Friday, May 20, 2011

దగా సొమ్ముతో ధగ ధగ * కళ్లు చెదిరే రీతిలో జగన్ మాయా మహల్ * ఎన్నో ప్రశ్నలు

దగా సొమ్ముతో ధగ ధగ
కళ్లు చెదిరే రీతిలో జగన్ మాయా మహల్
వైఎస్ కుమారుడి విస్తృత ధన ప్రదర్శన 


 
దీనికి 55 ఏళ్ల పునాది
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ ముంబైలో కట్టుకున్న 27 అంతస్తుల ఇల్లు ఇది. భారతదేశంలో అతి పెద్ద నివాస గృహాల్లో ఒకటైన ఈ ఇంటి పేరు ఆంటిలియా. 4,532 చదరపు మీటర్ల స్థలంలో 4 లక్షల చదరపు అడుగుల మేర నిర్మించిన ఈ భవనంలో 168 కార్ల పార్కింగ్‌కు అవసరమైన స్థలం, వాహనాల నిర్వహణకు ఒక పూర్తి అంతస్తు, 9 లిఫ్టులు, ఒక హెలిప్యాడ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఫెసిలిటీ, 50 మంది కూర్చునే మినీ థియేటర్, స్విమ్మింగ్ పూల్స్, వేలాడే తోటలు వగైరా హంగులన్నీ ఉన్నాయి.


ఐదేళ్ల వైభోగమిది

కడప ఎంపీ వైఎస్ జగన్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ ప్రాంతంలో కట్టుకుంటున్న ఇల్లు ఇది. 5,807 చదరపు మీటర్ల స్థలంలో 88,490 చదరపు అడుగుల మేర ఈ ఇంటిని కడుతున్నారు. ఇందులో 14 ఎస్కలేటర్లు, 10 లిఫ్టులు, ఒక మినీ థియేటర్, లైబ్రరీలు, స్క్వాష్ కోర్టు, జిమ్‌లు, 30 బెడ్‌రూమ్‌లు, ఒక్కోటీ సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ సైజ్ ఉండే పలు బాత్‌రూంల... వంటి అనేక హంగులున్నాయి.

హైదరాబాద్, మే 20 : కడప ఎంపీ జగన్ హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లోటస్‌పాండ్ ప్రాంతంలోని హుడా హైట్స్‌లో ఆరు ప్లాట్లను నాలుగు దొంగ కంపెనీల పేరిట కొనుగోలు చేసి, అందులో భారీ ఇంటిని నిర్మిస్తున్న విషయాన్ని 'ఆంధ్రజ్యోతి' వెల్లడించింది. క్యాప్‌స్టోన్ ఇన్‌ఫ్రా, మార్వెల్ ఇన్‌ఫ్రా, హరీష్ ఇన్‌ఫ్రా, ఉటోపియా ఇన్‌ఫ్రా అనే నాలుగు కంపెనీల పేరిట 2, 3, 4, 6, 7, 8 నంబర్లు గల ప్లాట్లను కొనుగోలు చేసి, ఆ ఆరు ప్లాట్లను ఒకటిగా చేర్చి ఈ ఇంటిని నిర్మిస్తున్నారు.

ఈ ఇంటికి సంబంధించి తవ్వినకొద్దీ కొత్త కొత్త విషయాలు, కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. 2010 జులై 6వ తేదీన ఈ ఇంటి ప్లాన్‌కు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నుంచి అనుమతి పొందారు. ఈ స్థలం మొత్తం విస్తీర్ణం 5,807.19 చదరపు మీటర్లు. (6,945 చదరపు గజాలు) అంటే సుమారు ఎకరంన్నర. బంజారాహిల్స్‌లో ఎకరాన్నర స్థలం కొనడానికి మామూలు ధనవంతులు కూడా సాహసించలేరు.

అయితే, నాలుగు దొంగ కంపెనీలను ముందు పెట్టి, వాటి ద్వారా ఆరు ప్లాట్లను కొనిపించి, వాటన్నింటినీ ఏకం చేసి ఇంత పెద్ద స్థలంగా మార్చారు జగన్! క్యాప్‌స్టోన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్స్ పేరిట దీని ప్లాన్‌కు అనుమతి పొందారు. ఈ ప్లాట్లు పేరుకు నాలుగు కంపెనీలకు చెందినప్పటికీ, అదంతా జగన్ సొంత స్థలమేనని ఆయన సొంత పత్రిక 'సాక్షి'లో బాహాటంగా ప్రకటించుకున్నారు.

ఈ స్థలంలో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల నిర్మాణానికి జీహెచ్ఎంసీ 2010 జులై 6న అనుమతి ఇచ్చింది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 8,221.09 చదరపు మీటర్లు (88,490 చదరపు అడుగులు). ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం 1,400 చదరపు అడుగుల ఫ్లాట్‌లో నివసిస్తుందని అనుకుంటే అటువంటి 63 ఫ్లాట్లు కలిపితే జగన్ ఇల్లు అవుతుందన్న మాట. అంటే ఓ 250 మంది నివసించడానికి సరిపోయే ఇంట్లో జగన్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారన్న మాట! ఈ భవనం చుట్టూ కరెంటు తీగలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతోపాటు భారీ ఎత్తున సెక్యూరిటీ సిబ్బందిని మోహరించారు. దీనికి సెక్యూరిటీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు కోసమే అయిదు కోట్ల రూపాయలు వెచ్చించినట్టు సమాచారం.

అక్కడే ఆఫీసు... చర్చి!

ఈ భవనంలో మహా తిరకాసు ఉంది. ఇది వివిధ కంపెనీలకు చెందిన స్థలం. కంపెనీలు గెస్ట్‌హౌస్‌లను, కార్యాలయాలను నిర్మించుకోవడం సహజం. కానీ... ఇంటి నిర్మాణం కోసమంటూ అనుమతులు తీసుకోవడం విశేషం. అందులోనే మరో తిరకాసూ ఉంది. ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకున్నప్పటికీ... ఈ భవనాన్ని చూస్తే అందులో పార్టీ కార్యాలయాన్ని కూడా కలిపి నిర్మిస్తున్నట్లు ఎవరికైనా అర్థమవుతుంది. ఒకవైపు ఇల్లు, మరోవైపు కార్యాలయం... ఈ విభజన స్పష్టంగా కనిపిస్తుంటుంది.

ఒకవైపు జగన్ కుటుంబం ఉండేందుకు ఇల్లును నిర్మిస్తుండగా... మరోవైపు చర్చిని, దాని వెనుక కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇల్లు, చర్చి ఒక రోడ్డులో ఉంటే, కార్యాలయం వాటి వెనుకవైపు రోడ్డులో ఉంది. ఈ ఇంటి ప్లాన్‌కు దరఖాస్తు చేసింది 2010 జులై నెలలో! అప్పటికి జగన్ ఇంకా సొంత పార్టీ పెట్టలేదు. పెట్టే ఆలోచన ఉన్నట్లు కూడా చెప్పలేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించే విషయమై కాంగ్రెస్ అధిష్ఠానంతో జగన్ ఘర్షణ పడుతున్న సమయమది. జగన్ సొంత పార్టీ ఏర్పాటు ప్రకటన చేసింది 2011 మార్చి 12న. అంటే పార్టీ ఏర్పాటుకు సుమారు పది నెలల ముందే ఆయన పార్టీ ఆఫీసుతో సహా అన్నింటికీ పక్కా ప్రణాళిక వేసుకున్నట్లు అర్థమవుతోంది.

అయితే, నివాస ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకుని అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ ఇంట్లో ఆఫీసు కాంప్లెక్స్‌ను నిర్మించినప్పటికీ దానిని పార్టీ కార్యాలయంగా ఉపయోగించబోమని, పార్టీ ఆఫీసు కోసం జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నామని జగన్ సన్నిహితులు చెబుతున్నట్లు సమాచారం. పార్టీ కార్యాలయంగా ఉపయోగించనప్పుడు ఇంట్లో అంత పెద్ద ఆఫీసు భవనాన్ని ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ భవనంపై జగన్ పార్టీ జెండాలను కూడా ఏర్పాటు చేయడం విశేషం.

లోటస్ పాండ్ ప్రాంతంలో రోడ్లు అంత విశాలమైనవి కానందువల్ల అక్కడ పార్టీ కార్యాలయం ఏర్పాటు చుట్టుపక్కల వారికి ఎంతో ఇబ్బంది కలిగిస్తుందనేది మరో వాస్తవం. హైదరాబాద్‌లోని జగన్ స్థలం ముంబైలోని ముఖేశ్ అంబానీ స్థలం కంటే పెద్దది. అయితే ముఖేశ్ అంబానీ 27 అంతస్తుల్లో 4 లక్షల చదరపు అడుగుల ఇల్లు కట్టగా, జగన్ నాలుగు అంతస్తుల్లో 88 వేల అడుగులతోనే ఆగిపోయారు. జగన్ ఇల్లున్న ప్రాంతంలో గ్రౌండ్ ప్లస్ మూడు అంతస్తుల (15 మీటర్లు) కన్నా ఎక్కువ కట్టేందుకు అవకాశం లేకపోవడంతోనే 88 వేల అడుగులతోనే ఆగినట్లు అర్థం చేసుకోవచ్చు. లేదంటే జగన్ ఆయనను తలదన్ని ఆంధ్రా ముఖేశ్ అనిపించుకునేవారే!!

ఎన్నో ప్రశ్నలు

* లోటస్‌పాండ్ ప్రాంతంలో 5,900 గజాల స్థలంలో జగన్ సొంత ఇంటిని నిర్మించుకుంటున్నట్లు 2010 సెప్టెంబర్ 10 నాటి సాక్షి పత్రికలో ప్రచురించారు. నిర్మాణంలో ఉన్న ఇంటి ఫొటో కూడా వేశారు. కానీ ఆ ఆస్తిని జగన్ ఎన్నికల అఫిడవిట్‌లో చూపలేదు. ఎందుకని?
* జగన్ తన సొంతమని ప్రకటించుకున్న ఆ స్థలం, ఇల్లు వాస్తవానికి ఆయన పేరిట లేవు. జగన్ మాయా సామ్రాజ్యంలో భాగమైన నాలుగు దొంగ కంపెనీల పేరిట ఉన్నాయి. ఏమిటి ఇందులో మతలబు?
* ఆ కంపెనీల లావాదేవీలన్నీ చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. వాటిలో పెట్టుబడులు, రుణాలు అన్నీ ప్రశ్నార్థకమే!
* అది కేవలం ఇల్లేనని చెబుతూ కార్యాలయం మాదిరిగా ఎందుకు నిర్మిస్తున్నారు? భవిష్యత్తులో దానిని పూర్తిగా లేదా పాక్షికంగా పార్టీ కార్యాలయంగా ఉపయోగించే అవకాశం లేదా?
* సన్నని రోడ్లున్న ఆ ప్రాంతంలో పార్టీ కార్యాలయాన్ని ఎలా నడుపుతారు?
* ఒకవేళ పార్టీ కార్యాలయాన్ని వేరే చోట ఏర్పాటు చేసేట్లయితే ఇంట్లో అంత పెద్ద కార్యాలయాన్ని ఎందుకు నిర్మించారు?

Sunday, April 24, 2011

కడపలో పంచతంత్రం

ఆ ఐదుగురూ ఐదుగురే. ఒక్కోరిదీ ఒక్కో స్టైల్‌. ఎవరి వ్యూహాలు వారివి. ప్రజల పల్సు పట్టేందుకు ఎవరి దారిలో వారు పయనిస్తున్నారు. వీరికి ఎన్ని సానుకూల అంశాలు న్నాయో.. అన్ని ప్రతికూలాంశాలు ఉన్నాయి. వీరికి ఈ ఎన్నికలు ఒక పరీక్ష. ఒక సవాలు. ఇప్పుడు ప్రచారంలో వాటినే ఎదుర్కొంటున్నారు.వచ్చే నెలలో జరగనున్న కడప పార్లమెంటు, పులివెందుల ఉప ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్ధులుగా మారిన ఐదుగురు నేతలు అప్రతిహతంగా, అవి శ్రాంతంగా పోరాడుతున్నారు. పులివెందులలో వదిన -మరిది మధ్య హోరాహోరీ సంగ్రామం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి తనయుడు స్థాపించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థ్ధిగా పోటీ చేస్తున్నారు. ఆమెపై వైఎస్‌ సోద రుడు, సొంత మరిది వైఎస్‌ వివేకానందరెడ్డి బరిలో ఉన్నా రు. వారిద్దరూ వారి వారి కుటుంబసభ్యుల దన్నుతో ప్రచా రంలో ముందున్నారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బీటెక్‌ రవి బరిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మధ్యనే పోటీ నెలకొంది. వారిద్దరి మధ్య చీలే ఓట్లతో బయటపడాలన్నది బీటెక్‌ రవి ఆశగా కనిపిస్తోంది. విజయ లక్ష్మి మరోసారి సానుభూతి ఓట్లపై ఆశపెట్టుకున్నారు.

ఇక పార్లమెంటు అభ్యర్థుల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ స్వయంగా అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థిగా ఎంపీ మైసురారెడ్డి రంగంలో ఉన్నారు. ముగ్గు రూ అవిశ్రాంతంగా ప్రచారబరిలో దూసుకువెళుతున్నారు.అయితే ఈ ముగ్గురు అభ్యర్ధులకు సొంత జిల్లా కంటే బయట జిల్లాల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్న వారే ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం.

అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించిన జగన్‌కు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, ..గురునాధరెడ్డి, కొండా సురేఖ, రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, శేషారెడ్డి, ధర్మాన కృష్ణదాస్‌, షాజ హాన్‌, శోభానాగిరెడ్డి, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి, జూపూడి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గోనె ప్రకాశరావు, సినీ నటి రోజా వంటి ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. పులి వెందులలో విజయలక్ష్మికి మద్దతుగా కుటుంబసభ్యులం తా బరిలో నిలిచారు. ఆమె ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రతి ఇంటికీ తిరుగుతున్నారు. కూతురు షర్మిల ఆమెతోనే ఉంటున్నారు. జగన్‌ ఎక్కువగా తన తండ్రి మృతి చెందిన సానుభూతి ఓట్లపైనే ఆధారపడుతున్నారు.

ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి డీఎల్‌ రవీంద్రారెడ్డికి మద్దతుగా మంత్రులు ప్రచారంలో నిలుస్తున్నారు. ఇన్చార్జి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో.. మంత్రి ధర్మాన ప్రసాదరావు, బొత్స, అహ్మదుల్లా, మోపిదేవి, మహీధర్‌ రెడ్డి, ఆనం, రఘువీరారెడ్డి, గల్లా, మాణిక్యవరప్రసాద్‌, బస్వరాజు సారయ్య వంటి ప్రముఖులతో పాటు ఎమ్మెల్యే లు కూడా కడపలోనే మోహరించారు. మంత్రులకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మండలా నికి ఒక్కో ఎమ్మెల్యే బాధ్యులుగా వ్యవహరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుం డగా, ఈనెల 28 నుంచి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి మూడురోజుల పాటు పర్యటించనున్నారు. గతంలో జగన్‌ కు వచ్చిన ఓట్లలో చీలికతో జగన్‌ గట్టెక్కరని డీఎల్‌ ఆశాభావంతో ఉన్నారు. పులివెందులలో కాంగ్రెస్‌ అభ్యర్ధి వైఎస్‌ వివేకానందరెడ్డి అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నా రు. ఆయనకు కుటుంబసభ్యులు దన్నుగా నిలస్తున్నారు. మంత్రులు పులివెందుల ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు.

ఇక్కడ విజయలక్ష్మి కంటే వివేకానందరెడ్డే ఎక్కువగా ప్రజలతో ఎక్కువ సేపు గడుపుతున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి ఎం.వి.మైసురారెడ్డి కూ డా అవిశ్రాంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం నుంచి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. నామా నాగేశ్వరరావు, రమేష్‌రాథోడ్‌, ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, తుమ్మల నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్‌, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్‌.రమణ, తలసాని శ్రీనివాసయాదవ్‌, రేవంత్‌రెడ్డి, శ్రీరాం తాతయ్య, పల్లె రఘునాధరెడ్డి, రమణ, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అబ్దుల్‌ఘనీ, రామకృష్ణ, సీఎం రమేష్‌, గరికపాటి మోహన్‌రావు, బాబూ రాజేంద్రప్రసాద్‌, సినీ నటి కవిత, తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి తదితరులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యే ఇన్చార్జిగా, వారికి సహాయకులుగా రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Jagans 


       సానుకూలత
  • వైఎస్‌ మృతి సానుభూతి. కొడుకుగా వాటిని పొందే యత్నం.
  • గ్రామ నేతలపై పట్టు. క్రిస్టియన్లు, ముస్లిం ఓటు బ్యాంక్‌.
  • కాంగ్రెస్‌ ఓట్లలో భారీ చీలిక.
  • అంతమంది కలసి ఒక్కడిని ఓడించేందుకు యత్నిస్తున్నారన్న స్థానిక సెంటిమెంట్‌.
  • నాలుగు నియోజకవర్గాల్లో సొంత ఎమ్మెల్యేల బలం.

    ప్రతికూలత
  • గతంలో తనకు వచ్చిన ఓట్ల చీలికతో నష్టం. గెలిస్తే బీజేపీతో కలసిపనిచేస్తారన్న ప్రచారంతో కలవరం. దానివల్ల క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లు, ముస్లిం ఓట్లు దూరమయ్యే ప్రమాదం.
  • తన వర్గీయులపై పోలీసుల కట్టడితో పోలింగ్‌ శాతం గణనీయంగా తగ్గే ప్రమాదం. అది తగ్గితే మెజారిటీ ఎంతన్నది అనుమానం.
  • ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటారన్న కారణంతో స్థానికంగా ఉండరన్న విమర్శలు. అవినీతిపరుడన్న ప్రచారం మైనస్‌ పాయింట్‌. ఆరేళ్లలో లక్షకోట్లు అక్రమంగా సంపాదించారన్న విమర్శలు.
  • గతానికి భిన్నంగా కాంగ్రెస్‌-టీడీపీలను ఏకకాలంలో ఎదుర్కోవలసి రావడం.

    డీఎల్‌ రవీంద్రరెడ్డి
  • సానుకూలతravin.(Maidukuru)
  • వివాదరహిత ముద్ర.
  • గతంలో జగన్‌కు పడిన ఓట్ల చీలి కపై ఆశ.
  • ప్రభుత్వ యంత్రాంగం మద్దతు.
  • ఎస్సీ, మైనారిటీల ఓటు బ్యాంకుపై ఆశ.
  • అందుబాటులో ఉంటారన్న సానుకూలత.

    ప్రతికూలత

  • ఎవరికీ పనులు చేయరని, అహంకార పూరితంగా వ్యవహరిస్తారని, ఎవరినీ కనీసం గౌరవించరన్న విమర్శలతో కొంత మైనస్‌.
  • సొంత నియోజకవర్గంలోనే పలుకుబడి లేని వైనం. జగన్‌కే ఎక్కువ బలం ఉండటం.
  • ప్రచారంలో జగన్‌ వర్గీయుల నుంచి ప్రతిరోజూ ఎదురీత. ప్రజల నుంచి నిరసనలు.
  • బలవంతంగా పోటీకి దిగారన్న అప్రతిష్ఠ.
  • పార్టీ శ్రేణులతో సత్సంబంధాలు లేకపోవడం.

    మైసూరారెడ్డి
    mysooraeddyసానుకూలత
  • కడప జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నేతగా, పాదయాత్రలు చేసిన సీమ నేతగా సుదీర్ఘకాల గుర్తింపు.
  • వివాద రహిత ముద్ర.
  • హంగు, ఆర్భాటాలకు దూరం.
  • అవినీతి ముద్ర లేకపోవడం.
  • విశ్వసనీయత కలిగిన నేతగా గుర్తింపు.

    ప్రతికూలత
  • కడప జిల్లాలో ఉండే సమయం తక్కువ.
  • రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు ఉన్నప్పటికీ ఎక్కువగా తన నియోజకవర్గ, తన మండలం, తన గ్రామానికే పరిమితం కావడం.
  • సాధారణ నేతల మాదిరిగా జనాలతో మమేకం కాలేకపోవడం.
  • జిల్లా నేతలతో అంతంత మాత్రపు సంబంధాలు.
  • పెద్ద వక్త కాకపోవడం. ఎదుటి వారి మనోభావాలను పట్టించు కోకుండా ముక్కుసూటిగా మాట్లాడటం.

    వైఎస్‌ విజయలక్ష్మి

    vijyasmaసానుకూలత
  • వైఎస్‌ భార్యగా సానుభూతి.
  • ఎప్పుడూ బయటకు రాని ఆమె ఈ ఎన్నికల్లో ప్రతి గడప ఎక్కడంతో పెరుగుతున్న సానుభూతి.
  • భారీ బలగం ఉన్న కుటుంబసభ్యుల అండ.
  • ఇతరులకు సహాయపడాలన్న తత్వం.
  • వివాదరహిత మనస్తత్వం.

    ప్రతికూలత

  • ఇంతకాలం ప్రజలకు దూరంగా ఉండటం.
  • సమస్యలపై అవగాహన లేకపోవడం. వక్త కాకపోవడం.
  • రాజకీయ కుటుంబంలో ఉన్నా రాజకీయాలపై అవగాహన లేకపోవడం.
  • స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవడం.
  • ఒకసారి అసెంబ్లీకి గెలిపించినా ఒక్కసారి కూడా సభకు రాలేదన్న అపఖ్యాతి. సానుభూతి ఈసారి ఎన్నికలో పనిచేస్తుందా లేదానన్న సంశయం.

    వైఎస్‌ వివేకానందరెడ్డి
    YS-Vivekanadareddyసానుకూలత

  • అందరికీ అందుబాటులో ఉండే నైజం.
  • మండలాలు, గ్రామాల్లో అందరినీ పేరు పెట్టి పిలిచేంత పరిచయాలు, చనువు. విస్తృతమైన బంధుత్వాలు.
  • సమస్యలపై పూర్తి అవగాహన.
  • ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్‌కు ఆయనే రధసారథి కావడంతో పెద్దగా సమస్యలు లేని సానుకూలత.
  • అవినీతిపరుడన్న ముద్ర లేకపోవడం.

    ప్రతికూలత

  • వైఎస్‌ కుటుంబంతో విబేధాల వల్ల ఆ కుటుంబ మద్దతు కోల్పోవడం.
  • వైఎస్‌ బంధుగణాలు మూకుమ్మడిగా దూరమవుతున్న వైనం.
  • ఆపదలో అన్న కొడుకుకు అండగా నిలబడలేదన్న అపవాదు.
  • కాంగ్రెస్‌ ఓట్లలో చీలిక.
  • ఇన్నాళ్లూ ‘అన్న’ బలమే తన బలమని భావించారు. ఫలితంగా ఇప్పుడు సొంత వర్గమంటూ లేకపోవడం.

    బీటెక్‌ రవి
    prsonసానుకూలత
  • రాజకీయాలకు కొత్త.
  • అవినీతి ముద్ర లేకపోవడం.
  • యువకుడు కావడం.
  • నియోజకవర్గంలో పార్టీకి శాశ్వ త ఓటు బ్యాంకు ఉండటం.
  • ధనబలం ఉండటం.

    ప్రతికూలత
  • సొంత పార్టీలోనే స్థానిక నేతల నుంచి వ్యతిరేకత.
  • బలమైన వర్గం లేకపోవడం.
  • పార్టీ నేతలతో సంబంధాలు అంతంతమాత్రమే.
  • సమస్యలపై అవగాహన లేకపోవడం.
  • కొత్త అభ్యర్ధి కావడం, జగన్‌ కుటుంబస్థాయిలో ఆర్థి కంగా బలంగా లేకపోవడం.

Saturday, January 8, 2011

కిం.. కర్తవ్యం ?

Babu
శ్రీ కృష్ణ కమిటీ నివేదిక పెట్టిన చిచ్చు మూడు ప్రధాన రాజకీయ పార్టీలో ఇంకా రగులుతోంది. కాంగ్రెస్‌-టీడీపీ ఒకేరకమైన సమస్యతో సతమత మవుతుంటే, టీఆర్‌ఎస్‌ మరో రకమైన సమస్యతో ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై అనుసరించాల్సిన వైఖరి కాంగ్రెస్‌-టీడీపీలకు ప్రాణసంకటంలా మారగా, కేసీఆర్‌ మాత్రం తన భవిష్యత్‌ రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో కాంగ్రెస్‌పై అనుసరించాల్సిన వ్యూహమేమిటో తెలియక అయోమయంలో ఉన్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ-సీమాంధ్రలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఎలాంటి వైఖరి అనుసరిం చాలో తెలియక అవస్థలు పడుతోంది. ఏ ప్రాంతం వైపు మొగ్గుచూపినా మరొక ప్రాంతంలో దెబ్బ తింటా మన్న భయం వెన్నాడుతోంది.

తెలంగాణ వైపు మొగ్గుచూపినా ఆ రాజకీయ లబ్థి టీఆర్‌ఎస్‌- బీజేపీకి వెళుతుందన్న భయం కూడా లేకపోలేదు. ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు రాజీ నామా హెచ్చరికలు జారీ చేస్తున్నా.. వారు గతంలో అనుసరించిన వైఖరిని బట్టి, ఈసారి కూడా అంత సీను ఉండదని, మళ్లీ అధిష్ఠానం హెచ్చరికలతో మరోసారి అస్తస్రన్యాసం చేస్తారన్న అంచనా తెలం గాణ ప్రజల్లో ఉంది. పీసీసీ అధ్యక్షుడుడీఎస్‌ స్వయంగా తెలంగాణ నేత అయినప్పటికీ, పార్టీ వైఖరిని ప్రకటిం చలేకపోతున్నారు. మరోవైపు పార్టీ వైఖరితో ప్రజల్లో ముఖం చూపించలేక తెలంగాణ ఎంపీలు తల్లడిల్లిపోతున్నారు. అందుకే భేటీల మీద భేటీలు వేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు.

kcrr 

ఇక తెలంగాణ కోసం ఏర్పడిన టీ ఆర్‌ఎస్‌ మరో విచిత్ర మైన ఇరకాటంలో ఇబ్బంది పడింది. సోనియాగాంధీ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేసిందని, చంద్రబాబు నాయుడు ఒక్కరే తెలంగాణకు అడ్డుపడుతున్నారని మొన్నటి వరకూ ప్రచారం చేసిన కేసీఆర్‌ ఇప్పుడు యుపీఏ అడ్డం తిరగడంతో ఆత్మరక్షణలో పడ్డారు. శ్రీ కృష్ణ కమిటీ తెలంగాణకు వ్యతిరేక తీర్పు ఇవ్వడంతో సోనియాగాంధీని విమర్శించాలో, వద్దో అర్థం కాక సతమతమవుతున్నారు. నిజంగా సోనియాగాంధీ తెలంగాణ ఎప్పుడో ఇచ్చినట్టయితే, శ్రీ కృష్ణ కమిటీ నివేదిక, దానిపై చిదంబరం భేటీ, మళ్లీ ఈనెలాఖరులో చిదంబరం భేటీ ఎందుకన్న ప్రశ్నలు తెలంగాణలోని సామాన్య జనంలో మొదలు కావడం ఇబ్బంది కలిగిస్తోంది.

తన దీక్ష విరమణ సందర్భంగా డిసెంబర్‌ 9న చిదంబరం చేయవలసిన ప్రకటనను తానే నిర్దేశించానని సగర్వంగా చెప్పు కున్న కేసీఆర్‌.. ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఎందుకు ప్రకటన చేయించలేదంటూ టీఆర్‌ఎస్‌ ప్రతర్థి వర్గాలు నిలదీస్తుండటం ఆ పార్టీకి ఇరకా టంగా పరిణమించింది. బహుశా ఇలాంటి ఇరకాటం తోనే కేసీఆర్‌ జోరు తగ్గించారని, పార్లమెంటు సమావేశాల వరకూ గడువు ఇచ్చి, ఆ లోగా జరిగే పరిణామాలను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలన్న భావనతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఇప్పటికీ కేసీఆర్‌ సోనియాగాంధీని విమ ర్శించకపోవడం కూడా చర్చనీయాంశమయింది. భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసమే ఆయన సోనియాను విమర్శించడం లేదని, కాంగ్రెస్‌ను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేకనే ఆయన వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

D.-Sriniva 

అందుకే గత డిసెంబర్‌ ముందున్న స్పీడు, జోరు ఆయనలో కనిపించడం లేదంటున్నారు.అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా తెలంగాణపై సంకట స్థితినే ఎదుర్కొంటు న్నారు. తెలంగాణకు ప్రత్యేక శాఖ ఏర్పాటుచేయా లన్న డిమాండ్‌ పెరుగుతుండటంతో దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. గతంలో శ్రీ కృష్ణ కమిటీపై పెదవి విప్పకుండా రెండు ప్రాంతాల నేతలతోనే మాట్లాడించిన బాబు, ఈసారి కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తున్నారు. సీమాంధ్రలో కూడా పార్టీని కాపాడుకునే అవసరం ఉన్నందున, తెలంగాణ నేతల స్వేచ్ఛకు అడ్డు రాకుం డానే అటు పార్టీని, ఇటు రెండు ప్రాంతాల నాయకుల ను కాపాడుకోవటం సవాలుగా పరిణమించింది.

ఇటీవల చిదంబరం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి గైర్హాజరవడం ద్వారా తెలంగాణ విద్యార్థి జేఏసీలు, ఉద్యమ సంఘాల వ్యతిరేకత తగ్గించుకున్న బాబు, ఈనెలాఖరులో మళ్లీ ఢిల్లీలో జరిగే భేటీకి హాజరుకా వాలా వద్దా అన్న అంశంపై తర్జనభర్జన పడుతు న్నారు. సోనియా ఎప్పుడో తెలంగాణ ఇచ్చేసిందని, తానే అడ్డుపడుతున్నానంటూ కేసీఆర్‌ ఇప్పటివరకూ చేసిన ఆరోపణలో నిజం లేదని తెలంగాణ ప్రజలకు స్పష్టమయినందున, ఆ తర్వాత పరిణామాలు తమ పార్టీకి ఏ మేరకు లాభిస్తాయోనని వేచిచూస్తున్నారు. ఈలోగా తెలంగాణ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్‌ను ముద్దాయిగా నిలబెట్టా లన్న వ్యూహం అనుసరిస్తున్నారు.

Saturday, January 1, 2011

2011 నే ‘తల’ రాతలు * సవాళ్ల మధ్య సబలలు

రాజైనా.. .పేదైనా.. .పండితుడైనా ...పామరుడైనా...కార్మికుడైనా ...కర్షకుడైనా ...ఏరంగం వారికైనా గడిచిన సంవత్సరం...రాబోయే సంవత్సరం సాధించిన మంచి చెడులను విశ్లేషించుకునేది ఈ రోజే...అనుకున్నవి జరగక రాబోయేది మంచి కాలమని ఆశావహులు భావిస్తే.... తమకెంతో మేలు జరిగిన ఈ సంవత్సరాన్ని ఎన్నటికీ మరువలేని తీపిగుర్తుగా తమ హృదయడైరీలలో భద్రంగా రాసుకునే వారు మరికొందరు...రాజకీయరంగంలో మహిళలు తక్కువమందే ఉన్నా మన రాష్ట్రానికి సంబంధించి మహిళా ప్రజాప్రతినిధులలో కొందరు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతుండగా మరికొందరు రాష్ట్ర రాజకీయాలలో మంత్రులుగా కీలక బాధ్యతలను నెరవేరుస్తున్నారు. వారి వారి రాశులు, నక్షత్రాలు ఆధారంగా రాబోయే కొత్త సంవత్సరంలో వారి జాతకఫలాలు ఎలా ఉన్నాయో విశ్లేషిస్తూ...మంత్రులుగా మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ మహిళా మంత్రులకు ధీర కొత్త ఏడాది శుభాకాంక్షలు...అందిస్తోంది...

కలిసి సాగాలి
సబితా ఇంద్రారెడ్డి, జననం: 5 మే 1963
కన్యారాశి, హస్త నక్షత్రం, నక్షత్రాధిపతి చంద్రుడు
PSabita
వ్యక్తిత్వంలో కన్పించని అపార సహనం, అంకితం, విశ్వాసం ఉంటాయి. ద్వంద్వ వ్యక్తిత్వం. మనస్సులోని భావాలను బయడపడనీయరు. అలా బయటపెడితే, తాము తక్కువ అంచనాకు గురవుతామేమోనని భయపడుతుంటారు. అది మరో రూపంలో లేదా కొంత కాలం తరువాతనైనా బయటపడే అవకాశం ఉంది. ఇలాంటి వారిని అర్థం చేసుకునేందుకు మరెంతో సహనం అవసరం. వీరు ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చి పని చేయడం ఆరంభిస్తారు. నిర్ణయ శక్తి బలహీనం. తమ అభిప్రాయాలను సమర్థించు కుంటూ ఆత్మరక్షణ ధోరణితో వ్యవహరిస్తుంటారు. ఒత్తిళ్ళలో కన్నా క్లిష్టపరి స్థితుల్లో వీరికి మరెవరికీ లేనంత పోటీతత్వం, తిరుగుబాటు లక్షణాలు కలిగి వుంటారు. అలాంటప్పుడు దృఢసంకల్పం, దీర్ఘకాలిక పోరాట శక్తి కలిగి ఉంటారు. ఎప్పటికప్పుడు ఆలోచనళ్లో సరళత్వాన్ని పెంచుకుంటూ, ముందు గానే అభిప్రాయాలకు కట్టుబడకుండా ఉండాలి.

ఎదుటి వారు చెప్పేది తాను వినడం, తాను చెప్పేది ఎదుటి వారు వినడం అనే తరహాలో కాకుండా ఇంటరా క్టివ్‌ స్వభావాన్ని పెంచుకోవాలి. తద్వారా జాతకులు పబ్లిక్‌ స్పీకర్స్‌ కాగలరు. అంతర్గతంగా ఉండే వివిధ భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. 2011 ఊహించుకున్నంత భయంకరంగా ఏమీ ఉండదు. ఆమె పాత్ర చాలా కీలకం అవుతుందన్న ఆందోళన చెందనక్కర్లేదు. అందువల్ల కాస్తంత ధైర్యంగా ఉండ డం అలవాటు చేసుకుంటే మంచిది.
వైఫల్యాలో వైరాగ్యం
గల్లా అరుణ, జననం: 20సెప్టెంబర్‌ 1943
వృషభ రాశి, రోహిణి నక్షత్రం
g-aruna
ఇతరుల నుంచి తనకు ఏమీ కావాలో ఆమెకు తెలుసు. అందుకు అనుగుణంగానే పని చేస్తుంటారు. వనరులను గుర్తించడం, వాటిని అందరికీ ఉపయోగపడేలా చూడడంలో (స్వామికార్యం, స్వకార్యం) ఎంతో పరిపక్వత ఉంటుంది. పైకి కన్పించకపోయినా, ఆచరణలో మాత్రం తనను నమ్ముకున్న వారికి సహాయం చేసితీరుతారు. ఆ సహాయం పొందిన వారికి అది ఎంతో ప్రయోజనాత్మకంగా ఉంటుంది. అలాంటి సమయాల్లో ఆమె రాజకీయ నేతగా గాకుండా మానవత్వంతో ఆలోచిస్తారు. పరిస్థితులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అభిప్రాయాలను మార్పు చేసుకుంటూ వుంటారు. ఇతరులు వంచించేందుకు ప్రయత్నించేప్పుడు ఆ విషయాన్ని గుర్తిస్తూ, వాటినుంచి తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తారు. ఇది పోరాట, సాహస లేమికి నిదర్శనమైనప్పటికీ, ఆమెలో ఉండే తెలివితేటలకు ప్రతీక కూడ. భావోద్వేగపరంగా అస్థిరతతో వ్యవహరిస్తారు. చుట్టుపక్కల పరిస్థితులకు తేలిగ్గా లొంగిపోతారు.

తరచూ కోపం, అసహనం ఆమె తీసుకున్న నిర్ణయాల్లో కన్పిస్తుంది. బయటకు ప్రశాంతంగా ఉన్నప్పటికీ, భావోద్వేగాల తీవ్రత అధికం. క్లిష్టపరిస్థితుల్లో సొంత నిర్ణయాలు తీసుకోలేరు. ఆ సమయంలో జ్యోతిష్యులను లేదా గురువులను ఆశ్రయిస్తారు. వైఫల్యాలు ఎదురైతే, మనం ఏం చేసినా అంతా దైవాధీనం అనే ఆధ్యాత్మిక ధోరణితో ఉంటారు. సేవా భావం అధికం. 2011లో ఈ తరహా భారీ కార్యక్రమాన్ని చేపడితే పేరు ప్రఖ్యాతులు రావడంతో పాటు రాజకీయ భవిష్యత్తుకూ తోడ్పడుతుంది.
అపార్థాలకు తావెక్కువ
డి.కె.అరుణ, జననం:4 మే 1960
కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం, బుధుడు ఆధిపత్యం
DK-Aruna
జీవితంలో భావస్వాతంత్య్రాన్ని, స్వేచ్ఛను, సౌకర్యాలను కోరుకుంటారు. తన పనిలో మరొకరి జోక్యం, ప్రమేయం, ఒత్తిళ్లు లాంటి వాటిని ‚సహించలేరు. నిర్ణయాలకు కారణాలను ఎదుటివారికి సుదీర్ఘంగా చెప్పేందుకు ఇష్టపడరు. ఓ పనిపై ఆమె అభిప్రాయాల్లో అది ఆమెకు ఇష్టమో, కాదో బయటపడుతుంది. ఓ పని చేయడం ఆమెకు ఇష్టం లేని సమయంలో, ఆ పని చేస్తే బాగుంటుందంటూ మరెవరైనా సుదీర్ఘంగా వివరణలు ఇస్తుంటే, వాటికి ప్రతిగా ఆమె రకరకాల కారణాలు వివరిస్తారు. దీంతో తాను ఇతరులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదనే ధోరణి అందులో కన్పిస్తుంది. ఈ కారణంగా ఆమెను అభిమానించే వారి సంఖ్య కన్నా, ఇష్టపడని వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఆమె జీవనశైలి చాలా సరళంగా ఉంటుంది. అలంకరణలో కన్పించే ఆడంబరం ఆమె జీవనశైలిలో కన్పించదు. తనకు తెలియకుండానే తనలో ఉండే, కొత్తొక వింత, పాత ఒక రోత అనే లక్షణం ఆమె స్నేహి తులు ఆమెను అపార్థం చేసుకునేలా ఉంటుంది.

భావోద్వేగాల పరంగా ఆమె త్వరగా స్పందిస్తారు. ఇలాంటి వారు ఎక్కువగా ఇతరుల సమస్యలకు పరిష్కారం చెప్పడం లేదా ఆ సమస్యలో తలదూర్చడం చేస్తే స్వీయనియంత్రణ కోల్పోతారు. ఆ ప్రక్రియలో ఎదుటి వారిని శాసిస్తారు. సలహా ఇచ్చి, పాటించడంలో స్వేచ్ఛ అవతలివారికే ఇవ్వాలి. అలాంటప్పుడే అనుచరుల మద్దతు పెంచుకోగలుగుతారు.
ఆత్మన్యూనత ఎక్కువ
సునీతా లకా్ష్మరెడ్డి, జననం: 5 ఏప్రిల్‌ 1968
మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. నక్షత్రాధిపతి రాహువు.
sunitha
ఆశయాలు అధికం. జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకునే తపన ఎక్కువ. అందుకు తగ్గ ప్రయత్నం కూడా చేస్తుంటారు. కఠోర పరిశ్రమ, తెలివితేటలతో మాత్రమే ఆ స్థాయిని చేరుకోవాలని అనుకుంటారు. అలా గాకుండా ఎదుటివారి దయాదాక్షిణ్యాలతో ఆ స్థాయిని చేరుకోవాలని మాత్రం ఆకాంక్షించరు. అలాంటి పరిస్థితి వస్తే అంతర్ముఖం. పోటీతత్వం అధికం. ఒక పని కానప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అత్యధిక స్థాయిలో అన్వేషిస్తారు. అనుకున్నది సాధించడంలో ఆమెకు ఉన్న తాపత్రయం, అందుకు చేసే ప్రయత్నాలు అవతలి వారి దృష్టిని ఆకర్షిస్తాయి. స్వీయ గుర్తింపు అనేది క్రమంగా వ్యసనంగా మారుతుంది. ఇది బుద్ధిబలంపై ప్రభావం కనబర్చే అవకాశం ఉంది. కనిపించని పక్షపాతం ఉంటుంది. వైఫలాల్యను అంగీకరించరు. ఆ పని చేయడాన్నే వదిలేస్తారు. ఆత్మన్యూనత, భయం ఉంటాయి. క్లిష్టపరిస్థితుల్లో మిగతా వారి నుంచి భావోద్వేగ మద్దతు లేకుండా సమన్వయం చేసుకోలేరు.

తనను తాను మోటివేట్‌ చేసుకోవాల్సి వస్తే పరిస్థితులకు అనుగుణంగా అని గాకుండా తన అవసరాలను బట్టి చేసుకుంటారు. మొదట్లో కన్పించిన వ్యక్తిత్వం కాలానుగుణంగా సన్నగిల్లుతుంది. కారణం, తనకు పనికొచ్చేలా వనరులను వెదుక్కోవడం, ఆధిపత్యాన్ని కోరు కోవడం. ఎదుటివారి కోణంలో ఆలోచించి పరిష్కరించగల నైపుణ్యం ఉన్నప్పటికీ, వారు తన మాట వినకుంటే మాత్రం అసహనం. పరిస్థితులు, మనుష్యూలు...లాంటివాటిని ఏకపక్షంగా పరిశీలించడంతో వయస్సుకు మించిన అనుభవాన్ని పొందినట్లు అవుతుంది. ఆ అనుభవం ఉన్నప్పటికీ, వ్యవస్థను మేనేజ్‌ చేయలేక, అంత ర్ముఖం అవుతూ ఆధ్యాత్మిక ధోరణిలో పడిపోతారు. 2011లో వీరి మాటకు, ఆలోచనలకు, సామాజిక, రాజకీయ బాధ్యతలకు మంచి గుర్తింపు వస్తుంది. ఆమె అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది.
ఆచరణలో ఆవేశం పూజ్యం
పనబాక లక్ష్మీ, జననం: 6 అక్టోబర్‌ 1958
మిథున రాశి
Panabaka-Lakshmi
బాధ్యతలు స్వీకరించడంలోనూ అపార నిజాయితి. ఒక అంశాన్ని భిన్న కోణాల్లో పరిశీలించడం, దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, ఆ పనిపై మానసిక శక్తిసామర్థ్యాలు కేంద్రీకరించడం ప్రధాన బలాలు. చక్కటి సలహాదారు. ఎదుటి వారు శత్రువా, మిత్రువా అని చూడకుండా సందర్భానికి తగ్గ సలహాలు ఇవ్వగలరు. వారు ఆ సలహాను ఆచరించకపోయినా పట్టించుకోరు. మూడీగా ఉండడం, చొరవ తక్కువ, తీసుకునే నిర్ణయాల్లో ఇతరుల అభిప్రాయాల సేకరణ బలహీనతలుగా చెప్పవచ్చు. ఒక పనిని పూర్తి చేయడంపై మాటల్లో, భావోద్వేగాల్లో ఉన్న ఆవేశం ఆచరణలో అంతగా కన్పించకపోవచ్చు. ఇతరుల సహాయం లభించక పోవడం అందుకు కారణాలుగా చెబుతారు. హైపర్‌ సెన్సిటివ్‌. నలుగురిలో కలివిడి తక్కువే. అందరిలో తేలిగ్గా కలసిపోలేరు. దీనివల్ల ఎదుటివారిని మేనేజ్‌ చేస్తున్నట్లుగా ఉంటారే తప్ప వారితో కలసిపోయినట్లుగా ఉండరు. ఒక వ్యవస్థలో ఉంటూ కూడా ప్రేక్షకపాత్ర వహిస్తారు. ఆత్మవిశ్వాసం తక్కువ. భావోద్వేగపరంగా డిస్టర్బ్‌ అవుతామేమోనన్న భయం, ఇతరులు మోసగిస్తారే మోనన్న ఆందోళన ఉంటాయి.

ఇలాంటివి ఇప్పటికే జరిగిఉంటే, ఇతరులను చుల కన చేసే అవకాశం ఉంది. ఇది ఆశయసాధనలో ఆమెను ఓ పెద్ద సముద్రంలోకి తీసుకెళ్ళకుండా ఓ చిన్న బావికి మాత్రమే పరిమితం చేస్తుంది. ఊహించిన అవకాశాలు వచ్చినప్పుడు, ఆ హోదాలో చేరకముందే, అందుకు తగ్గ బలాలను ఇతరుల నుంచి ఆశిస్తుంటారు. అందుకు గాను ఎప్పుడూ ఇతరులను వదులుకోలేరు. తమను తాము నమ్ముకోలేరు. దీనివల్ల వీరిలో పాలనానైపుణ్యాలు తగ్గిపోతాయి. క్లిష్టపరిస్థితుల్లో చొరవ తీసుకునే లక్షణాలు తగ్గుతాయి. ఇతరులకు మద్దతుగా నిలవడం తప్ప మరేమీ చేయలేదు. సొంత వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే రాజకీయాల్లో రాణించగలరు. 2011 వీరికి శ్రమ అధికం. అధిష్ఠానం నుంచి అవకాశాలు వస్తాయి. గతంలో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోగలుగుతారు. ఆర్థికంగా కూడా కలసివస్తుంది.
ప్రతికూలతలో లౌక్యం
పురంధేశ్వరి, జననం : 22 ఏప్రిల్‌, 1959
కన్యారాశి
D_Purandareswari
చిత్త నక్షత్రం. నక్షత్రాధిపతి కుజుడు. చేసే పనిపట్ల మక్కువ కలిగిఉంటారు. స్వాప్నికురాలు. కలలను నిజం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. చేసేపనిలో ముందుచూపు ఉంటుంది. దీంతో ప్రతి విషయాన్ని ముందుగానే ఊహించి దాన్ని నమ్ము తారు తప్ప కళ్ళముందు కన్పించే దాన్ని విశ్వసించరు. జ్యోతిష్కూలకు, మానసిక నిపుణు లకు ఉండే లక్షణం ఇది. ఏం జరుగబోతుందో అన్న విషయమై ముందుగానే సమాచారం సేకరించగలుగుతారు. ఊహించ గలుగుతారు. ఏదైనా విషయంలో మొదట్లో ఆమెను విశ్వసించని వారు సైతం ఆమె చెప్పేవి నిజాలు కావడంతో ఆమెను అనుసరిస్తారు. అనుకున్న దాన్ని సాధించుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ క్రమంలో వీరు తాము అనుకున్నది సాధించుకోవడంలో, అది ఎవరి వల్ల అవుతుందో కచ్చితంగా గుర్తించగలరు. తన ఆలోచనలకు అనుగుణంగా ఎవరిని ఉపయోగించుకోవచ్చో గుర్తిస్తారు. సహాయం చేసిన వారి పట్ల విధేయత, అంకితభావం ప్రదర్శిస్తారు. ఓ పని తలపెట్టినప్పు డు అవతలి వారితో వేగంగా భావోద్వేగాలు పంచుకోవడం, వారి దృష్టికోణంతో ఆలోచించడం చేస్తూ, వీటన్నింటినీ సమన్వయం చేసుకోలేక కొంత అయోమయానికి గురికావడం చోటు చేసు కుంటుంది. వ్యక్తులు తనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మౌనాన్ని ఆయుధంగా వాడుకుంటారు. ఆమె సహనాన్ని తీవ్రంగా పరీక్షిస్తే తప్ప బయట పడరు. అంతర్ముఖం. మనస్సులో మాట అంత తేలిగ్గా బయటపెట్టరు. ఒక విషయాన్ని రకరకాలుగా ఆలోచించి ఎటూ తేల్చుకోలేనటు వంటి సందిగ్ధంలో పడిపోతారు. కార ణం జాప్యాన్ని, వాయిదాను తట్టుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో దాని నుంచి దృష్టిని మళ్ళించుకుంటారు. సహనాన్ని బాగా పరీక్షిస్తే, తన అభిప్రాయాలను, భావాలను మార్చుకునేందుకు వెనుదీయరు. అలాంటప్పుడు గతాన్ని, అవతలి వారితో తనకు గల స్నేహసంబం ధాలను పట్టించుకోరు. 2011లో పార్టీలో ఇతర మహిళా నాయకులకు ఆమె ఆదర్శం కాగలుగుతారు. ఆమె కీలకపాత్ర వహిస్తారు. రాజకీయ పరిపక్వతను చాటుకుంటారు. బాధ్యతల పరంగా ఒత్తిళ్ళు పెరిగే అవకాశం ఉంది.
ఎస్‌వి నాగ్‌నాథ్‌
ఆస్ట్రో-సైకాలజిస్ట్‌

2011 నే ‘తల’ రాతలు

నేను మారానంటే నమ్మరే.. !
newsofap 

(వృషభరాశి20 ఏప్రిల్‌ 1950)గోచారరీత్యా వృషభరాశిలో జన్మించిన చంద్ర బాబునాయుడు గురువుయొక్క స్థానం మీన రాశి నుంచి కర్కాటక రాశిపై పంచమదృష్టి కలిగి ఉం డడం వల్ల చంద్రలగ్నాత్‌, ఈ జాతకుడికి ఈ సంవ త్సరం జనవరి నుంచి జులై వరకూ ఎంతో బాగుం టుంది. డైనమిజాన్ని వృద్ధి చేసుకుంటారు. ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తాయి. ఐడియలిస్ట్‌ పర్సనా లిటీ ఇంప్రూవ్‌ చేసుకునేందుకు ఈ సంవత్స రం మొదటి అర్థభాగం ఉపయోగ పడుతుంది.సున్నిత భావా లపై స్పందించడం, మీడియాకు ఎక్కువగా రావడం..., నలుగురిలో కలసి పోవడం, తప్పులు పసిగట్టడం,ఎదురుదాడికి దిగడం లాంటి లక్షణాలు పెంపొందించుకుంటారు. రెబల్‌ పర్సనాలిటీగా మారుతారు.

ఈ సంకేతం ద్వారా తన చుట్టుపక్కల వారికి, ఆంతరంగికులకు, ప్రజలకు మార్పు చూపిం చేందుకు, వారి నమ్మకాన్ని గెలుచుకునేందుకు సర్వప్రయత్నాలు చేస్తారు. అందులో చాలావరకు విజయం సాధిస్తారు. అదే సమయంలో, సామాజిక, రాకీయ, ఆర్థిక వ్యవస్థలలో మార్పు నకై పోరాటం చేస్తారు. ప్రజల ఆర్థిక స్థితిగతులపై బాగా దృష్టి పెడుతారు. ఆయన లాజికల్‌ వ్యూస్‌ను చాలావరకు అంతా ప్రశంసిస్తారు. అది ప్రభుత్వంపై ఒత్తిళ్ళను పెం చుతుంది. ఈ ప్రయత్నంలో చాలా మంది సానుభూతిని చంద్రబాబు పొందు తారు. ఈ ప్రవర్తన వల్ల ఆంతరంగికులు కూడా పునరాలోచనలో పడు తారు. ఆయనలోని నాయకత్వ లక్ష ణాలను కొత్తరకం గా చూసే స్థాయిలో చంద్రబాబు వారిని ప్రభావితం చేయగలుగుతారు. చంద్రబాబు టీమ్‌ వర్కర్‌ కాదని చాలా మంది భావిస్తుంటారు. అది తప్పని నిరూ పించేలా చంద్రబాబు టీమ్‌ వర్క్‌ ఉంటుంది.

gakhtaసంవత్సరాదిలో చేసిన ప్రయత్నాలన్నీ అప్పటి పరిస్థితులపై సగటు మనిషి దృష్టిని ఆకట్టుకోవ డంలో విజయం సాధించినప్పటికీ, సంవత్సరం రెండో అర్థభాగంలో మాత్రం అప్పుడు చోటు చేసు కునే సామాజిక, రాజకీయ పరిణామాలను బ్యాలెన్స్‌ చేయ డంలో ఒత్తిళ్ళకు లోనవుతారు. ఈ ఒత్తిళ్ళ నేపథ్యంలో తన ఒరిజినల్‌ నేచర్‌ (నేను, నాది, నేనే)కు వచ్చేస్తారు. దీన్నంతా బ్యాలెన్స్‌ చేయలేక తనకు తెలియ కుండానే తనపై, తన ధోరణిపై ఇతరుల్లో అయోమయాన్ని కలిగిస్తారు. తన ఇమేజ్‌కు తానే చేటు తెచ్చుకుం టారు. రెండో అర్థవార్షికం ఆయన పొలిటికల్‌ కెరీర్‌ను ఓ చౌరస్తాలో నిలబెడుతుంది.

babu-health 

ఈ మొత్తం ప్రక్రియలో ఆయన ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎదగనీయడంలేద నే భావన కలుగు తుంది. వ్యూహం అనేది లేకుండా దాడికి దిగడం చేస్తుంటారు. కొంత నిరాశకు గురికావడం, బలమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తీసు కున్న నిర్ణయా లు అచ్చిరాకపోవడం వంటివి ఉంటాయి. సక్సెస్‌ కంటే ఎక్కువగా ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధిస్తారు. తాను అనుకున్న వాటిని ఆచరణలో పెట్టే సమయంలో మాత్రం వ్యక్తిత్వపు లోపాలు ఆయనను తిరిగి పూర్వస్థాయికి తీసుకు వస్తాయి. ఇందుకు కారణం, చంద్రలగ్నాత్‌, పంచమ స్థానమైనటువంటి కన్యరాశిలో ఉన్న శని అని చెప్పవచ్చు. జాతకుడు మానసిక భావోద్వేగాల పరంగా కూడా పరిపక్వత సాధించాలి. లేనిపక్షంలో ఎదుటివారి తప్పులెంచుతూ, ఎదురు దాడి చేస్తూ విపక్షంలోనే కొనసాగాల్సి వస్తుంది.

మైండ్‌సెట్‌
ఈ రాశిలో పుట్టిన వారికి క్రిటికల్‌ మూమెంట్స్‌లో ప్రజల దృష్టిని ఆకట్టుకోవడం లో ఎంతగా సక్సెస్‌ అవుతారో, సాధారణ సమయాల్లో వారి దృష్టిని ఆకట్టు కోవడంలో మాత్రం అంతగా విజయం సాధించ లేకపోతారు. వీరికి రేషనాలిటీ ఉండదు. దృక్పథం తక్కువ. అంశాలను తమకు అనుకూలంగా మార్చుకునేం దుకు ప్రయత్నిస్తూ, చేసిన వాగ్దా నాలను, బాధ్యతలను మర్చిపోతుంటారు. తప్పు లు గుర్తించడం, ఎన్వి రాన్‌మెంట్‌ను రెచ్చగొట్టడం లాంటి వాటికి ఎంతగా చేస్తారో, వ్యవస్థలో తప్పులను గుర్తించి, పరిష్కార మార్గాలను సూచించ డంలో అంతగా శక్తి వెచ్చించరు.

ఎదుటి వారిని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. వ్యూహాల్లో, ఆలోచనలు విలువలు తక్కువగా ఉంటాయి.ఈ ప్రక్రియలో తీవ్రమైన దూషణ లకు అలవాటు పడుతారు. దీనికి పరిష్కారం అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకో వడం తగ్గించుకోవాలి. వ్యూహాలు, ఆలోచనలు, పథకాలు లాంటివాటిని నిశితం గా పరిశీలిస్తే, వాటిల్లో తిరిగి కపటమే కన్పిస్తుంటుంది. అదే సమయంలో, వీరు తమ అనుచరులను కూడా అదే విధంగా ప్రభావితం చేస్తారు. వారి నుంచి వచ్చే సలహా ల్లో తమకు నచ్చే వాటినే స్వీకరిస్తారు. నిర్మాణాత్మక విమర్శలనూ భరించ లేరు. ఈ ధోరణితోనే రెండో అర్థవార్షికంలో ప్రజలకు ‘బోరింగ్‌ పర్సనాలిటీ’గా మారే అవకాశం ఉంది.

గ్రహబలం
గోచారరీత్యా మారుతున్న గ్రహస్థితులు వృషభరాశిలో జన్మించిన చంద్రబాబు నాయుడికి క్లిష్టపరిస్థితులను కలిగిస్తాయి. చంద్రలగ్నాత్‌, జాతకరీత్యా నాయక త్వపు లక్షణాలను, పోటీ తత్వాన్ని పెంపొందించే కుజుడి స్థానం శత్రుస్థానాలతో సాంగత్యం చేస్తున్నది. అది నాయకుడిగా ఆయన ఎదుగుదలను అడ్డు కుంటుంది. ఆగస్టు నుంచి కుజుడు బలహీన పడడం ప్రతికూల వాతావరణానికి అవకాశం కల్పిస్తుంది. శుక్ర, బుధ స్థానాలు కూడా ప్రేక్షక పాత్ర వహించడానికి కారణాల వుతాయి. పబ్లిక్‌ అట్రాక్షన్‌, గ్లామర్‌ లాంటి వాటికి అధిపతి అయిన శుక్రుడు శత్రుసాంగత్యం చేయడం వల్ల జాతకుడు సుస్థిరత, టెంపర్‌మెంట్‌ కోల్పోతారు. బుద్ధి బలానికి అధిప తి అయినటువంటి బుధుడు కొంత అనుకూలంగా ఉండడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని, తాను అనుకున్న వ్యూహానికి కట్టుబడి ఉండగలగుతారు.

కొత్త బాటలో.. కొత్త గొంతుకతో...!
y-s-jagan-mohan 

(21 డిసెంబర్‌ 1972 మిథునరాశి)జగన్‌ ప్రాథమికంగా స్వేచ్ఛాప్రియుడు. సొంతంగా ప్రణాళికలు, వ్యూహాలు రూ పొం దించుకోవడంలో మాత్రం బలహీనం. చాలావరకు తక్షణ స్పందనలే అధికం. భావాల వ్యక్తీకరణలో ధైర్య,సాహసాలు అధికం. చాతుర్యం ఉండదు. వ్యూహాత్మకంగా వ్యవహరించలేరు. వైఫల్యా లను ఆధ్యాత్మికంగా స్వీకరిస్తారు. ఆచరణాత్మక ధోరణి ఉండదు. ఈ ధోరణి వ్యవస్థను ప్రశ్నించేలా చేస్తుం ది. అది ఇతరులను ఆలోచనల్లో పడేస్తుంది. అంకిత భావం ఉండే స్వభావం. అవతలి వారి నుంచి కూడా దాన్ని తాను ఆశిస్తున్నానన్న సంకేతం ఉంటుంది. నమ్మితే సొంత మనుషులుగా భావిస్తారు. మాటల తో చెప్పకుండానే అవతలి వారి నుంచి తాను ఏది ఆశిస్తున్నదీ సూచనప్రాయంగా వెల్లడిస్తారు. ఇతరులను అంత తేలిగ్గా నమ్మరు.

వారికి అంత స్వాతంత్య్రం ఇవ్వరు. ఇతరులతో వ్యవహారాల్లో ప్రయోజనాన్ని ఆకాక్షించే భావోద్వేగాలను కలిగిఉంటారు. నమ్మితే అది చివరి వరకూ ఉంటుంది. స్వతంత్ర భావాలు, వ్యూహాలు, తర్కం, వినూత్నం, చివరి వరకూ ఓటమిని అంగీకరించని తత్వం...ఇవన్నీ ఉన్నా కూడా సొంత నిర్ణయాలు తీసుకోరు. ఇతరుల సలహాలు ఆయన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది దీర్ఘకాలంలో ఆయనకు మేలు చేస్తుంది. ఏ పని చేసి నా అది అవతలి వారి దృష్టిని ఆకర్షించేందుకు అని గాకుండా కమిట్‌మెంట్‌తో చేస్తారు. ఇన్నర్‌ డిగ్నిటీ అనేది ప్రవర్తనలో కనబడదు గానీ ఆలోచనలతో ఇతరులను ప్రభావితం చేసేటప్పుడు అది బయటపడుతుంది. అది ఇతరుల్లో ఆయనపై భయభక్తులను పెంచుతుంది. జగన్‌లో చిన్నపిల్లాడి మనస్తత్వం కూడా ఉంటుంది. ఎప్పుడూ చీకటిని గాకుండా వెలుగును చూస్తుంటారు.

మంచిచెడుల అన్వేషణ చేస్తుం టారు. డూ వాట్‌ ఈజ్‌ రైట్‌ , డోంట్‌ థింక్‌ హూ ఈజ్‌ రైట్‌ అనేది ఆయన తత్వం. ఇదే అనుచరుల్లో ఉంటే హర్షిస్తారు. ఎప్పుడైనా మాట జారినా కూడా అనుచరులు దూరం గాకుండా ఈ లక్షణం కాపాడుతుం ది. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడం కన్నా కూడా ఎక్కువగా వినూత్నం, ప్రోగ్రెసివ్‌కు ఇష్టపడుతారు. ఇతరుల సూచనలను ఇష్టపడుతారు. సమస్య చిన్నదో, పెద్దదో అని చూడకుండా అకస్మాత్తుగా భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోతారు. అలాంటి సందర్భాల్లో అవతలివారితో డిస్‌కనెక్ట్‌ అయిపోతారు. ఆశయాలు, ఆకాంక్షలు అనంతం. వాటిపైనే ఫోకస్‌. ఇది ఇతరులకు అత్యాశ, అపరి మిత ఆసక్తి అన్పిస్తుంది. టైమ్‌ మేనేజ్‌మెంట్‌, పర్‌ఫెక్షనిజం ఈ రెండు కనబడని బలాలుగా ఉంటాయి. చేసే పనుల్లో ఈ లక్షణాలు కన్పిస్తుంటాయి. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఆయన ఫిలాసఫీ మైండ్‌ ఆయనను అనుభవంతో పాఠాలు నేర్చుకునేలా చేస్తుంది. తొందరగా మాస్‌ పీపుల్‌ను అట్రాక్ట్‌ చేస్తుంది ఈ లక్షణం.

మైండ్‌సెట్‌
సృజనాత్మక ఆలోచనలపై దృష్టి సారించడంలో అమిత ఉత్సాహం. చొరవ తీసుకోవడంలో అద్భుత శక్తి. అందివచ్చిన అవకాశాలను సొంతం చేసు కుం టారు. అనుభవంతో వచ్చే ఊహాశక్తి, సాహసోపేత స్వభావం ఆయన ప్రాథ మిక బలాలు. ప్రతికూల వాతావరణాన్ని ముందుగానే పసిగట్టగలరు. క్లిష్ట పరిస్థితుల్లో లొంగిపోరు. భయపడి పారిపోరు. ఆత్మవిశ్వాసంలో, కష్టాలను అధిగమించడంలో మేటి. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే ఆయనలోని శక్తులు వెలుగుచూస్తాయి. ఈ ధోరణి ఆయన చుట్టుపక్కల వాతావరణానికి, వ్యక్తులకు స్ఫూర్తిని ఇస్తుంది.

అట్టడుగు వర్గాల మేలుకోసం పని చేసేందుకు తొందరగా చొరవ తీసుకుంటారు. వ్యక్తుల గుణగణాలను విశ్లేషించడంలో మేటి. క్రాస్‌చెక్‌ చేయకుండా నిర్ణయం తీసుకోరు. కొన్ని కీలక అంశాల్లో నిర్ణయం తీసుకునేందుకు ఎక్కువ సమ యం తీసుకున్నా, తీసుకున్నంత మాత్రాన ఆ కాల వ్యవధి అనుత్పాదకతగా ఉండదు. ఆ విషయాన్ని ప రిశీలించేందుకే ఆ సమయం తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఆ టైమ్‌గ్యాప్‌ను కవర్‌ చేస్తారు. వైఫల్యాలను అంత తేలిగ్గా అంగీకరి ంచరు. మనస్సాక్షిని నమ్ముతారు.

ఇలాంటి వారికి బేసికల్‌గా చుట్టుపక్కల వ్యవస్థ నుంచి మంచి పేరు రాదు. నమ్మిన వారికి మాత్రం దేవుడే. ఆయన ధోర ణి క్రమశిక్షణారాహిత్యంగా కన్పిస్తుంది. సెల్ఫ్‌సెంటర్డ్‌గా,అవకాశవాదిగా, స్వేచ్ఛావాదిగా కన్పిస్తారు. విజ న్‌ లేదు, ఇంకా మానసికంగా ఎదగలేదు అని ఇతరులు బురద చల్లేందుకు ఈ ధోరణి అవకాశం కన్పిస్తుంది. ఆయనకు అటువంటి పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా ఉండడం అవసరం. ఎవరితోనూ సుదీర్ఘ సంభాషణలు మం చివి కావు. అందులోనుంచి భవిష్యత్‌ ప్రణాళిలు బయటపడవచ్చు. అమాయకత్వం, ముక్కుసూటి తత్వం ఎక్కువగా ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు.

భావోద్వేగాలు
ప్రతీ చిన్న విషయాన్ని మనస్సులో పెట్టుకుంటారు, అప్పటికప్పుడు వ్యక్తపర్చకపోయినా. ఎప్పుడో ఒకసారి అది బ్లాస్ట్‌ అవుతుంది. పరిణామాలను ముందుగానే ఊహించి, వాటికి పరిష్కారాలను అందించేందుకు ఇష్టపడుతారు. అవకాశాన్ని సొంతం చేసుకోవడం ఆయన బలమైనప్పటికీ, అది ఇతరులకు మరో కోణంలో కన్పిస్తుంది. ఆయన వ్యవహార శైలిలో పరిపక్వత, డిప్లమసీ లోపించినట్లుగా అన్పిస్తుంది. విమర్శలపై వివరణ ఇచ్చేందుకు ఇష్టపడరు. ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే సుదీర్ఘ వివరణలు ఇస్తారు. ఆ వివరణ, ధోరణి ఎదుటివారిని ఆశ్చర్యపరుస్తుంది.

ఒక నాయకుడికి ఉండే భావోద్వేగాల కన్నా కూడా బిజినెస్‌మ్యాన్‌కు ఉండే భావోద్వేగాలు అధికం. స్వేచ్ఛ ఇచ్చి క్రమశిక్షణను ఆశిస్తారు. అందులో అపారమైన అవకాశాలు ఇస్తా రు. లాభాన్ని, ఉపయోగాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందులో పరిపక్వతతో, ఆచరణాత్మకంగా ఉంటారు. తనపై పూర్తిగా ఆధార పడి ఉండే భావోద్వేగాలను ఇష్టపడరు. అవి తప్పనిసరి అయితే, వ్యూహాత్మకంగా, ఆదా వచ్చేలా ప్లాన్‌ చేస్తారు. తొందరగా అసహనానికి గురై అవతలి వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. భావోద్వేగాల్లో ప్రేమకు, క్రమశిక్షణకు పెద్దగా తేడా ఉండదు.

గ్రహబలం
జాతకరీత్యా మిథున రాశి...చంద్రలగ్నాత్‌ సప్తమ స్థానమైనటువంటి ధనుర్‌రాశి అధిపతి గురువు స్వక్షేత్రంలో ఆత్మకారకుడైనవంటి రవితో కలసి ఉండడం వల్ల, చంద్రగురువులు సమసప్తమంలో ఉండడం, గజకేసరి యోగం ప్రభా వం కలిగి ఉండడం వల్ల పేరుప్రఖ్యాతులు ఉంటాయి. ఈ ఏడాది ఆరంభదశలో వ్యవస్థను ప్రభావితం చేస్తూ కొత్త దిశగా నడిపించడంలో పునాది పడుతుంది. తన ఆలోచనలు, వ్యూహాలు జాతీయస్థాయిలో కూ డా సంచలనం కలిగించే రీతిలో గ్రహస్థితి అనుకూలిస్తుంది.

లగ్న చతుర్ధాధిపతి అయిన బుధుడు, పంచమవ్యయాధిపతి అయిన శుక్రుడితో వృశ్చిక రాశిలో ఉండడం వల్ల కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూ పొత్తులు పెట్టుకోవాల్సి వస్తుంది. నాయకత్వ లక్షణాలకు, పోటీ తత్వానికి అధిపతి అయిన కుజుడు తులారాశిలో ఉండడం వల్ల తీసుకునే నిర్ణయాలు, చేసే పనిలో ఎంతో మందిని ప్రభావితం చేయగలుగుతారు. అనుచరులు, సహచరులు అధికమవుతారు. కుజుడు పంచమస్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాలు మాటల వెనుక భావాలు వ్యవస్థను నిర్మాణాత్మకరీతిలో ప్రభావితం చేస్తాయి. చంద్రలగ్నాత్‌ అష్టమ భాగ్యాధిపతి అయిన శని వ్యయం (వృషభరాశి)లో, మిత్రస్థానంలో ఉండడం వల్ల మహిళల సానుభూతి అధికంగా ఉంటుంది. ప్రథమార్థంలో కన్నా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ, ద్వితీయార్థంలో జాతీయ స్థాయిలో గుర్తింపు బాగా ఉంటుంది.

రాజకీయ గ్లామర్‌ కావాలి !
Chiranjeevi 

(22 ఆగస్టు 1959 కన్యారాశి)చిరంజీవి ఇతర అంశాలు వేటితో నిమిత్తం లేకుండా గ్లామర్‌ పొందుతారు. పాలిటిక్స్‌ నుంచి కాకుండా సినిమాల ద్వారా ఈ గ్లామర్‌ సాధించగ లుగుతారు. అభిమానాన్ని సొమ్ము చేసుకొని లైమ్‌లైట్‌లోకి రావడానికి సకల ప్రయత్నాలు చేస్తా రు. సెప్టెంబర్‌ వరకు పొలిటికల్‌గా ఆయన ధోరణి అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నారా లేదా అనే అనుమానం కలిగించేదిలా ఉంటుంది. గత అనుభవాలను, జ్ఞాపకాలను గుర్తుకు చేసుకునే స్వభావం అధికం. ప్రతి చిన్న విషయానికి ఆత్మపరిశీలన అధికం. పార్టీలో, ఆంతరంగికుల్లో వచ్చే మార్పులకు తనను తాను బాధ్యుడిని చేసుకుంటూ వాటిని మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత లను విస్మరిస్తారు. ఎక్కువగా ఆత్మపరి శీలన చేసుకోవడం ఆయనలో బుద్ధిబలాన్ని సన్నగిల్లేలా చేస్తుంది.

ఇది చూసే వారికి ఆయన ద్వంద్వవైఖరి కలిగిఉన్నట్లు భావిం చేలా చేస్తుంది. ఈ దశలో కూడా సహ చరులు, అనుచరుల నుంచి ఆయన గౌరవాన్ని, అంకితభావాన్ని, సమగ్రతను, హోదా, ఆర్భాటం లాంటి వారిని కోరుకుం టారు. పార్టీ అధినేతను ఆకట్టుకునే ప్రయ త్నాల్లో అనుచరులు ఉంటారు. చిరం జీవి ధోరణి చివరకు అనుచరుల్లో అయోమయాన్ని సృష్టిస్తుంది. పార్టీపై, సహ చరులపై పట్టు కోల్పో తారు. అలా కావాలనే చేస్తున్నాడనే అభిప్రాయం కలుగు తుంది. ఒక పద్ధతి ప్రకారం తాను రాజకీ యాలకు దూరమవుతూ, అనుచరులు పార్టీకి దూరమ య్యేలా చేస్తున్నారన్న భావన ఇతరుల్లో కలుగుతుంది. ఫిలిం పర్సనాలిటీగా ఎంతగా దర్పం ప్రదర్శించారో, అలాంటి దర్పాన్ని ఇప్పుడు కూడా ప్రద ర్శిస్తునే ఉంటారు. క్రమంగా టీమ్‌లో ఎవరికి వారు బాస్‌గా వ్యవహరిస్తుంటారు.

మైండ్‌ సెట్‌
మన:కారకుడు అయిన చంద్రుడు కన్యారాశిలో ఉండడం జాతకుడి భావోద్వేగా లను ప్రభావితం చేస్తుంది. దేన్నయినా చూసి మనస్సు మార్చుకోవడమనేది ఉండ దు. కన్పించని ఆవేశాన్ని, క్రోధాన్ని అణచుకుంటూ ప్రతికూలమైనటు వంటి పరి స్థితులు, వ్యక్తుల యొక్క రాజకీయ అనుభవాలను, వారి సూచనలను స్వీకరించ లేకపోవడం,..ఆత్మరక్షణలో భాగంగా ఎదుటి వారిలో తప్పులెన్నడం లేదా వారిని విస్మరించడం చేస్తారు. పరిస్థితులకు అనుగుణంగా తనను తీర్చిదిద్దుకోవడంలో అశక్తత. దీంతో నిరాశానిస్పృహలకు గురవుతారు.

చిక్కుముళ్ళను ఎదుర్కోలేకపోతారు. యుక్తవయస్సులో ఏర్పడినప్పటి ముద్రలన్నీ కూడా ఆయన నిర్ణయాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. వాటిని బట్టి ఎదుటి వారిని మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. వాటిని సృష్టించుకునే ప్రయత్నాలు చేయలేకపోతారు. చేసినా అవి అతి స్వల్పకాలమే. ఈ ప్రయత్నంలో అవకాశాలు జాప్యం కావడం, నిరాశా నిస్పృహలు ఏర్పడుతాయి. అవన్నీ సహ చరులపై ప్రభావం కనబరుస్తాయి.

చిరాకు, విసుగు లాంటి వాటిని బయటకు ప్రదర్శించకపోయినా, మౌనంగా, మొండిగా ఉండడంవల్ల మరిన్ని అపార్థాలు వచ్చేలా చేసుకుంటారు. ఆ సమయంలో సహచరుల నుంచి బుజ్జగింపును కోరుకుంటారు. ఈ విషయంలో చిన్న పిల్లాడి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు. ఈ సంవత్సరమంతా జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఓప్రేక్షకుడిలా, పరిశీలకుడిలా, తనకు పరిస్థితి అర్థమవుతున్నట్లుగా ఉంటారు గానీ తీసుకోవాల్సిన చర్యలను విస్మరిస్తున్నట్లుగా ఉంటారు. ప్రణాళిక బద్ద నిర్ణయాలు ఉండవు. సందర్భానికి తగినట్లు అనిగాకుండా, అప్పటికప్పుడు భావోద్వేగాల పరంగా స్పందించి నిర్ణయం తీసుకుంటారు. తాను లైమ్‌లైట్‌లోకి రావాలనుకుంటే తిరిగి సినిమాలను ఆశ్రయించకతప్పదని భావిస్తుంటారు.

భావోద్వేగాలు
మను:కారకుడైన చంద్రుడి ప్రభావం భావోద్వేగాల పరంగా ఉంటుంది. ఆచరణలో ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తుంటారు. బయటకు కన్పించే భావోద్వేగాలకు అతీతంతగా తన మనస్తత్వాన్ని గోప్యంగా ఉంచుకుం టారు. ఆబ్సెంట్‌ మైండ్‌నెస్‌ ఉంటుంది. ఆయా పరిస్థితుల్లో వెంటనే స్పందించే లక్షణం కన్పించదు. తను మాట్లాడే మాటలు కొన్ని సందర్భాల్లో పరిపక్వత లేనివిగా లేదా అందరి దృష్టిని ఆకట్టుకోవాలనే తపనతో కూడుకున్నవిగా ఉంటాయి.

అసందర్భంగా తన భావోద్వేగాలు బయటపెట్టి నవ్వులపాలయ్యే అవకాశం ఉం టుంది. సినిమా పరంగా తను ఊహిస్తున్న గ్లామర్‌ను పొందడంలో విజయం సాధిస్తారు. సినిమా రంగం ఆత్మసంతృప్తి కలిగించేలా ఉంటుంది. ఈ సంవత్సరంలో అనేక మార్లు చుట్టుపక్కల వారి బలాబలాలతో ప్రయోజనం పొందే స్థాయిలో ఉంటారు. అలా ప్రయోజనాలను అందించిన వారిని గుర్తించడంలో, ప్రశంసించడంలో మాత్రం ద్వంద్వ ప్రమాణాలతో, డిప్లమసీగా ఉంటారు. మద్దతు దారులను కూడా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యవహారధోరణిలో తన స్థాయి, హోదా లాంటి వాటిని చూస్తుంటారు. ఆ ధోరణిలో మార్పు ఉండదు. అవసరాలు తీర్చుకోవడంలో చలాకీతనం ప్రదర్శిస్తారు. ఏరు దాటిన తరువాత తెప్ప తగలేయడమని గాకుండా, తెప్పను కూడా వెంట తీసుకెళ్ళేరకం.

నమ్మకాలు రాజకీయపరంగా దెబ్బతినడం వంటి లక్షణాలు (ప్రజలు ఇచ్చిన షాక్‌) ఆయన రాజకీయ జీవితంలో కొట్టొచ్చినట్లుగా కన్పిస్తాయి. గ్రహబలం: చిరంజీవి తులాలగ్నంలో, కన్యరాశి చిత్తా నక్షత్రంలో జన్మించారు. గోచారరీత్యా జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు తాను ఎంచుకున్న రంగంలో (సినిమా)లో నిర్విఘ్నంగా ప్రయత్నాలు సాగుతాయి. సామాజికం, ఆగ్రహంలతో కూడిన సినిమా కాగలదు. సామాజిక సందేశాన్ని ఇచ్చే ఈ సినిమాకు ఈ సంవత్సరం ఆదిలోనే బీజం పడుతుంది. షూటింగ్‌ కూడా సజావుగా సాగుతుంది. అది సినిమారంగ పరంగా ఆయనకు సంతృప్తినిస్తుంది.

రాజకీయపరంగా సందిగ్దపరిస్థితుల ను ఎదుర్కొంటారు. ఎన్నికల ఫలితాలను జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. జీర్ణసంబంధ, గ్యాస్ట్రిక్‌ సమస్యలు రావచ్చు. జూన్‌ తరువాత ఆరోగ్యసమస్యలు తలెత్తవచ్చు. ఈ సంవత్సరం ఆయనకు ఆత్మపరిశీలనకు సమయం ఎక్కువగా కేటాయిస్తారు. తనను తాను ఎంతో ఉన్నత స్థాయిలో భావించుకున్నప్పటికీ, ఆ ఇమేజ్‌ చట్రం నుంచి బయటకు వచ్చి సగటు మానవుడితో కలిసే ప్రయత్నం చే యడం మంచిది. ప్రాథమికంగా ఆయన అల్పసంతోషి. చిన్నచిన్న వాటికి ఉబ్బిపోయే మనస్తత్వం. నైతికత, సేవాభావంతో కూడిన కార్యక్రమాలు చేపడితే మనశ్శాంతిగా ఉండడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.

నిరంతర బాటసారి !
KCR-Arrest 

(17 ఫిబ్రవరి 1954 కర్కాటక)కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. గోచారరీత్యా చంద్రలగ్నాత్‌ (కర్కాటకం) గురు దృష్టి కర్కాటకలగ్నంపై ఉండడం మూలంగా ఈ సంవత్సరం ఆయన మేథోసంపత్తి ఆయనకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఇంటెలిజెన్స్‌, రిటెన్‌టివ్‌ పవర్‌ (నిలదొక్కుకునే శక్తి), పర్‌సిస్టెన్స్‌ పేషెన్స్‌ (సహనం) బాగా ఉంటాయి. ఈ రాశివారి ప్రాథమిక లక్షణాలు అవి. కావాల్సిన పనులు చేసి లేదా మాటలతోనో వీరిని ఎవరూ బుట్టలో వేసుకోలేరు. ఎదుటి వారి క్యారెక్టర్‌ను విశ్లేషించడంలో, అంచనా వేయడంలో పరిపక్వత కలిగిన సైకాలజిస్ట్‌లుగా వీరిని చెప్పవచ్చు. ఇతరుల క్యారెక్టర్‌ను, వారి ఉద్దేశాలు, లక్ష్యాలను ఏకకాలంలో అర్థం చేసుకోగలుగుతారు. మను: కారకుడైన చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి అవడం దీనికి కారణం. ఇతరులను బాగా పరిశీలించగలుగుతారు. ఆ స్థాయి సహనం ఉంటుంది. ఇతరులు ఏం చేస్తుంటారో పరిశీలిస్తారు. వారి చర్యలను చూస్తారు.

ఆ తరువాతే తాను రియాక్ట్‌ అవుతారు. ఆయన ఇంటెలిజెంట్‌ అయినప్పటికీ, గ్రాహక శక్తి మాత్రం తక్కువే. ఫ్రెష్‌ ఐడియాస్‌ గ్రహించడంలో స్లో అయినప్పటికీ కూడా గ్రహించిన దాన్ని నిలబెట్టుకునే శక్తి అధికం. ఫలితంగా విశాల దృక్పథం అలవడుతుంది. ఎప్పుడూ నిత్యనూతనంగా, వినూత్న ఆలోచనలను కలగి ఉంటారు. ఈ లక్షణాలు ఉండడం మూలంగా పర్‌ఫెక్షనిజాన్ని కలిగిఉంటా రు. మూర్ఖపు విశ్వాసాలు ఉంటాయి. తిరుగుబాటు మనస్తత్వం.

kcr-spee 

ఎదుటి వారిని తన కంట్రోల్‌ తెచ్చుకునేందుకు మాత్రమే దీన్ని వాడుతారు. పెట్రోల్‌ పోయడమే వచ్చు తప్ప ఆర్పడం రాదు. అదే సమయంలో మంటలు రేగుతుంటే బాధపడే సు న్నిత మనస్తత్వం. పరిస్థితి విషమిస్తే అక్కడి నుంచి జారకుంటారు. నచ్చితే అందలం. నచ్చకుంటే పాతాళం.బలమైన మనస్థితులు కలిగిన వ్యక్తిత్వం.అలాంటి మూడ్స్‌ అన్నీ కూడా అంతశ్చేతన స్థితిలో ఉంటాయి. పని చేసే విధానంలో అసూ య ఉంటుంది. కంపేర్‌ చేసుకొని వారి కంటే అధికం అయ్యే ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మంచి గుర్తింపు సాధించగలుగుతాడు. సాధారణ పరిస్థితుల్లో కాకపోయినా, చుట్టుపక్కల వారి సలహాలను ఆపత్కాలంలో పూర్తిస్థాయిలో పాటిస్తారు.

మైండ్‌సెట్‌
ఈ సంవత్సరం నుంచి అంతర్‌బుద్ధి (ఇంట్యూషన్‌), మేధస్సు (ఇంటెలిజెన్స్‌) ఏకకాలంలో పని చేస్తాయి. అంతరాత్మ సూచనలను నమ్మితే అంతర్‌బుద్ధి పని చేస్తుం ది. ప్రస్తుత సంఘటనలను తార్కికంగా, హేతుబద్దంగా విశ్లేషించుకుంటూ పని చేస్తారు. బాటిల్‌ మూత ఓపెన్‌ చేయడంలో సక్సెక్‌ అయినప్పటికీ, అందులోని అం శాన్ని వివరించంలో విజయం పాళ్ళు తక్కువే. గతజ్ఞాపకాలను స్ఫురణకు తెచ్చు కోవడం అధికం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆ రెండింటినీ అనుసంధానం చేసుకుంటూ ప్రవర్తిస్తారు. ఈ క్రమంలో మొదటి ఆరు నెలలు ఆడింది ఆట, పాడింది పాట. జులై వరకు ఈ పరిస్థితి ఉంటుంది.

అక్కడి నుంచి సెప్టెంబర్‌ వరకు ఆయనను వేరే వారు ఉపయోగించుకుంటారు. అపార్థాలకు గురయ్యే స్థాయికి పరిస్థితులు దిగజారుతాయి. ఈ ప్రక్రియలో న్యాయం, సమానత్వం బ్యాలెన్స్‌ చేస్తూ చేసే యుద్ధంలో తనను బాగా విశ్వసించే వారి సానుభూతిని మాత్రమే పొందగలుగుతారు. కృతజ్ఞతాభావం ఉన్నవారు, నమ్మిన వారు మాత్రమే ఆయన పక్కన ఉం టారు. వ్యూహం, చొరవ, వ్యక్తిత్వం, సమగ్రత ఉన్న వారు ఆయనకు దూరం అవుతారు. అప్పటి వరకూ ఉన్న స్పష్టత ఆయనలో పటాపంచలు అవుతుంది. అయోమయ దశకు వెళ్ళిపోతారు. ఆ సమయంలో భావోద్వేగాలు, సెంటిమెంట్‌లపై ఆధారపడుతారు. అప్పుడు తనను తిరిగి నిలబెట్టగల వ్యక్తుల, పరిస్థితుల కోసం, స్పష్టత కోసం పరితపిస్తారు. మూడ్‌స్వింగ్స్‌ ఉంటాయి. తీసుకునే నిర్ణయా ల్లో అనుభవం ద్వారా పొందిన పాఠాలపై ఆధారపడుతారు. గతంలో ఉన్న చొరవ, పట్టుదల ఉండకపోవచ్చు. పరిస్థితులు చేజారిపోయే అవకాశం ఉంటుం ది. దీర్ఘకాలంగా దాచిన గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఆయన పరిస్థితిని సంక్లిష్టం చేస్తాయి.

భావోద్వేగాలు
కేసీఆర్‌ ప్రాథమికంగా సంప్రదాయవాది. ఎదుటి వారిని ప్రభావితం చేసి పని చేయించడంలో ఎంత కష్టపడుతారో అంతకంటే ఎంతో త్వరగా డిటాచ్‌ (అనుబంధం తెంచుకోవడం) కాగలుగుతారు. ప్రేక్షకపాత్ర పోషించే అవకాశం ఉంది. సెకండ్‌ హాఫ్‌లో ఈ వ్యక్తిత్వాన్ని చూడవచ్చు. సూక్ష్మదృష్టి, దీర్ఘకాలిక ప్రణాళిక బలహీనంగా ఉండడం, పరస్పరం సంఘర్షించే భావోద్వేగాలు, కెయాటిక్‌ ఎమోషన్స్‌ ఉంటాయి.
వ్యక్తులతో, సంస్థలతో సంబంధాలు, అనుబం ధాలు దెబ్బతింటాయి. పరిస్థితులు తన నియం త్రణ తప్పుతాయి. పరిస్థితుల్లో అనుకోని మార్పులకు ఆజ్యం పోస్తారు. తనకు వ్యూహాలకు అనుగుణమైన నిర్ణయాలు, సంకేతాలు చాలామందిని ఆశ్చర్యపరుస్తాయి. భావోద్వేగాలపరంగా కలగూరగంపలా మారిపోతా రు. జులై - అక్టోబర్‌ మధ్య కాలంలో అసంకల్పితంగా ఆయన తీసుకునే నిర్ణయాలు సామాజిక అస్థిరతను కలిగిస్తాయి.
గ్రహబలం
గోచారరీత్యా చంద్రలగ్నాత్‌, అష్టమాధిపతి అయినటు వంటి శని కన్యారాశిలో దృష్టి వ్యయస్థానాన్ని చూడడం (మిథునరాశి) వల్ల తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలుంటాయి. శారీరక శక్తి సామర్థ్యాలు సన్నగిల్లుతాయి. పరిస్థితులను, వ్యక్తులను శాసించాలనుకునే ప్రక్రియలో వాటికి అనుగుణంగా మారుతూ అక్కడ ఇమడలేరు. చాలా వరకు వ్యూహాలను తగ్గించుకుంటారు. ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించరు. వెనుక ఉండి నడిపించరు. భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురువు స్వక్షేత్రంలో (మీనరాశి) ఉండడం, ప్రథమార్థంలో కొంతవరకు అనుకూల వాతావరణాన్ని సృష్టించడానికి తోడ్పడుతుంది.తన ప్రణాళికలకు అనుగుణంగా నడిపించేందుకు సమయం, సందర్భం కలసి వచ్చినప్పటికి కూడా శని దృష్టి ప్రభావం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కుటుంబసభ్యులపైన లేదా పిల్లలకు సంబంధించిన అంశాలపై ఇతరుల నుంచి ప్రతికూలతను ఎదుర్కోవాల్సి వస్తుంది. మారుతున్న గ్రహస్థితికి అనుగుణంగా అనుకున్నది సాధించడంలో వ్యక్తిగా రెండో అర్థవార్షికం మేలు చేయదు. పార్టీలోనే ప్రత్యామ్నాయ నాయకులు వస్తారు. సమష్టి దృష్టి పోయి వ్యక్తిగత ధోరణి పార్టీలో పెరుగుతుంది.

Nagnathఇదంతా కూడా శని ప్రభావం అని చెప్పవచ్చు. ఆయన ద్వారా కదలాల్సిన పాచికలను ఆయన ఉద్దేశపూర్వకంగా ఆపినప్పుడు, ఆ ప్రభావం చుట్టుపక్కల వారిని చైతన్యపరుస్తుంది. దిశానిర్దేశం లేకపోవడం, అనుకూల పరిస్థితుల్లో అతి విశ్వాసం చోటు చేసుకుంటాయి. ప్రతికూల పరిస్థితుల్లో, తనకు తాను మౌల్డ్‌ చేసుకోవడంలో జాప్యం లేదా అందుకు అనుగుణంగా మారలేకపోవడం ఇలాంటి లక్షణాలతో అయోమయ స్థితిలో పడుతారు. లైమ్‌లైట్‌లో మాత్రం ఉంటారు. అనుకున్నది సాధించడంలో కన్నా సాధించే ప్రక్రియలో గుర్తింపు పొందడంలో మాత్రం సక్సెస్‌ కాగలుగుతారు.(ఈ విశ్లేషణ అంతా కూడా ప్రచారంలో ఉన్న పుట్టిన తేదీ ఆధారంగా, ఆయా జాతకుల 27.12.2010 నాటి గ్రహస్థితి ఆధారంగా)
- ఎస్‌వి నాగ్‌నాథ్‌
ఆస్ట్రో-సైకాలజిస్ట్‌