైతులను ఆదుకోవాలన్న అంశంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, సొంత పార్టీ స్థాపనకు ఉరకలు వేస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కారుకు డెడ్‌లైన్లు విధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు మాత్రం రైతులకు తమ పార్టీనే మేలు చేస్తుందని ఎదురుదాడి చేస్తున్నారు.

ఈనెల 16లోగా రైతు సమస్యలు పరిష్కరించి, రుణాలు మాఫీ చేయకపోతే 17 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చంద్రబాబునాయుడు సర్కారును హెచ్చరించారు. జల్‌, లైలాతో పాటు గత 15 నెలల నుంచి రాష్ట్రంలో తలెత్తుతున్న ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతున్న రైతాంగాన్ని పరామర్శించేందుకు బాబు.. ప్రభుత్వాధినేతల కంటే ముందే జిల్లాలకు వెళ్లి, వారికి దన్నుగా నిలుస్తున్నారు. ఇది రైతాంగంలో ఆయనపై ;ఆనుకూల వైఖరి పెరగడానికి కారణ మయింది. ఇటీవల నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ప్రకా శం, అంతకంటే ముందు తూర్పు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతు బాట నిర్వహించి సర్కారు వైఫల్యాలపై విరుచుకుపడ్డారు.

గత రెండురోజుల నుంచి శాసనసభలో రైతు సమస్యలపై చర్చించాలని పట్టుపట్టి, అందులో భాగంగా, అరెస్టయి పోలీసుస్టేషన్‌ లోనే నిద్రించిన బాబు, తాజాగా మంగళవారం నాటి సభలో కూడా సర్కారుతో రైతు సమస్యలపై యుద్ధానికి దిగారు. సీఎంపై కన్నెర్ర చేశారు. పోలీసుస్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర నిర్వహించారు. నేతల పోరా టానికి మద్దతుగా పార్టీ కార్యకర్తలు కూడా అసెంబ్లీ వద్ద హంగామా సృష్టించారు. సభ లోపల రైతు సమస్యల పరి ష్కారం కోసం విరుచుకుపడిన టీడీపీ సభ్యులుబాబు సహా సస్పెండ్‌కు గురయ్యారు. రాత్రంతా సభ ఆవరణలోనే బైఠాయించారు. సభలో హంగామా సృష్టించారు.
ఇక కొత్తగా రైతుల సమస్యల కోసం గళం విప్పిన జగన్‌.. ఈనెల 20 లోగా రుణాలు మాఫీ చేయకపోతే విజయవాడలో లక్షమందితో కలసి 21,22వ తేదీల్లో నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు.

రైతులు మానసిక వేదనకు గురవుతున్నారని, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. ఆ సందర్భంగా వైఎస్‌ చేసిన ‘మేళ్లను’ ఏకరవు పెట్టారు. ఆయన ఇటీవల గుంటూరు, కృష్ణాజిల్లాలలో పర్యటించి రైతులను పరామర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఇటీవల తుపాను సందర్భంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించి, రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ అంశంలో ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితిలో లబ్థిపొందకుండా కిరణ్‌ తన యంత్రాంగాన్ని విపక్షంపై విమర్శలు కురిపించేలా సన్నాహాలు చేస్తున్నారు.

రైతుబాటలో ఏ పార్టీ వ్యూహమేమిటి ?
కాంగ్రెస్‌ పార్టీ
  • బాబు, జగన్‌కు పొలిటికల్‌ మైలేజీ ఇస్తే ప్రమాదకరం.
  • ప్రధానంగా గత 15 నెలల నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్న బాబుపై రైతాంగం సానుకూలంగా వ్యవహరించడంతో అప్రమత్తం కావడం అనివార్యంగా మారింది.
  • కొత్తగా తెరపైకొచ్చిన జగన్‌ కూడా రైతుల ఓట్ల కోసం వల వేయడంతో మరింత ఆందోళన.
  • టీడీపీ దూకుడుకు అడ్డువేసేందుకు బాబుపై సభలోనే రఘువీరారెడ్డితో సీఎం కిరణ్‌ విమర్శల వ్యూహం.
  • రైతుసర్కారని వైఎస్‌ వేసిన ముద్రను పార్టీకి కొనసాగించకపోతే రైతుల ఓట్లు పోవడం ఖాయం.

    తెలుగుదేశం
  • ‘రైతు వ్యతిరేకి’ ముద్రను తొలగించుకోవాలన్న వ్యూహం.
  • రైతాంగంలో బలపడిన ‘ప్రభుత్వ వ్యతిరేకవైఖరి’ని మరింత పెంచే ఎత్తుగడ.
  • ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముఖ్యమంత్రులు, మంత్రుల కంటే ముందే బాబు తమ వద్దకు వస్తున్నారన్న ‘రైతుల సానుకూల భావన’ను మరింత బలపడేలా చేయడం.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం సహాయంలో వైఫల్యం చెందిందన్న రైతుల ఆగ్రహాన్ని ఇప్పటినుంచే ఓటు బ్యాంకుగా మలచుకోవడం.
    జగన్‌ పార్టీ
  • సొంత పార్టీకి ముందే రైతుమంత్రం ద్వారా ముందస్తుగానే వారి మనసు గెలుచుకునే వ్యూహం.
  • దాని ద్వారా తన తండ్రి వైఎస్‌పై ఉన్న రైతుబాంధవుడన్న ముద్రపై పేటెంటీ సాధించడం.
  • నిరాహారదీక్ష ద్వారా తనకూ రైతు సమస్యలపై అవగాహన ఉందని చాటుకోవడం.
  • ఇక ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేస్తానంటూ కాంగ్రెస్‌ సర్కారుకు ఓ హెచ్చరిక.
  • రైతుల కోసం పోరాటం ద్వారా అటు కాంగ్రెస్‌-ఇటు తెలుగుదేశం పార్టీకి డేంజర్‌ సిగ్నల్స్‌ పంపించడం.

Tuesday, December 7, 2010

జగన్‌ సరికొత్త తెలం‘గానం’ సురేఖాస్త్రం !

jaga

డిసెంబర్‌కు ముందే తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఊహించని విధంగా మలుపు తిరుగుతాయని అంచనా వేస్తున్న ప్రధాన పార్టీలు ఆ మేరకు ఇప్పటినుంచే వ్యూహరచన, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా.. రాజకీయ పార్టీ స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణపై దృష్టి సారించారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడినప్పటికీ, అక్కడ కూడా తాను బలీయ శక్తిగా ఉండేందుకు జగన్‌ ఇప్పటినుంచే ముందుచూ పుతో వ్యవహరిస్తున్నారు. తాను తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని జగన్‌ స్పష్టం చేయనున్నారు.

ఈ విషయంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారిలోనే పయనిం చనున్నారు. ‘జగన్‌ తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. తెలుగు ప్రజలంతా సమానమే. ఆయన రాష్ట్ర విభజనకు అనుకూ లమే. ఒకవేళ రాష్ట్ర ం విడిపోతే మాది జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్ర విభజన అనేది ఇప్పటి సీఎంతో సహా ఎవరి చేతుల్లోనూ లేదు. అది కేంద్రం రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయం. కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించాలన్నది జగన్‌ అభిమతమ’ని ఆయన సన్నిహిత సహచరుడొకరు వ్యాఖ్యా నించారు.

ఇదిలాఉండగా, తెలంగాణలో కూడా తన పార్టీ శక్తివం తంగా తయారుకావాలంటే తెలంగాణ అనుకూల వైఖరి తీసుకో కతప్పదని జగన్‌ శిబిరం నిర్ణయించింది. అందులో భాగంగా.. జనవరి 1 నుంచి బీసీ మహిళా ఎమ్మెల్యే, జగన్‌కు వీర విధేయురాలయిన కొండా సురేఖ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు డిసెంబర్‌ 15 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమ కమిటీలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి నుంచి టీఆర్‌ఎస్‌కు మించిన ఊపుతో ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అటు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో మౌనంగా ఉండిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు తెలంగానంపై నోరు మెదపని వైఖరి అవలంబిస్తున్నందున.. తాము ఉద్య మాన్ని చేతులోకి తీసుకోవడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లను తెలంగాణ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టేందు కు జగన్‌ శిబిరం వ్యూహరచన చేస్తోంది. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిష్ర్కమించేందుకు ప్రధాన కారకులయిన తెలంగాణ సీనియర్లకు సరైన సమయంలో సరైన గుణ పాఠం చెప్పాలని జగన్‌ శిబిరం యోచిస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక బీసీ మహిళా ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ నేతృత్వంలో మొదలుపెట్టడం ద్వారా.. వ్యక్తిగతంగా సీనియర్లను, సంస్థాగతంగా కాంగ్రెస్‌ పార్టీని ఏకకాలంలో దెబ్బకొట్టాలన్న వ్యూహం స్పష్టంగా కనిపి స్తోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను ముఖ్యమంత్రిగా ముందే ప్రకటించాలన్నది జగన్‌ శిబిరం వ్యూహమని సమాచారం.

తెలంగాణ వస్తే దళితుడిని సీఎంగా చేస్తానని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. బీసీ, దానికితోడు మహిళయిన సురేఖను సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణలో 65 శాతం బీసీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే వ్యూహంతో ముందుకు వెళుతోంది. టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో కలసిపోయిన సంకేతా లు స్పష్టమయినందున.. ఆ పార్టీని కూడా దెబ్బతీసే రెండంచెల వ్యూహంతో జగన్‌ శిబిరం ముందుకు వెళు తోంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకూ కాంగ్రెస్‌ను విమర్శించ కుండా.. కేవలం తన పార్టీని బలోపేతం చేసుకునేందుకే తెలంగాణ ఉద్యమాన్ని వినియోగించుకుంటోందని గ్రహించిన జగన్‌ బృందం, తెలంగాణపై టీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధి కన్నా, తమకే ఎక్కువ అంకితభావం ఉందని చాటేందుకు తానే సొంతంగా ఉద్యమాలు నిర్మించనుంది.

మరోవైపు.. టీఆర్‌ఎస్‌ కూడా డిసెంబర్‌ 31 తర్వాత తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఆసరా చేసుకుని ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని, కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. టీడీపీ, జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌, బిజేపీ సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సంస్థాగతంగా తాను పటిష్ఠంగా లేకపోతే రాబోయే సమస్యలను ఎదుర్కోవడం కష్టమన్న వ్యూహంతో టీఆర్‌ఎస్‌ డిసెంబర్‌ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో తానే ముందు వరసలో ఉండేలా కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటోంది.

మరోవైపు.. తెలంగాణ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా ఇప్పటినుంచే తెలంగాణ సమస్యపై గళం విప్పకపోతే డిసెంబర్‌ తర్వాత తామెక్కడ వెనుకబడిపోతామోనన్న ఆందోళనతో ఇప్పటినుంచే తెరపైకొస్తున్నారు. ఎంపీ మధుయాష్కీ, వివేక్‌, మందా జగన్నాధం, సీనియర్‌ ఎమ్మెల్యే ఆర్‌, దామోదర్‌రెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, కెఆర్‌ ఆమోస్‌, యాదవరెడ్డి, కమలాకర్‌రావు వంటి నేతలు తెలంగానాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ మాత్రం, కేవలం టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే లక్ష్యంతోనే అడుగులు వేస్తోంది.

కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని కేసీఆర్‌ బాహాటంగా వ్యాఖ్యానించిన తర్వాత.. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు, ప్రధానంగా విద్యార్థి జేఏసీ, ఉద్యోగ సంఘాలు దూరమయిన విషయాన్ని గ్రహించిన టీడీపీ, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉంది. దేవేందర్‌ గౌడ్‌, నాగం, కడియం, మోత్కుపల్లి వంటి నేతలు తెలంగాణ వాదాన్ని మునుపటి కన్నా ఉధృతంగా వినిపిస్తు తమ పార్టీ ఎక్కడా వెనుకబడి పోకుండా జాగ్రత్త పడుతున్నారు.

Monday, November 29, 2010

చిరంజీవి పార్టీలో చిచ్చు: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా?


కాంగ్రెసు పార్టీకి, లోకసభ సభ్యత్వానికి వైయస్ జగన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. కాగా, వైయస్ జగన్ రాజీనామా చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చిచ్చు పెట్టింది. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరాలా, వద్దా అనే విషయంపై చిరంజీవి తన పార్టీ శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వంలో చేరే విషయంపై లేదా ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంపై చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. తమ 18 శాసనసభ్యుల్లో 16 మంది శాసనసభ్యులు కచ్చితంగా ప్రభుత్వానికి మద్దతిస్తారని, తన వెంట నడుస్తారని ఆయన చెప్పినట్లు సమాచారం. శోభా నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డిలపై ఆయన అమమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. వారితో పాటు మరో ఎమ్మెల్యే కూడా వైయస్ జగన్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదనే దీమాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అందుబాటులో ఉన్న శాసనసభ్యులతో, ఎమ్మెల్సీలతో సమావేశమై ఆ మేరకు ఆయన హామీ ఇచ్చారు. వైయస్ జగన్ వర్గం ప్రయత్నాలను ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెసుకు శాసనసభలో 156 మంది శాసనసభ్యులున్నారు. ప్రజారాజ్యం పార్టీకి 18 మంది, తెలంగాణ రాష్ట్ర సమితికి 11 మంది, మజ్లీస్ కు ఏడుగురు, సిపిఐకి ఏడుగురు, సిపిఎంకు ఒక్కరు, తెలుగుదేశం పార్టీకి 90 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. శాసనసభలో ప్రభుత్వానికి కనీసం 147 మంది శాసనసభ్యుల బలం అవసరం. వైయస్ జగన్ వర్గం వెళ్లిపోయినా అంతకన్నా ఎక్కువే బలం ఉంటుందని కాంగ్రెసు అధిష్టానం విశ్వాసంతో ఉంది. వైయస్ జగన్ వెంట 15 మందికి మించి శాసనసభ్యులు వెళ్లిపోరనే విశ్వాసంతో ఉంది. ఆ మేరకు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 16 మంది మద్దతిస్తారని భావిస్తున్నారు. ఎక్కువలో ఎక్కువగా జగన్ వెంట 26 మంది శాసనసభ్యులు వెళ్లిపోయినా నష్టం లేదనే భావనతో కాంగ్రెసు నాయకత్వం ఉంది.

తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదని, అందు వల్ల ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ముందుకు రాదని అంటున్నారు. మజ్లీస్ కూడా కాంగ్రెసు వైపే ఉండే అవకాశం ఉంది. తెరాస మద్దతివ్వకపోవచ్చు. తెరాస మద్దతు తీసుకోవాలంటే పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. తెలంగాణ డిమాండ్ ను ఆ పార్టీ మరోసారి ముందుకు తేవచ్చు. అందువల్ల తెరాస మద్దతు తీసుకునే వైపుగా ఆలోచన చేయకపోవచ్చు. ఇతరులను కూడా తమ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ప్రభుత్వం పడిపోదని వైయస్ జగన్ వర్గానికి చెందిన గోనె ప్రకాశ రావు స్వయంగా చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన వైయస్ జగన్ కు లేదని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు కూడా చెబుతున్నారు. పరిస్థితిని గమనించే జగన్ వర్గం ఆ విధమైన వాదనలను ముందుకు తెచ్చి ఉంటారని భావిస్తున్నారు.

కాగా, వైయస్ జగన్ వెంట ఎవరూ వెళ్లరని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. వైయస్సార్ పై సానుభూతితో అప్పట్లో వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని 150 మంది సంతకాలు చేశారని, తాను కూడా సంతకం చేశానని, ఆ పరిస్థితి ఇప్పుడు లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ మాటల్లో రాజకీయ పరిపక్వత లేదని ఆయన విమర్సించారు. ఎవరో పార్టీ పెడతారని కాంగ్రెసును వీడి వెళ్లేది లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రాజీనామా చేసే విషయంపై పునరాలోచన చేస్తానని చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్ది వైయస్ జగన్ కు మద్దతు తగ్గుతూ పోతుందని కాంగ్రెసు అంచనా. దానివల్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని అంటున్నారు.

Saturday, October 23, 2010

చంద్రబాబు తడబాటు



ఈరాష్ట్రాన్ని దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిలో నాయకత్వ పటిమ, దృఢ చిత్తం లోపిస్తున్నదా? వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణం తర్వా త, ఆ స్థాయిలో ఉన్న చంద్రబాబు మరింత బలపడవలసి ఉండగా, రాజకీయ ప్రత్యర్థులకు అలుసుగా ఎందుకు మారుతున్నారు? ఏదో తెలియని ఆరాటంతో వ్యవహరించవలసిన అవసరం ఆయనకు ఏమి వచ్చింది? ప్రస్తుతం ఈ ప్రశ్నలు రాజకీయ పరిశీలకులనే కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ను సైతం వేధిస్తున్నాయి.

ప్రధాని మన్మోహన్‌సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు, ప్రతిపక్షాల తరఫున ఆయన అపాయింట్‌మెంట్ కోరి భంగపడిన చంద్రబాబు, నేరుగా ధర్నాకు నాయకత్వం వహించడమే కాకుండా, ప్రధానిని 'శాడిస్టు'గా అభివర్ణించి, విమర్శల జడివానలో చిక్కుకున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కావాలంటే ముందుగానే ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించవలసి ఉంటుందని చంద్రబాబుకు తెలియంది కాదు.

తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేయడమే కాకుండా, ఒక దశలో దేశ ప్రధానుల నియామకంలో కీలక పాత్ర వహించిన చంద్రబాబుకు పద్ధతులు తెలియకుండా ఎలా ఉంటాయి! అధికారానికి ఆమడ దూరం లో ఉండే పార్టీలు, అర్ధంతరంగా ప్రధాని అపాయింట్‌మెంట్ కోరి, అది లభించని పక్షంలో ధర్నాలు చేయడం వేరు. ఆయా సందర్భాలలో గొంతెమ్మ కోర్కెలు కోరవచ్చు కూడా! అధికారంలో ఉంటే ఎదురయ్యే సాధకబాధకాలు క్షుణ్ణంగా తెలిసిన చంద్రబాబు ఇలా వ్యవహరించడం, మాటలు తూలడం వల్ల ఆయనే నష్టపోతున్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు పట్ల ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, జాతీయస్థాయిలో ఆయనకు ఇంకా గౌరవం మిగిలే ఉంది. సంస్కరణల పట్ల మక్కువ చూపే ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కూడా చంద్రబాబు అంటే గౌరవం ఉంది. అయితే ఒకప్పుడు తాను జాతీయస్థాయి నాయకుడుగా ఒక వెలుగు వెలిగిన విషయాన్ని చంద్రబాబు మరచిపోవడం విచారకరం. తన స్థాయిని మరచి, చిన్న చిన్న విషయాలలో కూడా ఆందోళనలకు తానే నాయకత్వం వహించాలని, ప్రత్యక్షంగా పాల్గొనాలని ఉబలాటపడటం వల్ల, ఆయన ఇమేజ్ పెరగకపోగా నష్టం జరుగుతున్నది.

ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఆత్మ స్థైర్యం నింపి, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు పార్టీ నేతలను కార్యోన్ముఖులను చేయవలసింది పోయి, అన్నీ తానే చేయాలనుకోవడం ఆయన స్థాయి నాయకుడికి తగని పని! ఒకవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం, మరోవైపు కాంగ్రెస్‌తో జత కట్టడానికి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సిద్ధపడడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.పి. జగన్మోహనరెడ్డి జిల్లాల్లో తిరుగుతూ, ప్రజా బలం సమకూర్చుకోవడానికి ప్రయత్నించడం వంటి చర్యల వల్ల చంద్రబాబుకు ఊపిరాడని పరిస్థితి ఉన్న మాట వాస్తవం.

అయితే సమస్యలు చుట్టుముట్టినప్పుడు తొట్రుపాటు పడకుం డా, ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి, ప్రతి వ్యూహాలను రచిం చి, నాయకత్వ పటిమను నిరూపించుకున్న వారే నిజమైన నాయకులు అవుతారు. చంద్రబాబు వ్యవహార శైలి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మిత్రపక్షాలుగా పేర్కొనవచ్చో లేదో తెలియని స్థితిలో ఉన్న వామపక్షాలకు చెందిన రాష్ట్ర నాయకు లు కూడా, ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వనందుకు నిరసన గా నిర్వహించిన ధర్నాకు దూరంగా ఉంటే, రాష్ట్రంలో ఏకైక నాయకుడుగా నిరూపించుకోవలసిన చంద్రబాబు ఆ ధర్నా లో పాల్గొన్నారు.

అంతేగాకుండా ధర్నాలను నిరోధించవలసి న పోలీసు అధికారులపై చిరాకు పడటం ఆయన స్థాయికి తగని పని. అధికారిక విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీ సు అధికారులపై ఉంటుందన్న విషయం ఒక మాజీ ముఖ్యమంత్రికి తెలియదని ఎలా అనుకోగలం! ఈ ఒక్క సందర్భంలోనే కాదు... గతంలో కూడా ఆయన పోలీసు అధికారులపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నాయకు లు ప్రజల కోసం నటిస్తారు.

కానీ అధికారం చలాయించిన వారు నటించాలనుకుంటే వారి గౌరవానికే భంగం. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో చురుగ్గా ఉండే వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఒక పర్యాయం అబిడ్స్‌లోని ఎన్.టి.ఆర్. నివాస గృహంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, వరండాలో ధర్నాకు దిగారు. ఆ సమయంలో గండిపేట కుటీరంలో విశ్రాంతి తీసుకుంటున్న (నిద్ర పోతున్న) రామారావు, హుటాహుటిన అబిడ్స్‌లోని తన నివాస గృహానికి తిరిగి వచ్చారు.

ఆయన వచ్చేలోపు పోలీసులు, అతి కష్టం మీద వై.ఎస్.ఆర్.తోపాటు ధర్నాలో పాల్గొన్న శాసనసభ్యుల ను అరెస్టు చేసి పంపించి వేశారు. ఆ తర్వాత... పరిస్థితి అంత దూరం రావడానికి కారకులైన అధికారులపై ఎన్.టి.ఆర్.తోపాటు, అప్పు డు తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉన్న చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో సందర్భంలో... ఎన్.టి.ఆర్. సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లకుండా, రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్త లు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో ఖిన్నుడైన ఎన్.టి.ఆర్, ఎండలోనే నడిరోడ్డుపై, సచివాలయం ప్రధాన గేటు ఎదురుగా పడుకుని నిరసన తెలిపారు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేయవలసి వస్తున్నదంటే, అధికారానికి దూరంగా ఉన్న రాజశేఖరరెడ్డి అప్పట్లో అలాంటి పనులు చేసినా చెల్లుబాటు అయింది.

కానీ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేసి, ప్రతిపక్షంలో ఉండి, ఆ పనులు చేసి ఉంటే కచ్చితంగా అభ్యంతరకరమే అవుతుంది. ఈ వాస్తవాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. ప్రధానిని దూషించిన చంద్రబాబుపై ముప్పేట దాడి జరుగుతున్నా, మిత్రపక్షాలకు చెందిన వారెవ్వరూ ఆయనకు అండగా నిలవకపోవడం గమనార్హం.

చంద్రబాబు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకు న్న విషయం వాస్తవమే! అంతమాత్రాన తొట్రుపడుతూ, దృఢ చిత్తాన్ని ప్రదర్శించకపోతే ఆయనకు మరింత నష్టం జరుగుతుంది. ఆచరణలో జరుగుతున్నది అదే! తెలంగాణ అంశాన్నే తీసుకుందాం. డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, రాజకీయంగా తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించారు.

అయితే అదంతా ఆయన గొప్ప వల్ల కాదు. కేంద్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయం ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో దెబ్బతిన్నాయి. అయితే తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడం కాంగ్రెస్ చేతిలోనే ఉంది కనుక, ఆ పార్టీ తిరిగి కోలుకునే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని గానీ, ఇటు తెలంగాణ ప్రజలను గానీ ప్రభావితం చేయలేని స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అయోమయంలో పడిపోయింది.

తెలంగాణ రాకపోవడానికి చంద్రబాబు ప్రధా న అడ్డంకి అని టి.ఆర్.ఎస్. చేస్తున్న ప్రచారం, ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నది. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దాదాపు విలన్‌గా చిత్రించడంలో టి.ఆర్.ఎస్. నాయకులు విజయం సాధించారు. దీనితో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకు లు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నా రు. అందువల్లే 'ఢిల్లీలో-జిల్లాల్లో ధర్నా' కోసం గురువారం విడుదల చేసిన కర పత్రాలలో చంద్రబాబు బొమ్మ లేకుండా ఆ పార్టీ నాయకులు జాగ్రత్త తీసుకున్నారు.

ఇది నిజంగా చంద్రబాబుకు అవమానకరమే! అంతమాత్రాన డీలా పడిపోతే ఎవరైనా నాయకుడు ఎలా అవుతారు? తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాం ధ్ర నాయకులు కూడా అడ్డు పడుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రమే అడ్డుపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిరోధించపోవడం ఆ పార్టీ వైఫ ల్యం. తన పార్టీ శ్రేణులను ఆ మేరకు సన్నద్ధం చేయలేకపోవడం చంద్రబాబు వైఫల్యం.

చంద్రబాబు భవిష్యత్తు సంగతి పక్కనబెట్టి, తమ రాజకీయ భవిష్యత్తుదెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ ఇంటి ఎదుట ఆదివారం నాడు ధర్నా చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

తెలంగా ణ ఏర్పాటు అంశంపై ఇప్పటికే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమించినందున, ఆ కమిటీ నివేదిక వచ్చేవరకు మౌనం గా ఉండాలని నిర్ణయించుకున్న టి.ఆర్.ఎస్. అధినేత కె.చంద్రశేఖరరావు, ఈ వ్యవధిలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడానికి కంకణం కట్టుకున్నారు. తెలంగాణ కు అనుకూలంగా చంద్రబాబు ప్రకటన చేయాలని ప్రతిరోజూ కోరుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు, తమ పార్టీకీ చెందిన సీమాంధ్ర నాయకులు తెలంగాణ కు అడ్డుపడుతున్న విషయం గురించి మాట్లాడరు.

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా ఈ విషయంపై స్పందించరు. వాస్తవానికి రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది ఎటువంటి పరిస్థితో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీది అటువంటి పరిస్థితే! అయినా చంద్రబాబు టార్గెట్ అవుతున్నారంటే రాజకీయాలలో అది సహజం. రాజకీయాల లో ఇందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యపోవాలి. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరిస్తే, టి.ఆర్.ఎస్.తో కలిసినా, కలవకపోయినా తెలంగాణ ప్రాంతంలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుంది.

ఈ కారణంగా సీమాంధ్రలో నష్టం జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఒకవేళ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తే, సీమాంధ్రలో ఆ పార్టీకి ప్రయోజనం చేకూరవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా, తెలుగుదేశం పార్టీకి చేకూరే ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. తెలంగాణ కోసం ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం నాయకులు ఎన్ని వీధి పోరాటాలు చేసినా ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని చెప్పలేం.

ఎందుకంటే తెలంగాణకు సింబల్‌గా కె.సి.ఆర్. ఇదివరకే అవతరించారు. రాష్ట్ర భవిష్యత్తుపై కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయోజనం పొందలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. మంచోచెడో ప్రజారాజ్యం పార్టీ సమైక్యాంధ్ర నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిం ది. కాంగ్రెస్‌తో పోల్చితే తనది భిన్నమైన పరిస్థితి అని అంచ నా వేసుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు.

సంకట స్థితి ఎదురైనపుడే నాయకుడన్నవాడు స్థిత ప్రజ్ఞత ప్రదర్శించాలి. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను విశ్లేషించుకుని, ప్రతివ్యూహాలను రచించుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా అవస రం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయా రు కాకుండా ఉండాలంటే, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇప్పటికైనా ఉమ్మడిగా పరిస్థితులను విశ్లేషించుకుని, పద్మవ్యూహం నుంచి బయటపడడం ఎలాగో ఆలోచించుకోవాలి.

ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నట్టు కనిపించని చంద్రబాబునాయుడు, కనీసం ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యే చర్యలకు దూరంగా ఉంటే మంచిది. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఇది అత్యంత గడ్డు కాలం. ఈ గండం నుంచి గట్టెక్కడం అంత సులువైన విషయం కాదు.

అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కనుక, అవకాశం కోసం ఎదురు చూస్తూ, ప్రత్యర్థుల ఎత్తుగడలకు దీటుగా వ్యూహ రచన చేసుకుని, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం మినహా తెలుగుదేశం పార్టీగానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుగానీ చేయగలిగింది ఏమీ లేదు. చంద్రబాబు ఇందుకు భిన్నంగా తొందరపాటుతో వ్యవహరిస్తూపోతే ఆయనలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయని ప్రజలు కూడా నమ్మే స్థితి వస్తుంది. 

-ఆదిత్య