Wednesday, December 15, 2010

రైతుల ఓట్లు దున్నేదెవరు ?

Farmer
రాష్ట్ర రాజకీయాలు రైతుజపంతో మార్మోగుతోంది. ముఖ్యంగా.. కాంగ్రెస్‌ - తెలుగుదేశం - జగన్‌ పార్టీలు మధ్యంతర ఎన్నికల వ్యూహంతో రైతులపై ఇప్పటినుంచే ఓట్ల గాలం వేస్తున్నాయి. రాష్ట్ర - దేశ రాజకీయాల్లో రాజకీయ అస్థిర పరిస్థితి నెలకొన్నందున, మధ్యంతరం ఎప్పుడయినా తధ్యమన్న ముందుచూపుతో ఈ మూడు పార్టీలూ హటాత్తుగా రైతుల ఓట్లు దున్నేందుకు సరికొత్త వ్యూహాలకు తెరలేపాయి. తమ విజయసోపానికి నిచ్చెన వంటి రైతుల ఓట్లను సాధించేందుకు రకరకాల ఎత్తుగడ లకు శ్రీకారం చుట్టాయి. తామే రైతుల ఆత్మబంధువులమనే ముద్ర వేయించుకునేందుకు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి.

ఈ క్రమంలో.. ఇటీవల రాష్ట్రంలో వచ్చిన తుపాన్లకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, తక్షణం రుణాలు మాఫీ చేయాలని, కౌలు రైతులను ఆదుకోవాలన్న అంశంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, సొంత పార్టీ స్థాపనకు ఉరకలు వేస్తున్న వైఎస్‌ జగన్‌ సర్కారుకు డెడ్‌లైన్లు విధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు మాత్రం రైతులకు తమ పార్టీనే మేలు చేస్తుందని ఎదురుదాడి చేస్తున్నారు.

ఈనెల 16లోగా రైతు సమస్యలు పరిష్కరించి, రుణాలు మాఫీ చేయకపోతే 17 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చంద్రబాబునాయుడు సర్కారును హెచ్చరించారు. జల్‌, లైలాతో పాటు గత 15 నెలల నుంచి రాష్ట్రంలో తలెత్తుతున్న ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతున్న రైతాంగాన్ని పరామర్శించేందుకు బాబు.. ప్రభుత్వాధినేతల కంటే ముందే జిల్లాలకు వెళ్లి, వారికి దన్నుగా నిలుస్తున్నారు. ఇది రైతాంగంలో ఆయనపై ;ఆనుకూల వైఖరి పెరగడానికి కారణ మయింది. ఇటీవల నల్లగొండ, గుంటూరు, కృష్ణా, ప్రకా శం, అంతకంటే ముందు తూర్పు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతు బాట నిర్వహించి సర్కారు వైఫల్యాలపై విరుచుకుపడ్డారు.

గత రెండురోజుల నుంచి శాసనసభలో రైతు సమస్యలపై చర్చించాలని పట్టుపట్టి, అందులో భాగంగా, అరెస్టయి పోలీసుస్టేషన్‌ లోనే నిద్రించిన బాబు, తాజాగా మంగళవారం నాటి సభలో కూడా సర్కారుతో రైతు సమస్యలపై యుద్ధానికి దిగారు. సీఎంపై కన్నెర్ర చేశారు. పోలీసుస్టేషన్‌ నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర నిర్వహించారు. నేతల పోరా టానికి మద్దతుగా పార్టీ కార్యకర్తలు కూడా అసెంబ్లీ వద్ద హంగామా సృష్టించారు. సభ లోపల రైతు సమస్యల పరి ష్కారం కోసం విరుచుకుపడిన టీడీపీ సభ్యులుబాబు సహా సస్పెండ్‌కు గురయ్యారు. రాత్రంతా సభ ఆవరణలోనే బైఠాయించారు. సభలో హంగామా సృష్టించారు.
ఇక కొత్తగా రైతుల సమస్యల కోసం గళం విప్పిన జగన్‌.. ఈనెల 20 లోగా రుణాలు మాఫీ చేయకపోతే విజయవాడలో లక్షమందితో కలసి 21,22వ తేదీల్లో నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు.

రైతులు మానసిక వేదనకు గురవుతున్నారని, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. ఆ సందర్భంగా వైఎస్‌ చేసిన ‘మేళ్లను’ ఏకరవు పెట్టారు. ఆయన ఇటీవల గుంటూరు, కృష్ణాజిల్లాలలో పర్యటించి రైతులను పరామర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఇటీవల తుపాను సందర్భంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించి, రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ అంశంలో ప్రతిపక్షాలు ఎట్టి పరిస్థితిలో లబ్థిపొందకుండా కిరణ్‌ తన యంత్రాంగాన్ని విపక్షంపై విమర్శలు కురిపించేలా సన్నాహాలు చేస్తున్నారు.

రైతుబాటలో ఏ పార్టీ వ్యూహమేమిటి ?
కాంగ్రెస్‌ పార్టీ
  • బాబు, జగన్‌కు పొలిటికల్‌ మైలేజీ ఇస్తే ప్రమాదకరం.
  • ప్రధానంగా గత 15 నెలల నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్న బాబుపై రైతాంగం సానుకూలంగా వ్యవహరించడంతో అప్రమత్తం కావడం అనివార్యంగా మారింది.
  • కొత్తగా తెరపైకొచ్చిన జగన్‌ కూడా రైతుల ఓట్ల కోసం వల వేయడంతో మరింత ఆందోళన.
  • టీడీపీ దూకుడుకు అడ్డువేసేందుకు బాబుపై సభలోనే రఘువీరారెడ్డితో సీఎం కిరణ్‌ విమర్శల వ్యూహం.
  • రైతుసర్కారని వైఎస్‌ వేసిన ముద్రను పార్టీకి కొనసాగించకపోతే రైతుల ఓట్లు పోవడం ఖాయం.

    తెలుగుదేశం
  • ‘రైతు వ్యతిరేకి’ ముద్రను తొలగించుకోవాలన్న వ్యూహం.
  • రైతాంగంలో బలపడిన ‘ప్రభుత్వ వ్యతిరేకవైఖరి’ని మరింత పెంచే ఎత్తుగడ.
  • ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముఖ్యమంత్రులు, మంత్రుల కంటే ముందే బాబు తమ వద్దకు వస్తున్నారన్న ‘రైతుల సానుకూల భావన’ను మరింత బలపడేలా చేయడం.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వం సహాయంలో వైఫల్యం చెందిందన్న రైతుల ఆగ్రహాన్ని ఇప్పటినుంచే ఓటు బ్యాంకుగా మలచుకోవడం.
    జగన్‌ పార్టీ
  • సొంత పార్టీకి ముందే రైతుమంత్రం ద్వారా ముందస్తుగానే వారి మనసు గెలుచుకునే వ్యూహం.
  • దాని ద్వారా తన తండ్రి వైఎస్‌పై ఉన్న రైతుబాంధవుడన్న ముద్రపై పేటెంటీ సాధించడం.
  • నిరాహారదీక్ష ద్వారా తనకూ రైతు సమస్యలపై అవగాహన ఉందని చాటుకోవడం.
  • ఇక ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం చేస్తానంటూ కాంగ్రెస్‌ సర్కారుకు ఓ హెచ్చరిక.
  • రైతుల కోసం పోరాటం ద్వారా అటు కాంగ్రెస్‌-ఇటు తెలుగుదేశం పార్టీకి డేంజర్‌ సిగ్నల్స్‌ పంపించడం.

Tuesday, December 7, 2010

జగన్‌ సరికొత్త తెలం‘గానం’ సురేఖాస్త్రం !

jaga

డిసెంబర్‌కు ముందే తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తర్వాత తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఊహించని విధంగా మలుపు తిరుగుతాయని అంచనా వేస్తున్న ప్రధాన పార్టీలు ఆ మేరకు ఇప్పటినుంచే వ్యూహరచన, భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికపై దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా.. రాజకీయ పార్టీ స్థాపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలంగాణపై దృష్టి సారించారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడినప్పటికీ, అక్కడ కూడా తాను బలీయ శక్తిగా ఉండేందుకు జగన్‌ ఇప్పటినుంచే ముందుచూ పుతో వ్యవహరిస్తున్నారు. తాను తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని జగన్‌ స్పష్టం చేయనున్నారు.

ఈ విషయంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దారిలోనే పయనిం చనున్నారు. ‘జగన్‌ తెలంగాణకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదు. తెలుగు ప్రజలంతా సమానమే. ఆయన రాష్ట్ర విభజనకు అనుకూ లమే. ఒకవేళ రాష్ట్ర ం విడిపోతే మాది జాతీయ పార్టీ అవుతుంది. రాష్ట్ర విభజన అనేది ఇప్పటి సీఎంతో సహా ఎవరి చేతుల్లోనూ లేదు. అది కేంద్రం రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకునే నిర్ణయం. కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించాలన్నది జగన్‌ అభిమతమ’ని ఆయన సన్నిహిత సహచరుడొకరు వ్యాఖ్యా నించారు.

ఇదిలాఉండగా, తెలంగాణలో కూడా తన పార్టీ శక్తివం తంగా తయారుకావాలంటే తెలంగాణ అనుకూల వైఖరి తీసుకో కతప్పదని జగన్‌ శిబిరం నిర్ణయించింది. అందులో భాగంగా.. జనవరి 1 నుంచి బీసీ మహిళా ఎమ్మెల్యే, జగన్‌కు వీర విధేయురాలయిన కొండా సురేఖ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించేం దుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ మేరకు డిసెంబర్‌ 15 నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యమ కమిటీలు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి నుంచి టీఆర్‌ఎస్‌కు మించిన ఊపుతో ఉద్యమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అటు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో మౌనంగా ఉండిపోయిన తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లు తెలంగానంపై నోరు మెదపని వైఖరి అవలంబిస్తున్నందున.. తాము ఉద్య మాన్ని చేతులోకి తీసుకోవడం ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్లను తెలంగాణ ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టేందు కు జగన్‌ శిబిరం వ్యూహరచన చేస్తోంది. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నిష్ర్కమించేందుకు ప్రధాన కారకులయిన తెలంగాణ సీనియర్లకు సరైన సమయంలో సరైన గుణ పాఠం చెప్పాలని జగన్‌ శిబిరం యోచిస్తోంది.

ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక బీసీ మహిళా ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ నేతృత్వంలో మొదలుపెట్టడం ద్వారా.. వ్యక్తిగతంగా సీనియర్లను, సంస్థాగతంగా కాంగ్రెస్‌ పార్టీని ఏకకాలంలో దెబ్బకొట్టాలన్న వ్యూహం స్పష్టంగా కనిపి స్తోంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీ వర్గానికి చెందిన కొండా సురేఖను ముఖ్యమంత్రిగా ముందే ప్రకటించాలన్నది జగన్‌ శిబిరం వ్యూహమని సమాచారం.

తెలంగాణ వస్తే దళితుడిని సీఎంగా చేస్తానని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. బీసీ, దానికితోడు మహిళయిన సురేఖను సీఎం అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడం ద్వారా తెలంగాణలో 65 శాతం బీసీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టే వ్యూహంతో ముందుకు వెళుతోంది. టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో కలసిపోయిన సంకేతా లు స్పష్టమయినందున.. ఆ పార్టీని కూడా దెబ్బతీసే రెండంచెల వ్యూహంతో జగన్‌ శిబిరం ముందుకు వెళు తోంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకూ కాంగ్రెస్‌ను విమర్శించ కుండా.. కేవలం తన పార్టీని బలోపేతం చేసుకునేందుకే తెలంగాణ ఉద్యమాన్ని వినియోగించుకుంటోందని గ్రహించిన జగన్‌ బృందం, తెలంగాణపై టీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధి కన్నా, తమకే ఎక్కువ అంకితభావం ఉందని చాటేందుకు తానే సొంతంగా ఉద్యమాలు నిర్మించనుంది.

మరోవైపు.. టీఆర్‌ఎస్‌ కూడా డిసెంబర్‌ 31 తర్వాత తన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునేందుకు శ్రీ కృష్ణ కమిటీ నివేదికను ఆసరా చేసుకుని ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుని, కార్యాచరణకు శ్రీకారం చుట్టనుంది. టీడీపీ, జగన్‌ పార్టీ, కాంగ్రెస్‌, బిజేపీ సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సంస్థాగతంగా తాను పటిష్ఠంగా లేకపోతే రాబోయే సమస్యలను ఎదుర్కోవడం కష్టమన్న వ్యూహంతో టీఆర్‌ఎస్‌ డిసెంబర్‌ తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో తానే ముందు వరసలో ఉండేలా కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటోంది.

మరోవైపు.. తెలంగాణ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కూడా ఇప్పటినుంచే తెలంగాణ సమస్యపై గళం విప్పకపోతే డిసెంబర్‌ తర్వాత తామెక్కడ వెనుకబడిపోతామోనన్న ఆందోళనతో ఇప్పటినుంచే తెరపైకొస్తున్నారు. ఎంపీ మధుయాష్కీ, వివేక్‌, మందా జగన్నాధం, సీనియర్‌ ఎమ్మెల్యే ఆర్‌, దామోదర్‌రెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, కెఆర్‌ ఆమోస్‌, యాదవరెడ్డి, కమలాకర్‌రావు వంటి నేతలు తెలంగానాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమయిన తెలుగుదేశం పార్టీ మాత్రం, కేవలం టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే లక్ష్యంతోనే అడుగులు వేస్తోంది.

కాంగ్రెస్‌ను బలోపేతం చేయవలసిన బాధ్యత తనపై ఉందని కేసీఆర్‌ బాహాటంగా వ్యాఖ్యానించిన తర్వాత.. టీఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రజలు, ప్రధానంగా విద్యార్థి జేఏసీ, ఉద్యోగ సంఘాలు దూరమయిన విషయాన్ని గ్రహించిన టీడీపీ, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తన పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉంది. దేవేందర్‌ గౌడ్‌, నాగం, కడియం, మోత్కుపల్లి వంటి నేతలు తెలంగాణ వాదాన్ని మునుపటి కన్నా ఉధృతంగా వినిపిస్తు తమ పార్టీ ఎక్కడా వెనుకబడి పోకుండా జాగ్రత్త పడుతున్నారు.

Monday, November 29, 2010

తల్లీ కొడుకులు పార్టీకి.. పదవులకూ.. గుడ్‌బై * నన్ను పంపించాలనుకున్నారు నేనే వెళుతున్నా ! * ఒంటరిని చేసే కుట్రపన్నారు...

కాంగ్రెస్‌కు వైఎస్ జగన్ రాజీనామా
ఒంటరిని చేసే కుట్రపన్నారు...
jagan-car
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గారికి,
బరువెక్కిన గుండెతో, తీవ్రమైన ఆవేదనతో మీకు ఈ లేఖను రాస్తున్నాను. గడచిన 14 నెలలుగా అనేక అవమానాలను దిగమింగుకుంటున్నాను. నా మీద, నా కుటుంబం మీద చివరకు జనహృదయ నేత దివంగతుడైన నా తండ్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డిగారి మీద కూడా నీచమైన స్థాయిలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా ఓపిగ్గా సహిస్తూ వస్తున్నాను. చివరకు కాంగ్రెస్‌ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన మహానేత కుటుంబంలోనే చిచ్చు పెట్టే కుటిల నీతిని చూసి అవాక్కయ్యాను. మా చిన్నాన్న వైఎస్‌.వివేకానందరెడ్డికి ఆశలు చూపి పథకం ప్రకారం ఢిల్లీకి రప్పించుకుని మా కుటుంబాన్ని చీల్చే నీచ రాజకీయం చేస్తారా? గులాంనబీ ఆజాద్‌ సూచనలతోనే చిన్నాన్న ఢిల్లీకి వెళ్లాడని, జగన్‌కు కుటుంబంతోనే పగ్గాలు వేయాలని ప్రయత్నిస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి తీవ్రమైన వ్యధకు గురయ్యాను.

Smt-Vijayalakshmiజరుగుతున్న పరిణామాలన్నీ నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టడానికీ, రాజశేఖరరెడ్డి కీర్తి ప్రతిష్టలను తుడిచివేయడానికి జరుగుతున్నవేనని నాకు అర్థమవుతూనే ఉంది. అసలెందుకు ఇలా జరుగుతోంది. నేను చేసిన నేరమేమిటి? నా మీద, నా కుటుంబం మీద ఎందుకు ఇలా త్తి కట్టారు? నా తండ్రీ కీర్తి ప్రతిష్టల మీద ఎందుకు పరదాలు కప్పుతున్నారు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఏమిటది? నా తండ్రి చనిపోయిన రోజున 150 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి పదవికి నా పేరును ప్రతిపాదించి సంతకాలు చేస్తే మీ అభీష్టం మేరకు నేను దూరంగానే ఉన్నానే.. అది తప్పా? మీ ఆదేశాన్ని శిరసావహించి రోశయ్య పేరును ముఖ్యమంత్రి పదవికి నేనే ప్రతిపాదించాను కదా.. అది తప్పా? మొన్నటికి మొన్న మీరు ముఖ్యమంత్రిని మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డిని పెట్టాలనుకున్నప్పుడు సీఎల్‌పీ సమావేశం సజావుగా సాగేలా సంపూర్ణంగా సహకరించాను కదా. అది కూడా తప్పేనా?

ఇక నేను చేసిన తప్పేమిటి.. ఓదార్పు యాత్రేనా? అది నా వ్యక్తిగతమని నేను ఆచరించి తీరాల్సిన పుత్ర ధర్మమనీ ఇప్పటికే అనేక సార్లు చెప్పాను. నా తండ్రి గారు జనహృదయాలను చూరగొన్న మహానేత కావడం వల్ల ఆయన హఠాన్మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలు అనాధలయ్యాయి. ఈ నేపథ్యంలో మా నాన్న చనిపోయిన 20 రోజులకే, దుర్ఘటన జరిగిన పావురాల గుట్ట సాక్షిగా అక్కడ సంస్మరణ సభలో మాట్లాడుతూ ఆ బాధిత కుటుంబాలను వారింటికే వెళ్లి పలకరిస్తానని మాటిచ్చాను. దివంగతులైన నా తండ్రి ఆత్మశాంతి కోసం నేను ఆనాడు మాటిచ్చాను. ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది కనుకనే ఇది ఆచరించి తీరాల్సిన సాంప్రదాయం కనుకనే, యాత్రకు మీ అనుమతి కోరాను. గత నవంబర్‌లోనే ప్రారంభం కావాల్సిన యాత్రను మీ సూచన మేరకు మీ మీద గౌరవంతో వాయిదా వేసుకున్నాను.

recogniation'అనంతరం ఓదార్పు యాత్రను ప్రారంభించిన నాటి నుంచి మా మీద దాడి మొదలైంది. కారణం ఆ యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడమే. జనం గుండెల్లో రాజశేఖరరెడ్డి సజీవంగా ఉన్నాడని, సజీవంగా ఉంటాడని తేటతెల్లం కావడం కొందరు కాంగ్రెస్‌ పెద్దలకు మింగుడు పడలేదు. ఓదార్పు యాత్రపై తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. పార్టీని రెండు సార్లు ఒంటిచేత్తో విజయపథానికి నడిపించిన జననేత విగ్రహాలు ఊరూరా పెడితే పార్టీకి ఏ విధంగా నష్టమో చెప్పగలరా? లేని ఉద్దేశాలను నాకు ఆపాదించారు.మొదటి నుంచి కూడా రాజశేఖరరెడ్డి గారి ఉన్నతిని ఓర్వలేని కొందరు నేతలు చేస్తున్న కార్యక్రమంగా దీనిని నేను సరిపెట్టుకున్నాను.

కానీ క్రమంగా జరుగుతున్న పరిణామాలతో నాకో విషయం అర్థం కావడం మొదలైంది. జనం గుండెల్లో నుంచి వైఎస్సార్‌ ప్రతిబింబాన్ని తుడిచివేయాలని, ఆయన జ్ఞాపకాలను సైతం ధ్వంసం చేయాలని ఢిల్లీ స్థాయిలోనే ఒక పకడ్బందీ వ్యూహం తయారైనట్లు నాకు అర్థమైంది. దురదృష్టవశాత్తు ఈ వ్యూహకర్తలకు సాక్షాత్తు అధిష్ఠానం ఆశీస్సులే ఉన్నట్లు తేటతెల్లమైంది. మిమ్మల్ని కలవాలని ఓదార్పు యాత్ర ఉద్దేశాలను వివరించాలని దివంగత నేత సతీమణి, నా తల్లి విజయలక్ష్మి గారు మీ అపాయింట్‌మెంట్‌ కోసం లేఖ రాశారు. నెల రోజులకు గానీ మాకు మీ సందర్శనకు అనుమతి లభించలేదు. మీకు అవసరం ఉంటే మా చిన్నాన్నకు అయినా, చిరంజీవికి అయినా ఒక్కరోజులో అపాయింట్‌మెంట్‌ దొరుకుతుంది లేదంటే దివంగత నేత వైఎస్‌ సతీమణి తన భర్తను కోల్పోయిన కొద్ది నెలలకే మీ అపాయింట్‌మెంట్‌ అడిగితే నెలరోజులు ఎదురుచూడాల్సి వచ్చింది. అయినా మేమేమి బాధపడలేదు.

jagan-standఆ భేటీలో మీకు అన్ని విషయాలు వివరించాం. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. చివరకు ఓదార్పు యాత్రలో ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొనకూడదని కట్టడి చేశారు. ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించుకుని మంతనాలు జరిపారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రికి ఫోన్లు చేశారు. ముఖ్యమంత్రి మంత్రులకు ఫోన్లు చేశారు. ఆ యాత్రకు ఎవ్వరూ సహకరించకుండా ప్రయత్నాలు చేశారు. అయినా వైఎస్‌ను అభిమానించే జనసామాన్యం, కిందిస్థాయి కార్యకర్తల అండదండలతో యాత్ర విజయవంతంగా సాగింది. యాత్రలో పాల్గొన్న వారి మీద, నాకు సహకరించిన వారి పైనా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. మద్దతుగా నిలిచిన వారిపై వేటు వేశారు.

ఓదార్పు యాత్రను భగ్నం చేయడానికి ఒక పక్క ప్రయత్నాలు చేస్తూనే నా మీద, నా కుటుంబం మీద విష ప్రచారాన్ని కొనసాగించారు.కాంగ్రెస్‌కు ఆగర్భశత్రువులమని స్వయంగా ప్రకటించుకున్న మీడియాతో స్నేహం చేసి తప్పుడు ఆరోపణాస్త్రాలను మా మీద సంధించారు.దివంగత నేత మీద కూడా దుర్మార్గమైన ఆరోపణలు చేశారు. ఆయన లేరని తెలిసి, ఆరోపణలకు బదులు ఇచ్చుకోలేరని తెలిసి కొందరు పార్టీ నేతలే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. సాక్షాత్తు మిమ్మల్నే కలిసి వచ్చిన కొందరు నేతలు మీడియా సమావేశాలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చేశారు.

ఇంత జరుగుతున్నా పార్టీ నాయకత్వం గానీ, రాష్ట్ర మంత్రివర్గం గానీ కనీసం ఖండించనైనా లేదు. నిన్నటిదాకా ఉన్న మంత్రివర్గమంతా వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మంత్రివర్గమే. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ వీరు భాగస్వాములే. అయినా సరే ఈ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నమే వారు చేయలేదు. ఇంకో పక్క వైఎస్సార్‌ జ్ఞాపకాలను తుడిచివేసే ప్రయత్నం కూడా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ సభల్లోనూ, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన ఫోటో లేకపోవడం ప్రతిసారి వివాదస్పదమవుతోంది.ఆయన ఫోటో లేనందుకు జనం నిలదీస్తున్నారు. అయినా సరే వారి వైఖరిలో మార్పు రాలేదు. అన్నిటికంటే దిగ్భ్రాంతికరమైన విషయం వైఎస్సార్‌ మరణంపై జరిగిన కంటి తుడుపు దర్యాప్తు. నాతో సహా ప్రజల్లో ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయి.

ఆ అనుమానాలకు సీబీఐ, నిపుణుల నివేదికలు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయాయి. జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. కనీసం ఏ ఒక్కరినైనా ఈ దర్యాప్తు వేలెత్తి చూపలేకపోయింది. ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోయారు. దాని గురించి మాట్లాడటమే మహాపాపమన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. మహానేత హెలికాప్టర్‌ దుర్ఘటనకు సంబంధించి అనేక సందేహాలను నివృతి చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఫలితం లేకపోయింది. అయినా దాని మీద ఏం మాట్లాడిన ఎలాంటి పెడర్థాలు తీస్తారోనన్న అనుమానంతో క్రమశిక్షణ గల కార్యకర్తగా మౌనంగా భరిస్తూ వచ్చాను. అంతే కాదు ఓ రష్యన్‌ వెబ్‌సైట్‌ వెలువరించిన కథనం ఆధారంగా కొన్ని ఛానళ్లతో పాటు సాక్షి కూడా చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది మహాపరాధమైనట్లు సాక్షి కార్యాలయంపై పోలీసులు దాడి చేసి సోదాలు చేశారు.

నన్ను పార్టీ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి ప్రతి చిన్న సంఘటనను అవకాశంగా మల్చుకుంటున్నారు. సాక్షి ఛానల్‌లో వచ్చిన ఒక రాజకీయ విశ్లేషణ కథనాన్ని భూతద్దంలో చూపి సాక్షి కార్యాలయాలపై కొందరు కాంగ్రెస్‌ నేతలు దాడులు చేయించారు. పార్టీకి, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా నేనే కుట్ర చేసినట్లు ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి 125 సంవత్సరాలు నిండిన సందర్భంగా సాక్షి ఛానల్‌ ఒక విశ్లేషాణాత్మక కథనాన్ని ప్రసారం చేసింది. ఆ కథనంలో కొన్ని ప్రశంసలు, కొన్ని విమర్శలతో పాటు కొన్ని సానుకూల, ప్రతికూలంశాలను చర్చించింది.

ఇలాంటి కథనాలే ఇతర జాతీయ పత్రికల్లో, మేగజైన్లలో వచ్చాయి. అలాగే బీహార్‌ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో రాహుల్‌ గాంధీ ప్రస్తావన అన్ని జాతీయ, ప్రాంతీయ ఛానళ్లతో పాటు సాక్షిలో కూడా వచ్చింది. దీనినీ తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలిచాను. సాక్షి పత్రిక గానీ, సాక్షి ఛానల్‌ గానీ కాంగ్రెస్‌ పార్టీకి చెందినవి కావని, అవి స్వతంత్య్ర మీడియా సంస్థలుగా నిష్పక్షపాతంగా పని చేస్తాయని, వాటిని ప్రారంభించిన రెండు సందర్భాల్లోనూ సభాముఖంగానే నేను ప్రకటించాను. ఆ సభల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో పాటు రాష్ట్ర గవర్నర్‌, వీరప్ప మొయిలీ, ఆనంద్‌ శర్మ వంటి కాంగ్రెస్‌ పెద్దలు పీసీసీ అధ్యక్షుడు సహా అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర నేతలు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.

అప్పుడూ ఏ ఒక్కరు నా మాటలకు అభ్యంతరం చెప్పలేదు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్‌ ఛానల్‌లో కాంగ్రెస్‌ వ్యతిరేక వార్త వచ్చిందనే అసత్య ప్రచారంతో పథకం ప్రకారం సాక్షిపై దాడులకు ఉసిగొల్పారు. ఢిలీ నుంచి అందిన ఆదేశాలతో యువజన కాంగ్రెస్‌ నేతలు కొందరు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఈ ఆందోళన ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకి అన్న ముద్ర వేయడం వారి లక్ష్యం. నన్ను పార్టీనుంచి గెంటివేసే కుట్ర జరుగుతుందనడానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా? చివరకు మా కుటుంబంలోనే చిచ్చు పెట్టే నీచమైన ఎత్తుగడలకు దిగజారారంటే ఏమనుకోవాలి? ఇంకెంత కాలం సహనంతో ఉండాలి?

వీటికి తోడు ప్రతి రోజు నాపైన గాలి వార్తల ప్రచారం, నా మీద వేటుకు రంగం సిద్దమైందంటూ మీడియాకు కథనాలు అందిస్తున్నారు. వేటా? లేటా? అని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందంటే రోడ్డు మీద వెళ్ళే ఏ చిన్న పిల్లాడిని అడిగినా నేడో రేపో జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌ నుంచి బహిష్కరిస్తారు. అని ఠకీమని సమాధానం చెపుతారు. అదును కోసం చూస్తున్నారని, జగన్‌పై ఇక వేటు వేస్తారని సామాన్య జనం కూడా అనుకునే పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని విషప్రచారాల నడుమ, ఇన్ని కుట్రలు, కుహకాల మధ్య మహానేత ప్రతిష్టకు మసిపూసే కుయుక్తులను సహిస్తూ ఇంకా ఈ పార్టీలో కొనసాగడంలో అర్థం లేదని భావిస్తున్నా. నాన్నను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కోట్లాది మంది జనానికి అండదండగా నిలవడం ఈ పార్టీలో సాధ్యం కాదని అర్థమైంది. ఏ పార్టీ కోసమైతే నా తండ్రి తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పార్టీ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఆయన కుటుంబానికి కల్పించడం, అందుకు అధిష్ఠానం ఆశీస్సులు ఉండటం అత్యంత శోచనీయం. నాకు మరో మార్గం లేదు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేనూ, నా తల్లి విజయలక్ష్మి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. పార్టీ ద్వారా సంక్రమించిన శాసనసభ సభ్యత్వానికి నా తల్లిగారు, పార్లమెంట్‌ సభ్యత్వానికి నేనూ రాజీనామా చేస్తున్నాం.ఒంటరిని చేసి పంపించాలనుకున్నారు.ఒంటరిగా నేనే వెడుతున్నాను. ఈ సందర్భంగా మీకో విషయాన్ని స్పష్టం చేయదలిచాను.

నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్రలు చేస్తున్నానని నా వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా కాంగ్రెస్‌ నేతలు ప్రచారాలు చేయించారు. అటువంటి నీచమైన వ్యక్తిత్వం కాదు నాది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు ఎదురైనా ఒక మాట ఇస్తే దానికి ఎప్పటికీ కట్టుబడి ఉండాలని మా నాన్న నాకు నేర్పించారు. అలాగే రాజకీయాల్లోనైనా, వ్యక్తిగత జీవితంలో అయినా విశ్వసనీయత పెంపొందించుకోవాలని, ఉన్నత విలువలు పాటించాలని ఆయన నాకు నేర్పారు. ఈ విలువలు దిగజార్చేలా నేనెప్పుడూ వ్యవహరించలేదు. ఇకముందూ వ్యవహరించబోను.మళ్లీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. 150 మంది శాసనసభ్యులు నా ముఖ్యమంత్రిత్వాన్ని బలపర్చిన నాడు మీ అభీష్టాన్ని మన్నించానే తప్ప చంద్రబాబు లాగా వైశ్రాయ్‌ తరహా క్యాంపులు నడిపి గద్దెనెక్కి కూర్చోలేదు. విలువలకు కట్టుబడిన వాడిని కనుకనే అలా చేయలేదు.

మీరు రోశయ్య గారిని ముఖ్యమంత్రిని చేయాలని తలవగానే సీఎల్‌పీలో ఆయన పేరును నేనే ప్రతిపాదించాను. ఉన్నత విలువల కోసమే ఆ పని చేశాను.ముఖ్యమంత్రిని మార్చి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎంపిక చేయడానికి జరిగిన సీఎల్‌పీ సమావేశం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగేందుకు సహకరించిందీ ఉన్నత ప్రజాస్వామ్య విలువల కోసమే. నేను స్థాపించిన సాక్షి మీడియా సంస్థ కూడా స్వతంత్రంగా నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకున్నది కూడా ఆ విలువల కోసమే. అలా వ్యవహరించబట్టే సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌ ప్రజాదరణ పొందాయి.

విశ్వసనీయతను ఊపిరిగా భావించినందువల్లే స్థాపించిన రెండేళ్ళలోనే 14 లక్షల పైచిలుకు సర్క్యులేషన్‌ సాధించి సాక్షి దినపత్రిక రికార్డును సృష్టించింది, నేను పాటించిన ఉన్నత విలువలకు అదే సాక్షి. అందుకే చెపుతున్నాను... నేను గతంలో లాగే ఇక ముందు కూడా విలువలను పాటిస్తాను.. గౌరవిస్తాను. నేను ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాన్ని పడగొడతానని మీరు భయపడుతున్న నేపథ్యంలో ఆ విలువల స్ఫూర్తితోనే మీకు హామీ ఇస్తున్నాను.. నా తండ్రిని గుండెల్లో పెట్టుకుని నన్ను అభిమానిస్తున్న పార్టీ శాసనసభ్యులందరికీ ఇప్పుడే ఈ సందర్భంలోనే విజ్ఞప్తి చేస్తున్నా.. మీరెవ్వరూ నా కోసం రాజీనామాలు చేయవద్దని.. మీరెక్కడ ఉన్నా మీ ప్రేమాభిమానాలు నాపై ఉంటే చాలని..ఎంతకాలం బతికామన్నది కాదు ముఖ్యం, ఎలా బతికామన్నదే ముఖ్యమని నా త్రండి తరచూ చెబుతుండేవారు. ఆయన నాకు నేర్పిన సచ్ఛీలత, విశ్వసనీయత, ఉన్నత విలువలు నాకు మార్గదర్శకాలు, అవే నన్ను నడిపిస్తాయి.

యుద్ధ శంఖారావం !
కడప ఎంపీ జగన్‌ యుద్ధం ప్రకటించారు. ఏకంగా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి పైనే సమర శంఖారావం పూరించారు. ఆమె నాయకత్వాన్ని ప్రశ్నించారు. అయిదు పేజీల లేఖతో ఆమె వ్యవహార శైలిని అడుగడుగునా తప్పుబట్టారు. అది సోనియా గాంథీ మీద రాజకీయ దాడి. తనకు జరిగిన అన్యాయానికి ఆమెను అడుగడుగునా నిలదీశారు. సోనియానుద్దేశించి రాసిన లేఖే అయినా, ప్రజలను, వారి మనోగతాన్ని దృష్టిలో పెట్టుకుని పదజాలాన్ని వాడారు. విశ్వసనీయత గురించి ఆయన పదే పదే ప్రస్తావించడం ద్వారా తాను ప్రజల మనిషిగా ఉంటానని, వారికే విశ్వసనీయుడినని చెప్పక చెప్పారు.

ఆక్రోశం, ఆవేదన, వ్యధ కలగలిపి తయారు చేసిన ఆ సుదీర్ఘ లేఖ రాష్ట్రంలో రాజకీయ సంద్రాన్ని అతలాకుతలం చేసింది. అదే సమయంలో ఢిల్లీలోనూ ప్రకంపనలు సృష్టించింది. తన బాబాయ్‌ వివేకానంద రెడ్డిని సోనియా గాంధీ పిలిపించడం ద్వారా తమ కుటుంబంలో చీలికలు తెచ్చే కుటిల నీతికి పాల్పడ్డారని, అదే తనను బాధించిందని చెప్పడం ద్వారా తాను పార్టీని వీడి పోవడానికి దారి తీసిన అనేక కారణాల్లో అదే ప్రధాన కారణమని అన్యాపదేశంగా చెప్పారు. కాంగ్రెస్‌లోని కొందరు పెద్దలు తనను చూసి భయపడుతున్నారని, తనకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తన మీద కక్ష తీర్చుకుంటున్నారని స్వయంగా అందులో ధ్వజమెత్తారు.

తన తండ్రి పేరు ప్రతిష్టలను తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతున్నదన్న ఆవేదనతో పాటు జన సామాన్యం తన వెంటే ఉందన్న ధీమా ఏక కాలంలో ఈ లేఖలో కనిపించాయి.నిజానికి ఈ లేఖ సోనియా గాంధీకి ఉద్దేశించిందే అయినా, అది కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డికి సరికొత్త సవాళ్లను తెచ్చి పెట్టింది. ఆయన నియామకం జరిగి పట్టుమని నాలుగైదు రోజులైనా గడవక ముందే..కేబినెట్‌కు సంపూర్ణ రూపం ఇవ్వక మునుపే జగన్‌ తన అమ్ముల పొదిలోని రాజీనామా అస్త్రాన్ని సంధించారు. అది సోనియా మీద కలిగించే ప్రభావం ఒక రకమైనదైతే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ మీద కలిగించే ప్రభావం మరో రకమైనది.

బుధవారం ఆయన జరప తలపెట్టిన కేబినెట్‌ ప్రమాణ స్వీకారం ఆయనకే అగ్ని పరీక్షగా మార నున్నది. మంత్రి పదవుల మీద ధీమాగా ఉన్న ఆశావహులంతా ప్రస్తుతానికి ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి విధేయత ప్రకటిస్తున్నా, రేపు మంత్రి మండలిలో చోటు దొరకలేదని రూఢి అయ్యాక ఎవరి దారెటో కనుక్కుని ముందుగానే కాయకల్ప చికిత్స చేయడం కొత్త ముఖ్యమంత్రి రాజకీయ వ్యూహానికి పరీక్షగా నిలిచింది.పదవులకు అతీతంగా పార్టీ శ్రేణులనందరినీ ఏకతాటి మీద నిలపడం ఆయన ముందున్న ప్రధాన సవాలు. కేబినెట్‌ ప్రమాణ స్వీకారం అయ్యాక ప్రభుత్వ రోజు వారీ నిర్వహణలో తల మునకలు కావాల్సిన సీఎం హఠాత్తుగా ఈ కొత్త రాజకీయ సవాలును ఎదుర్కోవాల్సివచ్చింది.
ఒంటరిని చేసే కుట్రపన్నారు...
ఒంటరిగా వెళ్తున్నా
కుటుంబాన్ని చీల్చే కుటిల నీతిపై మనస్తాపం
అదేబాటలో వైఎస్ సతీమణి విజయమ్మ
కారణాలు వివరిస్తూ సోనియాకు ఐదు పేజీల బహిరంగ లేఖ
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చబోనని స్పష్టీకరణ

కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ రాజీనామా చేయొద్దని యువనేత విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా పెను సంచలనం... పద్నాలుగు నెలల అవమానానికి, దాడికి, బెదిరింపులకు జవాబు. తన పైన, తన కుటుంబం పైన, వైఎస్ ఇమేజ్ పైనా జరుగుతున్న దాడిని, వైఎస్ కలలుగన్న ప్రజా సంక్షేమం పట్ల అలక్ష్యాన్ని ఇన్నాళ్లు సహనంతో భరించిన జగన్ హుందాగా బంధనాలు తెంచుకున్నారు... ‘ఎంత కాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం’ అని తండ్రి చెప్పిన, తాను నమ్మిన విలువలకు కట్టుబడుతూ యువనేత రాజీనామా చేశారు. కాంగ్రెస్ సభ్యత్వాన్ని, పదవులనూ వదిలేస్తూ వైఎస్ సతీమణి విజయమ్మ, తనయుడు జగన్ పార్టీ నుంచి నిష్ర్కమించారు. కాంగ్రెస్‌కు మారుపేరైన.. కాంగ్రెస్‌కు రాష్ర్టంలో పునర్జన్మనిచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, సతీమణి బయటికి వెళ్లే పరిస్థితి రావడాన్ని... దానికి అధిష్ఠానమే స్వయంగా సారథ్యం వహించడాన్ని చూసి రాష్ట్రం ఉలిక్కిపడింది.. ఆవేదన చెందింది.. ఆవేశపడింది. కన్నీరు పెట్టింది. జనం వీధుల్లోకి వచ్చారు. నిరసన గొంతుక వినిపించారు. డీసీసీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాజీనామాలు సమర్పించారు. మేమూ మీ వెంటేనని నినదించారు. యువనేత రాజీనామా వార్తతో జాతీయ, రాష్ట్ర మీడియా హోరెత్తిపోయింది. ఇది కాంగ్రెస్‌కు చావు దెబ్బేనంటూ చానళ్లన్నీ విశ్లేషణలందించాయి. జగన్ నిర్ణయం సరైనదేనన్న జనాభిప్రాయాన్ని ఒపీనియన్ పోల్స్ ద్వారా అందించాయి. వ్యక్తిగత జీవితంలోనూ, రాజకీయాల్లోనూ విశ్వసనీయత, ఉన్నత విలువలు పాటించాలన్న వైఎస్ ఆదర్శాలకు అనుగుణంగా... ఆత్మవిశ్వాసం, హుందాతనం తొణికిసలాడేలా జగన్ తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా మద్దతు లభిస్తోంది. ఇంటర్నెట్‌లోనూ అదే సంచలనం. గూగుల్ టాప్ 10 వార్తల్లో ఇదే తొలి స్థానంలో నిలిచింది. రాష్ర్ట రాజకీయాల్లో రాబోయే పెను మార్పులకు సోమవారం నాటి పరిణామాలు అద్దం పట్టాయి

కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, కడప లోక్‌సభ స్థానానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు, యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. ఆయన మాతృమూర్తి, వైఎస్ సతీమణి వైఎస్ విజయలక్ష్మి కూడా పార్టీ సభ్యత్వానికి, పులివెందుల శాసనసభ స్థానానికి రాజీనామా సమర్పించారు. తన తండ్రి జీవితాంతం నమ్మి పాటించిన, ఏడాదిన్నరగా తాను అనుసరిస్తూ వచ్చిన విలువలకు పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు జగన్ ప్రకటించారు. ఇందుకు రాష్టవ్య్రాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. ఆయనది సరైన నిర్ణయమని, కాంగ్రెస్ తప్పిదమే ఇందుకు కారణమని, ఇది పార్టీకి పెను నష్టమని పలు తెలుగు వార్తా చానళ్ల ఒపీనియన్ పోల్స్‌లో ప్రేక్షకులు భారీ సంఖ్యలో అభిప్రాయపడ్డారు. పార్టీని ఎందుకు వీడాల్సి వస్తున్నదీ వివరిస్తూ అధినేత్రి సోనియాగాంధీకి జగన్ ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. కొందరు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చబోనని ఆమెకు స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా తనకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ రాజీనామాలు చేయొద్దని కూడా విజ్ఞప్తి చేశారు. తద్వారా జగన్ రాజకీయ పరిణతిని చాటుకున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. తనను పార్టీ నుంచి గెంటేసేందుకు అధిష్టానం స్థాయిలోనే కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. ఏడాది న్నరగా తనను ఎలా వేధించిందీ సోదాహరణంగా వివరించారు.

అందుకు అనుగుణంగానే గత 14 నెలలుగా తనపై నానారకాలుగా దాడి జరుగుతోందని, అవమానాలపాలు చేస్తున్నారని అన్నారు. ఈ విష ప్రచారాలన్నింటికీ అధిష్టానం ఆశీస్సులు కూడా ఉండటం కలచివేసిందని చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేకిగా ముద్ర వేసి బయటకు పంపాలని చూశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒంటరిని చేసి బయటకు పంపాలనుకున్నారని, అందుకే ఒంటరిగా తానే వెళ్తున్నానని ప్రకటించారు. ‘‘పార్టీ కోసం జీవితాంతం పాటుపడ్డ మహా నేతను కూడా తెరమరుగు చేసేందుకు, ఆయన ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నించారు. చివరికి తాజాగా ఆయన కుటుంబంలోనే చిచ్చు పెట్టే నైచ్యానికి కూడా ఒడిగట్టి, నేను పార్టీని వీడక తప్పని పరిస్థితులను కల్పించారు. నాన్నను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్న కోట్లాది మంది ప్రజలకు అండదండగా నిలవడం ఈ పార్టీలో సాధ్యం కాదని అర్థమైంది’’ అని స్పష్టం చేశారు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదని, ఎలా బతికామన్నదే ప్రధానమని వైఎస్ పదేపదే చెప్పిన సూత్రాన్ని ప్రస్తావించారు. తండ్రి నేర్పిన విలువలను దిగజార్చేలా ఇంతదాకా వ్యవహరించలేదని, ఇకముందూ వ్యవహరించబోనని స్పష్టం చేశారు. ఆయన నుంచి అబ్బిన సచ్ఛీలత, విశ్వసనీయత, ఉన్నత విలువలే తనను ముందుకు నడిపిస్తాయన్నారు.

జగన్ రాజీనామా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సోమవారం ఉదయం 11.30 ప్రాంతంలో ఆయన లేఖను మీడియాకు విడుదల చేశారు. అప్పటి నుంచి రోజంతా జాతీయ, ప్రాంతీయ మీడియా మొత్తం దీనిపైనే వార్తలు, కథనాలు, విశ్లేషణలతో హోరెత్తించింది. ఎన్‌డీటీవీ, సీఎన్‌ఎన్-ఐబీఎన్ లైవ్, టైమ్స్ నౌ, హెడ్‌లైన్స్ టుడే, జీన్యూస్ వంటి జాతీయ చానళ్లతో పాటు వాటి వెబ్‌సైట్లలోనూ జగన్ వార్తే ప్రముఖంగా కన్పించింది. వాటికి అనుబంధంగా అనేక న్యూస్ వీడియో క్లిప్పింగ్‌లను ఆ వెబ్‌సైట్స్ అందుబాటులో ఉంచాయి. ఇంటర్నెట్‌లో కూడా జగన్ రాజీనామా వార్త హవాయే నడిచింది. గూగుల్ సెర్చ్‌లో సోమవారం భారత నెటిజన్లు అత్యధికంగా వెదికిన పదంగా (కీ వర్డ్) ఇది నిలిచింది. గూగుల్ టాప్ 10 వార్తల్లో రాజీనామా సంబంధిత అంశాలే టాప్ ఫైవ్‌గా నిలిచాయి! మరో సెర్చ్ ఇంజన్ యాహూ టాప్ స్టోరీల్లోనూ ఇదే మొదటి వార్తగా నిలిచింది.

రాజీనామా గురించి తెలియగానే రాష్టవ్య్రాప్తంగా పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చారు. పలు చోట్ల జగన్‌కు మద్దతుగా, కాంగ్రెస్ అధిష్టానం వైఖరికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలకు దిగారు. అనంతపురం, కడప వంటి చోట్ల అభిమానులు రెచ్చిపోయారు. కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులకు దిగారు. కాంగ్రెస్ నేతలతో పాటు కొన్నిచోట్ల సోనియాగాంధీ దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు. సోనియా, కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలను దహనం చేస్తున్నారన్న వార్తలు తెలియడంతో జగన్ వాటిని ఖండించారు. అటువంటి చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాల్సిందిగా సూచించారు.

రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కూడా జగన్ రాజీనామా తీవ్ర కలకలం సృష్టించింది. దీని పర్యవసానాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించుకోవడం కన్పించింది. జగన్ వద్దన్నా, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వంటి పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాజీనామాల బాట పట్టారు. రాష్టవ్య్రాప్తంగా పీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ నేతలు, డీసీసీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నేతలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు... ఇలా అన్ని స్థాయిల నేతలూ భారీ సంఖ్యలో రాజీనామాలు చేస్తున్నారు!

జగన్ ఈగోను దెబ్బ తీశారా?

కాంగ్రెసు పార్టీ అధిష్టానం కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లే కనిపిస్తోంది. వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవడం ఖాయమని ఎప్పుడో నిర్ధారణకు వచ్చిన అధిష్టానం వ్యూహాత్మకంగా ఆపరేషన్ జరిపినట్లు గత వారం రోజుల పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఎప్పటికప్పుడు వైయస్ జగన్ ఈగోను దెబ్బ తీసేందుకు కాంగ్రెసు అధిష్టానం చర్యలు తీసుకుంటూనే ఉంది. రాయలసీమకు చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా వైయస్ జగన్ ను వ్యూహాత్మకంగా దెబ్బ తీసేందుకు పూనుకుంది. తన తండ్రి వైయస్సార్ ప్రభుత్వంలో శాసనసభా స్ఫీకర్ గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిని తనకు వ్యతిరేకంగా రంగంలోకి దింపుతున్నట్లు వైయస్ జగన్ కు అర్థమైంది. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రకటించగానే హుటాహుటిన వైయస్ జగన్ బెంగళూర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. కానీ సిఎల్పీ సమావేశం ప్రణబ్ అనుభవంతో వ్యూహాత్మకంగా చడీ చప్పుడు లేకుండా ముగిసింది. అది వైయస్ జగన్ కు తీవ్రమైన దెబ్బనే.

ముఖ్యమంత్రిగా ఎంపికైనా కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించకపోవడం కూడా వైయస్ జగన్ సూపర్ ఈగో వల్లనే అంటున్నారు. కిరణ్ ను అభినందించకుండా తన అంతరంగాన్ని వైయస్ జగన్ బయట పెట్టుకున్నారు. మొదటి నుంచి కూడా వైయస్ జగన్ ఓ ఆధిపత్య భావనతోనే పనిచేస్తూ వస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెసులోనే కాదు, రాష్ట్రంలోనే తనను మించిన నాయకుడు లేడనే ఓ విధమైన ఆధిక్య భావన ఆయనకు శాపంగా మారింది. అందుకే, మిగతా నాయకులతో కలవడానికి ఆయన ఇష్టపడడం లేదు. తానే అందరి కన్నా ఉన్నత స్థాయిలో ఉండాలని, అందరూ తననే గౌరవించాలని, తన మాటే చెల్లుబాటు కావాలని ఆయన కోరుకుంటారు. అదే ఆయనను రాజీనామా దారి పట్టించిందని చెప్పవచ్చు.

మరోవైపు, రోశయ్యను దించేసి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంతో తనకు అవకాశం రాదని ఆయన ఒక నిర్ధారణకు వచ్చినట్లు చెప్పవచ్చు. పిసిసి పదివి కూడా ఆయనకు దక్కే అవకాశాలు లేవని స్పష్టంగా తెలిసిపోయింది. దీంతో వైయస్ జగన్ కు బయటకు వెళ్లిపోయి ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నించడం తప్ప మరో మార్గం కనిపించలేదు. పైగా, బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి పార్టీ అధిష్టానం మాటకు తలొగ్గారు. వైయస్ జగన్ కు ఆయన దూరం కావడానికి నిర్ణయించుకున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసులోనే ఉండాలని అనుకోవడానికి గల పరిస్థితిని గానీ, వైయస్ వివేకా అంతరంగాన్ని గానీ తెలుసుకోవడానికి వైయస్ జగన్ ప్రయత్నించిన పాపాన పోలేదు. వైయస్ వివేకా చర్యను ఆయన తీవ్రంగా నిరసించారు. వైయస్ వివేకానంద రెడ్డి తనను వ్యతిరేకించడం వల్ల కూడా వైయస్ ఈగో దెబ్బ తిన్నది.

మొత్తం మీద, ఓ సూపర్ మ్యాన్ లా తప్ప మరో రకంగా వైయస్ జగన్ ఉండలేరనేది స్పష్టమై పోయింది. అది ప్రాంతీయ పార్టీలో తప్ప కాంగ్రెసు వంటి జాతీయ పార్టీలో సాధ్యమయ్యేది కాదు. ఆయన మనస్తత్వమే ఆయన రాజీనామా చేయడానికి కారణమైంది.

చిరంజీవి పార్టీలో చిచ్చు: కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా?


కాంగ్రెసు పార్టీకి, లోకసభ సభ్యత్వానికి వైయస్ జగన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. కాగా, వైయస్ జగన్ రాజీనామా చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చిచ్చు పెట్టింది. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చేరాలా, వద్దా అనే విషయంపై చిరంజీవి తన పార్టీ శాసనసభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వంలో చేరే విషయంపై లేదా ప్రభుత్వానికి మద్దతిచ్చే విషయంపై చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడారు. తమ 18 శాసనసభ్యుల్లో 16 మంది శాసనసభ్యులు కచ్చితంగా ప్రభుత్వానికి మద్దతిస్తారని, తన వెంట నడుస్తారని ఆయన చెప్పినట్లు సమాచారం. శోభా నాగిరెడ్డి, మహేశ్వర్ రెడ్డిలపై ఆయన అమమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. వారితో పాటు మరో ఎమ్మెల్యే కూడా వైయస్ జగన్ వైపు వెళ్లే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా, తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదనే దీమాతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అందుబాటులో ఉన్న శాసనసభ్యులతో, ఎమ్మెల్సీలతో సమావేశమై ఆ మేరకు ఆయన హామీ ఇచ్చారు. వైయస్ జగన్ వర్గం ప్రయత్నాలను ఎదుర్కోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెసుకు శాసనసభలో 156 మంది శాసనసభ్యులున్నారు. ప్రజారాజ్యం పార్టీకి 18 మంది, తెలంగాణ రాష్ట్ర సమితికి 11 మంది, మజ్లీస్ కు ఏడుగురు, సిపిఐకి ఏడుగురు, సిపిఎంకు ఒక్కరు, తెలుగుదేశం పార్టీకి 90 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. శాసనసభలో ప్రభుత్వానికి కనీసం 147 మంది శాసనసభ్యుల బలం అవసరం. వైయస్ జగన్ వర్గం వెళ్లిపోయినా అంతకన్నా ఎక్కువే బలం ఉంటుందని కాంగ్రెసు అధిష్టానం విశ్వాసంతో ఉంది. వైయస్ జగన్ వెంట 15 మందికి మించి శాసనసభ్యులు వెళ్లిపోరనే విశ్వాసంతో ఉంది. ఆ మేరకు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు 16 మంది మద్దతిస్తారని భావిస్తున్నారు. ఎక్కువలో ఎక్కువగా జగన్ వెంట 26 మంది శాసనసభ్యులు వెళ్లిపోయినా నష్టం లేదనే భావనతో కాంగ్రెసు నాయకత్వం ఉంది.

తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదని, అందు వల్ల ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ముందుకు రాదని అంటున్నారు. మజ్లీస్ కూడా కాంగ్రెసు వైపే ఉండే అవకాశం ఉంది. తెరాస మద్దతివ్వకపోవచ్చు. తెరాస మద్దతు తీసుకోవాలంటే పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. తెలంగాణ డిమాండ్ ను ఆ పార్టీ మరోసారి ముందుకు తేవచ్చు. అందువల్ల తెరాస మద్దతు తీసుకునే వైపుగా ఆలోచన చేయకపోవచ్చు. ఇతరులను కూడా తమ వైపు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెసు నాయకులు అంటున్నారు. ప్రభుత్వం పడిపోదని వైయస్ జగన్ వర్గానికి చెందిన గోనె ప్రకాశ రావు స్వయంగా చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన వైయస్ జగన్ కు లేదని వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు కూడా చెబుతున్నారు. పరిస్థితిని గమనించే జగన్ వర్గం ఆ విధమైన వాదనలను ముందుకు తెచ్చి ఉంటారని భావిస్తున్నారు.

కాగా, వైయస్ జగన్ వెంట ఎవరూ వెళ్లరని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. వైయస్సార్ పై సానుభూతితో అప్పట్లో వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని 150 మంది సంతకాలు చేశారని, తాను కూడా సంతకం చేశానని, ఆ పరిస్థితి ఇప్పుడు లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్ మాటల్లో రాజకీయ పరిపక్వత లేదని ఆయన విమర్సించారు. ఎవరో పార్టీ పెడతారని కాంగ్రెసును వీడి వెళ్లేది లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితుడైన లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా రాజీనామా చేసే విషయంపై పునరాలోచన చేస్తానని చెప్పారు. రోజులు గడుస్తున్న కొద్ది వైయస్ జగన్ కు మద్దతు తగ్గుతూ పోతుందని కాంగ్రెసు అంచనా. దానివల్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని అంటున్నారు.

Sunday, October 31, 2010

రోశయ్యే సుప్రీం ! ‘‘ రోశయ్య సుప్రీం ’’

roshaiah-cmm
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పరిపాలన, పార్టీ ప్రజాప్రతి నిధులపై క్రమంగా పట్టుబిగుస్తున్నారు. బలహీన ముఖ్యమంత్రి అన్న భావన నుంచి బయటపడి బలమైన ముఖ్యమంత్రిగా ముద్ర వేస్తున్నారు. కొద్దికాలంపాటు అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ‘‘ముఖ్యమంత్రి మార్పు’’ ఊహాగానాల... నుంచి మళ్లీ పాలనపై పట్టుసాధించే పరిస్థితికి చేరుకొన్నారు. అనారోగ్యం నుంచి తేరుకొని మునుపటి కంటే ఎక్కువగా ప్రభుత్వ శాఖల సమీక్షలకు అధిక సమయం కేటాయిస్తున్నారు. దీనికి తోడు...పార్టీ అధిష్ఠానానికి, తనకు ప్రత్యక్షంగా-పరోక్షంగా కంట్లో నలుసుగా మారిన వై.ఎస్‌.జగన్‌ వ్యవహారం ‘‘పార్టీపరంగా’’ ‘ముగింపు దశకు రావడం, ఆయన విధేయులంతా రోశయ్యకు మద్దతు ప్రకటించడం, ప్రతిపక్షం కూడా వై.ఎస్‌.హయాం స్థాయిలో ఉద్యమించక పోవ టంతో ఇక ఇప్పట్లో కొణిజేటికి తిరుగులేదన్న భావన, ఇక ‘‘ఆయనే సుప్రీం’’ అన్న నమ్మకం పార్టీ వర్గాలలో బలపడుతోంది.

అధిష్ఠానం అండదండలు...
పార్టీలో సమస్యలను ఒక్కటొక్కటిగా అధిగమిస్తూ వస్తున్న రోశయ్యకు అధిష్ఠానం పూర్తిస్థాయిలో దన్నుగా నిలవడంతో ‘‘సుప్రీం’’గా అవతరించారు. అయితే...వై.ఎస్‌.మాదిరిగా దానిని ఎక్కడా కనిపించనీయకుండా ఢిల్లీ పర్యటనలోనూ హడావుడి చేయకుండా, ప్రచారానికి దూరంగా తనదైన శైలిలో వ్యవహరిస్తున్న వైనాన్ని పార్టీ నాయకులు గ్రహించారు. అధిష్ఠానం కూడా... రోశయ్యకు మద్దతు పలకకపోతే పార్టీలో భవితవ్యం ఉండదని స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తమ సొంత విధేయతలను పక్కకుపెట్టి అనివార్య పరిస్థితులలో రోశయ్యకు విధేయత ప్రకటిస్తున్నారు.

దానికి అదనంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులలో ఎక్కువ మద్దతు ఉన్న కేవీపీ రామచంద్రరావు కూడా జగన్‌ను పక్కకు పెట్టి అధిష్ఠానం అండదండలున్న రోశయ్యకే విధేయత ప్రకటించడంతో కెవిపి సలహాల ప్రకారం నడిచే సదరు మెజార్టీ ప్రజాప్రతినిధులంతా ఆయనను అనుసరిస్తున్నపరిస్థితి కనిపిస్తోంది.అందని ముఖ్యమంత్రి కిరీటం కోసం అర్రులు చాస్తూ పార్టీని చీల్చే దిశగా అడుగులు వేస్తున్న జగన్‌కు ఇక పార్టీలో భవితవ్యంలేదని నిర్ధారించుకొన్న ప్రజా ప్రతినిధులంతా నాయకత్వం దన్ను ఉన్న రోశయ్యకు సహాయనిరాకరణ చేస్తే వచ్చే ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్లు కూడా దక్కవన్న భయాన్ని ప్రకాశం జిల్లా జగన్‌ ఓదార్పు యాత్ర సందర్భంగా స్వయంగా గ్రహించారు.

జగన్‌ ఓదార్పు యాత్రకు వెళ్లవద్దని అధిష్ఠానం స్వయంగా చెప్పడంతో ప్రకాశంజిల్లా ఎమ్మెల్యేలలో ఇద్దరు తప్ప మిగిలిన వారంతా జగన్‌ యాత్రకు ముఖం చాటేసిన విషయం తెలిసిందే. జగన్‌తో ఉంటే భవిష్యత్తులేదని అధిష్ఠానం విస్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో, అంతకు ముందు జగన్‌కు మద్దతు దార్లుగా ఉన్న ప్రజాప్రతినిధులు తమ రాజకీయ భవిష్యత్తు కోసం రోశయ్యను బలోపేతం చేస్తున్నారు. ఇక పాలనా పరంగా కూడా రోశయ్య పట్టుబిగుస్తున్నారు.

అనారోగ్యం నుంచి కోలుకున్న తరువాత పూర్తిస్థాయిలో ప్రభుత్వ శాఖల సమీక్షలు నిర్వహిస్తున్నారు. బదిలీలు, ప్రాధాన్యతా రంగాలకు నిధుల కేటాయింపులు వివిధ శాఖలలో ఖాళీల భర్తీలపై ఆయన దృష్టి సారిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, నియామకాలు ప్రకటిస్తు న్నారు. కీలకమైన వివాదాలను కూడా ఆయన చాక చక్యంగా పరిష్కరిస్తూ అధిష్ఠానం ప్రశంసలు అందుకొంటున్నారు.

సర్కార్‌ను అతలాకుతలం చేసిన హైకోర్టు న్యాయవాదుల ఆందోళనను సమర్థవంతంగా పరిష్కరించి తానేమిటో, తాన రాజకీయ అనుభవం ఏమిటో చాటారు. ఆంధ్ర-తెలంగాణకు 40 చొప్పున, రాయలసీమకు 20శాతం స్టాండింగ్‌ కౌన్సెల్‌, ఏజిపి, జిపి పోస్టులను ప్రాంతాల వారీగా విభజించి, ఆ సమస్యను అత్యంత సమర్థవంతంగా పరిష్కరించారు. ప్రాణహిత పుష్కరాలు, బతుకమ్మ జాతర వంటి సాంస్కృతికపరమైన అంశాలలో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా...ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి ప్రాంతీయ అభిమానాలు ఉండవని, అన్ని ప్రాంతాలు సమానమేనని చాటిచెప్పి ‘‘తాను ప్రాంతాలకు అతీతుడినినని’’ రుజువు చేసుకొన్నారు. ఇన్ని కీలకమైన వివాదాలు పరిష్కరించి ‘‘రోశయ్య సుప్రీం’’ అనిపించుకొన్నారు.

తగ్గిపోయిన ధిక్కార ధోరణి
రోశయ్య సుప్రీంగా మారుతున్న తీరుతో మంత్రులు సైతం తమ దిక్కారధోరణీ, వ్యవహార శైలినీ మార్చుకొని ఆయనకు పూర్తి విధేయతను ప్రదర్శిస్తున్న తీరు అందరినీ ఆకట్టుకొంటోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఎవరి ఇష్టంవారిదని ముఖ్యమంత్రి స్పష్టంచేసినప్పటికీ, తెలంగాణకు చెందిన పన్నెండు మంది మంత్రులు మాత్రం అవతరణ దినోత్సవాలలో పాల్గొం టామని స్పష్టంచేయటం రోశయ్యకు పూర్తిస్థాయిలో విధేయత ప్రదర్శించటంగానే స్పష్టమవుతోంది.

డిసెంబర్‌ పరిణామాలకు సిద్ధం
ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్న ముఖ్యమంత్రి డిసెంబర్‌ అనంతర పరిణా మాలకు సిద్దంగానే ఉన్నారు. కేంద్రం నుంచి పారా మిలటరీని పిలిపిస్తున్నారు.శాంతి భద్రతల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని, అందులో రాజకీయ నేతల ప్రమేయాన్ని సహించవద్దని డిజిపికి ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. డిసెంబర్‌ అనంతర పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించటం, కఠి నంగా అణిచివేయటం ద్వారా తాను బలమైన ముఖ్యమంత్రినన్న సంకేతాలు పంపేందుకు రోశయ్య సిద్దమవుతున్నారు.

Wednesday, October 27, 2010

ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్యకు గుదిబండలు

roshaiah
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు చాలా మంది మం త్రులు గుదిబండలుగా పరిణమించారు. సగానికిపైగా మం త్రులు క్రియాశీలరాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తూ ముఖ్యమంత్రిపై పనిభారం మరింత పెంచుతున్నారన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలనుంచే వినిపిస్తు న్నాయి. సచివులు ఏదో మొక్కుబడి కోసం పనిచేస్తున్నారే తప్ప, ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడే ఉద్దేశం ఏ కోశానా లేదన్న విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండుసార్లు మంత్రిపదవులు చేసిన వారు, అంతకన్నా మించి పనిచేసిన వారే నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తుండటంపై విస్మయం వ్యక్త మవు తోంది. దీనివల్ల.. ఈ మంత్రివర్గం రోశ య్యకు గుదిబండలా మారిందని, ప్రక్షా ళన చేస్తే తప్ప ప్రయోజనం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రోశయ్య ముఖ్య మంత్రిగా పదవీ బాధ్య తలు స్వీకరించినప్పటి నుంచి వైఎస్‌ క్యాబినెటే ఇంకా కొనసాగుతోంది. వారిలో ఒక్క కొండా సురేఖ మినహా, మిగిలిన వారంతా పాతవారే ఉన్నారు. రోశయ్య సీఎం అయిన దాదాపు ఎనిమిది, తొమ్మిది నెలల వరకూ మంత్రులు మంత్రివర్గ సమావేశాల్లోనే నాన్‌ సీరియస్‌గా వ్యవహరించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అన్ని వైపుల నుంచి ఎదువుతున్న విమర్శలను తిప్పికొట్టి ఎదురుదాడి చేయడంలో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన మంత్రులంతా విఫలమయ్యారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. చాలామంది మంత్రులు ఇప్పటికీ జగన్‌ నామస్మరణ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్వయంగా ప్రతి పక్షంపై విరుచుకుపడి, తనపై విమర్శలు వస్తుంటే ఎదురు దాడి చేయవలసిన బాధ్యత మీకు లేదా అని పదే పదే అభ్య ర్థించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. దానితో అప్పటి కప్పుడు నలుగురైదుగురు మంత్రులు మీడియాను పిలిచి, హడావుడి చేయడం, ఆ తర్వాత మాయమవడం ఆనవాయితీగా మారింది. మళ్లీ పిలిచి ఆగ్రహంవ్యక్తం చేస్తే తప్ప మంత్రులెవరూ కనిపించడం లేదు. శాఖల వారీగా తలెత్తుతున్న రోజువారీ సమస్యలపై కూడా మంత్రుల నిర్లిప్త వైఖరి ముఖ్య మంత్రిని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. తమ శాఖ సమస్యలు పరిష్కరించుకోవాల్సిన మంత్రులే సీఎంపైనే భారమంతా నెట్టి.. వారు జారు కోవడం ఇటీవలి కాలంలో తరుచుగా జరగడంతో.. ముఖ్యమంత్రి సదరు మంత్రుల తీరుపై బాహాటంగా అసహనం వ్యక్తం చేయడం, వెటకార ధ్వని వచ్చేలా వ్యాఖ్యానించడం చేస్తు న్నా మంత్రుల పనితీరులో మార్పు కనిపించడం లేదంటున్నారు. ఈరకంగా వ్యవహరిస్తున్న మంత్రుల సంఖ్య రోశయ్య కేబినేట్‌లో సగానికిపైగానే ఉండడంతో.. వారిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి నెలకొంది.

పెద్దాయనకు పెను సమస్యలు
రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలతో ప్రతిపక్షాలు రోశయ్య ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. వరద ల్లో వైఫల్యం, విత్తనాల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యం, నిత్యావసర ధరలు, నకిలీ విత్తనాలు, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు డిమాండ్లు, తెలంగాణ న్యాయవాదుల పోరాటం, సోంపేటలో రైతులపై కాల్పులు, మైక్రోఫైనాన్స్‌ ఆగడాలు తదితర సమస్యలు ప్రత్యక్షంగా రోశయ్య సర్కారును, పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీనీ అప్రతిష్ఠ పాలు చేశాయి. వీటిపై విపక్షాలు విరుచుకుపడినా మం త్రులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్‌, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, శ్రీధర్‌బాబు, చీఫ్‌ విప్‌ మల్లు భట్టి విక్రమార్క, విప్‌ శైలజానాధ్‌ వంటి కొందరు మాత్రమే విపక్షాలపై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తుంటే.. మిగిలిన వారంతా పత్తా లేకుండా పోయారు.

చివరకు రోశయ్య తర్వాత సీనియర్‌ మంత్రి అయిన గీతారెడ్డి సైతం ఈ విషయంలో వెనుకబడిపోయారన్న విమర్శలు వినవ స్తున్నాయి. స్వయంగా శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తోన్న గీతారెడ్డి పాత్రికేయులతో సత్సంబంధాలు నెరపడంలో సైతం విఫలమవుతున్నారన్న వ్యాఖ్యలు మిగిలిన సహచర మంత్రుల్లో వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఒక్క గీతారెడ్డి మాత్రమే కాకుం డా మిగిలిన మంత్రులు కూడా పాత్రికేయులతో సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయని, వైఎస్‌ ఉండగా, మంత్రులు వారితో సన్నిహిత సంబంధాలు నెరిపేవారని పార్టీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. మంత్రులు వట్టి వసంతకుమార్‌, ముఖేష్‌, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి, జూపల్లి, శిల్పా మోహన్‌రెడ్డి, బాలి నేని వంటి మంత్రులు మీడియాకు దూరంగా ఉంటారన్న విమర్శ ఉంది.

అసలు మీడియా విషయంలో గతంలో వైఎస్‌ అనుస రించిన వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని కొందరు, ఇందులో ముఖ్యమంత్రి తప్పిదం కూడా ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తు న్నారు. కేవలం కొన్ని పత్రికలకే దగ్గరకావడంతో మిగిలిన వారం తా దూరమవుతున్నారని, వైఎస్‌ జీవించిన సమయంలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదని ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. స్వయంగా సీఎం హాజరయిన సమావేశాలకు సైతం మంత్రులు ఆలస్యంగా హాజరవుతున్న వైచిత్రి. సోమవారం జరిగిన ఒక సదస్సుకు రోశయ్య వచ్చిన ముప్పావుగంట తర్వాత గీతారెడ్డి హాజరుకావడం తెలిసిందే. వైఎస్‌ జీవించి ఉండగా ఈవిధంగా ఎప్పుడూ జరిగేది కాదని, మంత్రులు ఇలాంటి క్రమశిక్షణారాహి త్యానికి పాల్పడేందుకు సాహసించేవారుకాదంటున్నారు.

తాజాగా డిఎస్సీ, బీఎడ్‌ టీచర్ల పోరాటంతో సదరు శాఖ మంత్రి తీరుతో ముఖ్యమంత్రికి మరింత అసహనం కలిగించింది. గత ఏడాదిగా వివిధ అంశాలపై మంత్రుల వ్యవహారశైలి, వారు స్పందిస్తున్న తీరుపై సీఎం మంత్రి వర్గ సమావేశంలోనే వారికి ప్రత్యేకంగా క్లాస్‌ తీసుకుంటున్నారు. సొంత శాఖలపైనా పట్టు సాధించకుండా, సొంత నిర్ణయాలు తీసుకోకుండా వాటిని కూడా తనపైకే నెట్టివేయటంపై రోశయ్య బాహాటంగానే తన అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా రాష్ట్రంలో ప్రభుత్వం పనితీరు, పార్టీ రాజకీయ భవిష్యత్తు తదితర అంశా లపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, ప్రభుత్వం-పార్టీ పనితీరుపై తన అసంతృప్తిని రోశయ్య ముందే వ్యక్తం చేయగా.. అదే విషయాన్ని ఆయన ఢిల్లీ పర్యటన అనంతరం జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ మంత్రులకు ప్రత్యేకంగా హితబోధ చేసి నట్లు తెలిసింది.

చివరకు... ప్రతిష్ఠాత్మకంగా జరిగిన తెలంగాణ ఉప ఎన్నికల్లో సైతం మంత్రులు బాధ్యతారాహిత్యంగా, టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే తమ కు తెలంగాణకు ప్రాధాన్యం ఉంటుందన్న ధోరణి ప్రదర్శించడం పై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలి సిందే. మం త్రులు సైతం రెండు ప్రాంతాలుగా విడిపోవడం, ఒక ప్రాంతానికి చెందిన మంత్రులు మరో ప్రాంతానికి వెళ్లకపోవడం, అంతర్గత కలహాలు, నిధుల విడుదలలో జాప్యం వంటి అంశాలు రోశయ్య ప్రభుత్వానికి అప్రతిష్ఠగా పరిణమించాయి.

ప్రధానంగా.. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన అంశా లపై జగన్‌కు చెందిన పత్రికలో వస్తున్న వార్తా కథనాలు రోశయ్య ప్రభుత్వంపై మహిళల్లో వ్యతిరేకంగా మారాయన్న వ్యాఖ్యలు మంత్రుల్లో వినిపిస్తున్నాయి. జగన్‌కు సన్నిహితుడయిన మంత్రి సహకారం లేకపోతే ఈ వార్తలు రావన్న అభిప్రాయం సీఎం సన్నిహిత వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మార్‌ కుంభకోణంలో తెరవెనుక సూత్రధారి అయిన పెద్దగద్ద సలహాదారును రక్షిం చేందుకు.. ఆ సంస్థపై విచారణకు మంత్రులే మోకాలడ్డిన వైనం విమర్శలకు గురయింది.

Tuesday, October 26, 2010

విడిపోవలసివస్తే, స్నేహితుల్లా విడిపోదాం, బహిష్కరణ పిలుపుతో జటిలం చేయవద్దు, రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ అవతరించిననాటినుంచి రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని, అందువల్ల బహి ష్కరించే ఆలోచనను పునరాలోచించుకోవాలని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తెలంగాణావాదులకు పిలుపు ఇచ్చారు.

రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో పాల్గొనడం ఇష్టం లేకపోతే ఎవరినీ బలవంతం చేయం అని స్పష్టం చేస్తూ.. గతంలో కూడా ఎన్నోసార్లు రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోవలసి వస్తే స్నేహితులుగానే విడిపోవాలి, ప్రతి విషయాన్ని జటిలం చేయవద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి సమైక్యంగా ఉన్నాం కాబట్టి ఉత్సవం చేసుకుంటున్నామని ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి మంగళవారంనాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫ్రీ జోన్ విషయమై కె.సి.ఆర్. తమ ఇంటిముందు ధర్నా చేస్తాననడాన్ని ప్రస్తావిస్తూ కె.సి.ఆర్. తమ ఇంటికి వస్తే మంచిమర్యాద చేస్తామని చెప్పారు. ఫ్రీ జోన్ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని, అందువల్ల ఒక పార్లమెంటు సభ్యునిగా కె.సి.ఆర్. వచ్చే నెల 9న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పుడు తమ వంతు కృషి చేయాలని రోశయ్య విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, నేనో సైనికునిలా పని చేస్తానని ఆయన చెప్పారు.

మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ మీకున్నంత పరిజ్ఞానం నాకు ఉండదని ముఖ్యమంత్రి చెప్పారు. ఏదో పొరపాటునో, గ్రహపాటునో ముఖ్యమంత్రిని అయ్యాను అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
గ్రహపాటో.. పొరబాటునో.. ముఖ్యమంత్రినయ్యా...
Rosaiah1
ఆంధ్రప్రదేశ్‌ అవతరించి ననాటి నుంచి రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని, సంయుక్త రాష్ట్రాంగా ఉన్నంత వరకు అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని, దీన్ని బహిష్కరించడం సరియైనది కాదని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. ఈ దినోత్సవాన్ని బహిష్క రణ ఆలోచనను పునరాలోచించుకోవాలని తెలంగాణ వాదులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో ని సీఎం కార్యాలయం ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో పాల్గొనటం ఇష్టం లేకపోతే ఎవరినీ బలవంతం చేయమని ఆయన స్పష్టంచేస్తూ గతంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ ఉత్స వాల్లో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసీఆర్‌ పాల్గొన్నారన్నారు. అయితే రాష్ట్రం విడిపోవలసివస్తే స్నేహితులుగానే విడిపో వాలన్నారు. ప్రతివిషయాన్ని సమస్యగా మలచి జటిలం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నంతకాలం అవతరణ వేడుకలను నిర్వహిస్తామని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఫ్రీజోన్‌ విషయమై కెసీఆర్‌ తన ఇంటిముందు ధర్నా చేస్తాననడాన్ని సీఎం ప్రస్తావిస్తూ కేసీఆర్‌ తన ఇంటికి వస్తే సాదరంగా ఆహ్వా నించి మర్యాదచేస్తానని చెప్పారు.

ఫ్రీ జోన్‌ విషయమై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని, దీనిపై పార్ల మెంట్‌ సభ్యుడిగా కేసీఆర్‌ వచ్చే పార్లమెంటు సమావేశా ల్లో బిల్లు ఆమోదానికి కృషి చేయాలన్నారు. హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అంశంపై అందరినీ ఢిల్లీ తీసుకువెళ్ళాలన్న కేసీఆర్‌ డిమాండ్‌ ఆర్థ రహితమని ముఖ్యమంత్రి ఆన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, నేనో సైనికునిలా పనిచేస్తానని ఆయన చెప్పారు.

మీడియాపై రుసరుసలు...
డీఎస్సీ-2008 నియామకాలపై అడిగిన ప్రశ్నకు అందుకు సంబంధించిన ఫైలుపై 5 నిముషాల్లో సంతకం చేసి సంబంధిత మంత్రికి పంపామన్నారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఇటీవల జరిగిన ఆందోళనలపై మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రిని అడగగా అన్నీ విషయాలు నాకెలా తెలుస్తాయి, అన్నింటికీ నెనెందుకు సమాధానం చెప్పాలని ఒకింత అసహనం వ్యక్తంచేశారు. అంతేకాకుండా మీకున్నంత పరిజ్ఙాతం నాకు ఉండదని, ఏదో పొరబాటునో, గ్రహబాటునో ముఖ్యమంత్రిని ఆయ్యానంటూ ఫింగర్‌ప్రింట్స్‌పై అన్ని విషయాలుంటాయా? అని ముఖ్యమంత్రి రోశయ్య అసహనం వ్యక్తం చేశారు.

నేనూ సామాన్య భక్తుడినే..
కాగా పాలకొల్లు ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా నా ఫోటోను కలియుగ దైవం వెంకటేశ్వరునిగా చిత్రీకరించి, బ్యానర్లు పెట్టడంపై ముఖ్యమంత్రి స్పందించారు. వెంకటే శ్వరస్వామి ఆభరణాల మధ్య తన బొమ్మను పెట్టడం మంచిదికాదని, ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యే ఉషా రాణి ఈ విధంగా చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి నైనా నేనూ ఆ దేవ దేవునికి సామాన్య భక్తుడినేనని, దేశం లో, రాష్ట్రంలోగాని ఎక్కడైనా తన అభిమానులు భవిష్యత్తులో ఇటువంటి పనులు చేయవద్దని రోశయ్య విజ్ఞప్తి చేశారు.

Monday, October 25, 2010

మంత్రులపై 'రోష'య్య ! * స్వీయ నిర్ణయాలు తీసుకోకపోతే ఎలా?

సిఫార్సు చేయకుండా నాపై తోసేయడం సబబేనా?
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయరా?
పలువురు మంత్రుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి, ఆగ్రహం

 కొంతమంది మంత్రులు తమ తమ శాఖలనే పట్టించుకోవడం లేదు. మరికొందరు విధాన నిర్ణయాల విషయంలో చేతికి మట్టి అంటకుండా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలనే ధిక్కరిస్తుంటే.. మరికొందరు స్వీయ నిర్ణయాలు తీసుకోకుండా భారం మొత్తం సీఎంపైనే వేసేస్తున్నారు.

కానీ, సదరు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం లేదు. ఈ నేపథ్యంలోనే, మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రోశయ్య తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వీయ నిర్ణయాలు తీసుకోకుండా తనపైనే బాధ్యతలను నెట్టేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

శాఖాపరంగా పత్రికల్లో వస్తున్న కథనాలపై మంత్రులు సమష్టిగా స్పందించడం లేదని మంత్రివర్గ సమావేశాల్లో తరచూ ఆయన ఆగ్రహిస్తున్నారు కూడా. అధిష్ఠానం అంటే తనకు తెలియదని, తనకు తెలిసిన అధిష్ఠానం వైఎస్సేనని ప్రకటించి తూర్పు గోదావరి జిల్లాలో కడప ఎంపీ జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్న మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ వ్యవహార శైలిపై సీఎం అసంతృప్తితో ఉన్నారు.

ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దన్న అధిష్ఠానం ఆదేశాలను ముఖ్యమంత్రి స్వయంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలిపారు. అయినా.. తాను బంధుత్వానికే విలువ ఇస్తానంటూ ఆయన యాత్రలో పాల్గొన్నారు. ఆయన వ్యవహారంపైనా సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇక, ఎరువుల సరఫరా విషయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో మంత్రి రఘువీరారెడ్డి స్పందించిన తీరు పట్ల సీఎం సంతృప్తి చెందలేదు.

ఈ విషయమై మంత్రి బొత్సతోపాటు పలువురు మంత్రులు మంత్రివర్గ సమావేశంలో రఘువీరాతో వాగ్వాదానికి దిగినా ఏమీ మాట్లాడకుండా సీఎం మౌనం దాల్చడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఉపాధి హామీ పథకం పనులు, మహిళా స్వయం సహాయక బృందాలకు పరపతి లభించడంపై కడప ఎంపీ జగన్‌కు చెందిన దినపత్రికలో కథనాలు రావడం పట్ల సంబంధిత మంత్రి వట్టి వసంతకుమార్‌పై కూడా మంత్రివర్గ సమావేశంలో రోశయ్య అసంతృప్తి వ్యక్తం చేశారన్న ప్రచారం ఉంది.

'సాయంత్రం నువ్వు జగన్‌ను కలుస్తావు. మర్నాడు ఆయన పత్రికలో కథనాలు వస్తాయి' అని వ్యాఖ్యానించారని సమాచారం. అలాగే, ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో 42 శాతం వాటా అమలయ్యేలా కృషి చేస్తామంటూ ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రాంత న్యాయవాదులకు ఇచ్చిన హామీ ఏమైందని మంత్రి గీతారెడ్డిని సీఎం ప్రశ్నించారని తెలిసింది.

డీఎస్సీ-08 నియామకాల విషయంలో శాఖాపరంగా సిఫార్సు చేయకుండా సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రకటించిన మాణిక్యవరప్రసాద్‌పైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో తెలంగాణకు 42 శాతం వాటాపై ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు.

గత మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. దానిపై దృష్టిసారించాలని గీతారెడ్డికి సూచించారు. ఇచ్చిన బాధ్యతలను వెంటనే పూర్తి చేయాలని మంత్రుల ఉప సంఘానికి హితవు పలికారు. మంత్రివర్గ సమావేశం జరిగి రోజులు గడుస్తున్నా దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే, తనను కలిసిన గీతారెడ్డితో సీఎం రోశయ్య ఆ అంశాన్ని ప్రస్తావించారు.

'తెలంగాణ న్యాయవాదుల సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆచరణకు నోచుకోలేదు. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వచ్చేస్తోంది. ఆ సమయానికి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే ఏం బాగుంటుంది? దీనిపై వారు నిలదీస్తే ఏమని సమాధానం చెబుతారు?' అని కాస్త ఆగ్రహంతో ప్రశ్నించారు.

సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని ఉన్నా వీలు చిక్కడం లేదని, రెండు రోజుల్లో దానిపై ఓ సిఫార్సు చేస్తామని గీతారెడ్డి జవాబిచ్చారు. 'తెలంగాణ న్యాయవాదులతో సమావేశం జరిపిన రోజే సమయం లేదని చెబితే.. ఆ బాధ్యతను మరొకరికి అప్పగించేవాళ్లం కదా' అని సీఎం ప్రశ్నించారు. ఈ అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

ఇక, తనను కలవడానికి మంత్రి మాణిక్యవరప్రసాద్ వచ్చిన సందర్భంలో.. "ఏమిటీ మీరొక్కరే వచ్చారు? డీఎస్సీ-08 ఫైలు ఏదీ!? అధికారులు రాలేదా?'' అని రోశయ్య నిలదీశారు. న్యాయపరమైన అంశాలు మిళితమై ఉన్న ఈ వ్యవహారంలో సీఎం నిర్ణయం తీసుకుంటారంటూ తనపై వదిలేయడమేమిటని ప్రశ్నించారు. దీంతో "ఇది చాలా కీలకమైన అంశమైనందున ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని చెప్పాను' అని మంత్రి వివరణ ఇచ్చారు.

అయితే, అధికారులతో కలిసి ప్రభుత్వపరంగా ఎటువంటి ఆదేశాలు జారీ చేయాలో సూచించాలని రోశయ్య చెప్పారు. దీంతో మంత్రి వెంటనే సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో, వివిధ సందర్భాల్లో మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి.. భవిష్యత్తులో ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపడతారా!? లేదా? అన్న చర్చనీయాంశంగా మారింది.

చీకూ చింతా లేని పాలన అంటే ఇదేనేమో!

లక్కీ సీఎం
cm-laguh
కాడి కట్టలేదు... మేడి పట్టలేదు... రిజర్వాయర్ల నిండుగా నీళ్ళు, భాం డాగారాల-నిండా ధాన్యరాశులు ఇంతకంటే ఎవరికైనా ఇంకేం కావాలి? అం దుకే అయన్ను అందరూ లక్కీ సీఎం అంటున్నారు. గతంలో రాష్ట్రానికి ముఖ్య మంత్రులుగా పనిచేసినా వారంతా ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమత మైనవారే. రాష్ట్ర ప్రజలు కూడా అటు కరువులో ఇటు వరదలతోనోగుడ్లు తేలేసే వారు. ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం అందుకు పూర్తి విరుద్ధ్దం. మంత్రి వర్గాల్లో పనిచేసిన అనుభవతం తప్ప మరేమీ లేని రోశయ్యకు ముఖ్యమంత్రి పదవి అయాచితంగా కలిసివచ్చినట్టుగానే వాతావరణ పరిస్థితులు కూడా అం తకు మించి అనుకూలిస్తున్నాయి. చిన్నా చితకా సమస్యలు ఇక ముఖ్య మం త్రులు ఎవరన్న దానితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ ఉండేవే అంటున్నారు.

వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న రాష్ట్రంలో ఈసారి సకాలంలో సాధారణ స్థాయికి మించి 30శాతం అధికంగానే వర్షాలు కురుస్తూ వచ్చాయి. జూన్‌ ప్రారంభం నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే నాటికి సాధారణ వర్షపాతం 617.7 మిల్లీమీటర్లు కాగా, 803.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది కూడా అన్ని జిల్లాల్లో అదను పదునుకు తగ్గట్టు కువరటంతో ఏరువాక మంచి జోరు మీద సాగింది. కరువు అన్న పదం ఈసారి రాస్ట్రంలో ఏ జిల్లాలోనూ విని పించకుండా పోయింది. ఖరీఫ్‌ పంటల సాగు సాధారణ విస్తీర్ణానికి మించి రికార్డు స్థాయిలో అయింది.

73.83 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సిన పం టలు సాధారణస్థాయికి మించి 83.27లక్షల హెక్టార్లలో సాగు కావటం రాష్ట్ర చరిత్రలోనే కొత్త రికార్డుగా వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. వరి నాట్ల ప్రారంభ దశలో యూరియా కొరత ఎదురైనా, ప్రభుత్వ ప్రమేయం అంతగా లేకుండానే సమస్య సర్దుకుంది. మరో వారం పది రోజుల్లో ఖరీఫ్‌ పంట కోత లు ప్రారంభం కానున్నాయి. పంట దిగుబడి కూడా రికార్డు స్థాయిలోనే ఉండ బోతోందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి.

28 లక్షల హెక్టార్లలో సాగ యిన వరి సాగు ద్వారానే 140 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశం లోనే అంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణగా తన స్థాయిని పదిలం చేసుకోనుందంటు న్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సైతం రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తులపై ప్రభుత్వ కృషిని ప్రశంశించటం గమనార్హం. ధాన్యం నిల్వలు దాచేందుకు గిడ్డంగుల సమస్య కేంద్ర ప్రభుత్వాన్నే కదిలించగలిగేంతగా ఉందంటే ముఖ్యమంత్రి రోశ య్య హయాంలో రాష్ట్ర వ్యవసాయరంగం అభివృద్ధిని చెప్పకనే చెబు తోందంటున్నారు.

ధీమాగా రబీ సాగు: రాష్ట్రంలో ప్రధాన జలాశయాలన్నీ వరదనీటితో తొణ ికిసలాడుతున్నాయి. ఖరీఫ్‌ పంటలకు సాగునీటి అవసరం తీరిపోవటంతో ఇక రబీ పంటల సాగుకు ఢోకా ఉండదని జలాశయాల్లో నిలువ ఉన్న నీరు భరోసా ఇస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, సోమశిల, శ్రీరాంసాగర్‌ తదితర ప్రధాన జలాశయాల్లోకి ఇంకా ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలతో వరద ప్రవాహం వస్తూనే ఉంది.ఎన్నడూ నిండని శ్రీరాంసాగర్‌ సైతం గేట్లెత్తుకుని ప్రవహిస్తోంది. మరోవైపు చెరువులు, కుంటల్లో జలకళ తగ్గలేదు. భూగర్భ జలాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి.

చీకూ చింతా లేని పాలన:చీకూ చింతా లేని పాలన అంటే ఇదేనేమో! రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరైనా విపక్షాలు ముప్పుతిప్పలు పెట్టేదాకా వదిలేవి కావు. అయితే అనుకోని పరిస్థితుల్లో అధికారపగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి సందర్భాన్ని బట్టి విపక్షాలే పరోక్షంగా బాసటగా నిలుస్తూ రావ టం ఒకరకంగా రోశయ్యను ఆధికార స్థానంలో బలపడేలా చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ముఖ్యమంత్రులుగా ఎవరున్నా సొంత పార్టీ నుంచే వారికి అస మ్మతి సెగల బుగబుగలు తప్పేవి కావంటున్నారు.

ఈ అంశంలో రాజకీయంగా వైఎస్‌ రాజశేఖరెడ్డికి కూడా మినహాయింపు లేకపోయింది. అయితే ముఖ్యమంత్రి రోశయ్యకు అటువంటి ఇబ్బందులేవీ లేవంటున్నారు. కడప ఎంపీ జగన్‌కు ముఖ్యమంత్రి పీఠంపై కోరికే తప్ప రోశయ్య మీద వ్యక్తి గత ద్వేషమేదీ లేదంటున్నారు. అటు కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ కూడా రోశయ్య విషయంలో ఉన్నంత సాప్ట్‌కార్నర్‌ ఇదివరకటి వారిపై ఉండేది కాదంటున్నారు. తాత్విక ధోరణి కనబరిచే రోశయ్య అంతటి అదృష్టపు సీఎం ఇంతవరకూ ఎవరూ లేరనే కాంగ్రెస్‌ సీనియర్లు సైతం నొక్కి చెబుతున్నారు.

Saturday, October 23, 2010

చంద్రబాబు తడబాటు



ఈరాష్ట్రాన్ని దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిలో నాయకత్వ పటిమ, దృఢ చిత్తం లోపిస్తున్నదా? వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణం తర్వా త, ఆ స్థాయిలో ఉన్న చంద్రబాబు మరింత బలపడవలసి ఉండగా, రాజకీయ ప్రత్యర్థులకు అలుసుగా ఎందుకు మారుతున్నారు? ఏదో తెలియని ఆరాటంతో వ్యవహరించవలసిన అవసరం ఆయనకు ఏమి వచ్చింది? ప్రస్తుతం ఈ ప్రశ్నలు రాజకీయ పరిశీలకులనే కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ను సైతం వేధిస్తున్నాయి.

ప్రధాని మన్మోహన్‌సింగ్ రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు, ప్రతిపక్షాల తరఫున ఆయన అపాయింట్‌మెంట్ కోరి భంగపడిన చంద్రబాబు, నేరుగా ధర్నాకు నాయకత్వం వహించడమే కాకుండా, ప్రధానిని 'శాడిస్టు'గా అభివర్ణించి, విమర్శల జడివానలో చిక్కుకున్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కావాలంటే ముందుగానే ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించవలసి ఉంటుందని చంద్రబాబుకు తెలియంది కాదు.

తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేయడమే కాకుండా, ఒక దశలో దేశ ప్రధానుల నియామకంలో కీలక పాత్ర వహించిన చంద్రబాబుకు పద్ధతులు తెలియకుండా ఎలా ఉంటాయి! అధికారానికి ఆమడ దూరం లో ఉండే పార్టీలు, అర్ధంతరంగా ప్రధాని అపాయింట్‌మెంట్ కోరి, అది లభించని పక్షంలో ధర్నాలు చేయడం వేరు. ఆయా సందర్భాలలో గొంతెమ్మ కోర్కెలు కోరవచ్చు కూడా! అధికారంలో ఉంటే ఎదురయ్యే సాధకబాధకాలు క్షుణ్ణంగా తెలిసిన చంద్రబాబు ఇలా వ్యవహరించడం, మాటలు తూలడం వల్ల ఆయనే నష్టపోతున్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు పట్ల ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, జాతీయస్థాయిలో ఆయనకు ఇంకా గౌరవం మిగిలే ఉంది. సంస్కరణల పట్ల మక్కువ చూపే ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కూడా చంద్రబాబు అంటే గౌరవం ఉంది. అయితే ఒకప్పుడు తాను జాతీయస్థాయి నాయకుడుగా ఒక వెలుగు వెలిగిన విషయాన్ని చంద్రబాబు మరచిపోవడం విచారకరం. తన స్థాయిని మరచి, చిన్న చిన్న విషయాలలో కూడా ఆందోళనలకు తానే నాయకత్వం వహించాలని, ప్రత్యక్షంగా పాల్గొనాలని ఉబలాటపడటం వల్ల, ఆయన ఇమేజ్ పెరగకపోగా నష్టం జరుగుతున్నది.

ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఆత్మ స్థైర్యం నింపి, ప్రజా సమస్యలపై ఉద్యమాలకు పార్టీ నేతలను కార్యోన్ముఖులను చేయవలసింది పోయి, అన్నీ తానే చేయాలనుకోవడం ఆయన స్థాయి నాయకుడికి తగని పని! ఒకవైపు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం, మరోవైపు కాంగ్రెస్‌తో జత కట్టడానికి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సిద్ధపడడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.పి. జగన్మోహనరెడ్డి జిల్లాల్లో తిరుగుతూ, ప్రజా బలం సమకూర్చుకోవడానికి ప్రయత్నించడం వంటి చర్యల వల్ల చంద్రబాబుకు ఊపిరాడని పరిస్థితి ఉన్న మాట వాస్తవం.

అయితే సమస్యలు చుట్టుముట్టినప్పుడు తొట్రుపాటు పడకుం డా, ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి, ప్రతి వ్యూహాలను రచిం చి, నాయకత్వ పటిమను నిరూపించుకున్న వారే నిజమైన నాయకులు అవుతారు. చంద్రబాబు వ్యవహార శైలి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. మిత్రపక్షాలుగా పేర్కొనవచ్చో లేదో తెలియని స్థితిలో ఉన్న వామపక్షాలకు చెందిన రాష్ట్ర నాయకు లు కూడా, ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వనందుకు నిరసన గా నిర్వహించిన ధర్నాకు దూరంగా ఉంటే, రాష్ట్రంలో ఏకైక నాయకుడుగా నిరూపించుకోవలసిన చంద్రబాబు ఆ ధర్నా లో పాల్గొన్నారు.

అంతేగాకుండా ధర్నాలను నిరోధించవలసి న పోలీసు అధికారులపై చిరాకు పడటం ఆయన స్థాయికి తగని పని. అధికారిక విధులు నిర్వర్తించాల్సిన బాధ్యత పోలీ సు అధికారులపై ఉంటుందన్న విషయం ఒక మాజీ ముఖ్యమంత్రికి తెలియదని ఎలా అనుకోగలం! ఈ ఒక్క సందర్భంలోనే కాదు... గతంలో కూడా ఆయన పోలీసు అధికారులపై విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయ నాయకు లు ప్రజల కోసం నటిస్తారు.

కానీ అధికారం చలాయించిన వారు నటించాలనుకుంటే వారి గౌరవానికే భంగం. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో చురుగ్గా ఉండే వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఒక పర్యాయం అబిడ్స్‌లోని ఎన్.టి.ఆర్. నివాస గృహంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, వరండాలో ధర్నాకు దిగారు. ఆ సమయంలో గండిపేట కుటీరంలో విశ్రాంతి తీసుకుంటున్న (నిద్ర పోతున్న) రామారావు, హుటాహుటిన అబిడ్స్‌లోని తన నివాస గృహానికి తిరిగి వచ్చారు.

ఆయన వచ్చేలోపు పోలీసులు, అతి కష్టం మీద వై.ఎస్.ఆర్.తోపాటు ధర్నాలో పాల్గొన్న శాసనసభ్యుల ను అరెస్టు చేసి పంపించి వేశారు. ఆ తర్వాత... పరిస్థితి అంత దూరం రావడానికి కారకులైన అధికారులపై ఎన్.టి.ఆర్.తోపాటు, అప్పు డు తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉన్న చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో సందర్భంలో... ఎన్.టి.ఆర్. సచివాలయంలోని తన కార్యాలయానికి వెళ్లకుండా, రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్త లు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో ఖిన్నుడైన ఎన్.టి.ఆర్, ఎండలోనే నడిరోడ్డుపై, సచివాలయం ప్రధాన గేటు ఎదురుగా పడుకుని నిరసన తెలిపారు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేయవలసి వస్తున్నదంటే, అధికారానికి దూరంగా ఉన్న రాజశేఖరరెడ్డి అప్పట్లో అలాంటి పనులు చేసినా చెల్లుబాటు అయింది.

కానీ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా చేసి, ప్రతిపక్షంలో ఉండి, ఆ పనులు చేసి ఉంటే కచ్చితంగా అభ్యంతరకరమే అవుతుంది. ఈ వాస్తవాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది. ప్రధానిని దూషించిన చంద్రబాబుపై ముప్పేట దాడి జరుగుతున్నా, మిత్రపక్షాలకు చెందిన వారెవ్వరూ ఆయనకు అండగా నిలవకపోవడం గమనార్హం.

చంద్రబాబు రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకు న్న విషయం వాస్తవమే! అంతమాత్రాన తొట్రుపడుతూ, దృఢ చిత్తాన్ని ప్రదర్శించకపోతే ఆయనకు మరింత నష్టం జరుగుతుంది. ఆచరణలో జరుగుతున్నది అదే! తెలంగాణ అంశాన్నే తీసుకుందాం. డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, రాజకీయంగా తెలంగాణలో తిరుగులేని శక్తిగా అవతరించారు.

అయితే అదంతా ఆయన గొప్ప వల్ల కాదు. కేంద్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయం ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు తెలంగాణలో దెబ్బతిన్నాయి. అయితే తెలంగాణ ఇవ్వడం, ఇవ్వకపోవడం కాంగ్రెస్ చేతిలోనే ఉంది కనుక, ఆ పార్టీ తిరిగి కోలుకునే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవహారంలో అటు కేంద్ర ప్రభుత్వాన్ని గానీ, ఇటు తెలంగాణ ప్రజలను గానీ ప్రభావితం చేయలేని స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అయోమయంలో పడిపోయింది.

తెలంగాణ రాకపోవడానికి చంద్రబాబు ప్రధా న అడ్డంకి అని టి.ఆర్.ఎస్. చేస్తున్న ప్రచారం, ఆ పార్టీని మరింత ఇరకాటంలోకి నెడుతున్నది. తెలంగాణ ప్రజల దృష్టిలో చంద్రబాబును దాదాపు విలన్‌గా చిత్రించడంలో టి.ఆర్.ఎస్. నాయకులు విజయం సాధించారు. దీనితో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకు లు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నా రు. అందువల్లే 'ఢిల్లీలో-జిల్లాల్లో ధర్నా' కోసం గురువారం విడుదల చేసిన కర పత్రాలలో చంద్రబాబు బొమ్మ లేకుండా ఆ పార్టీ నాయకులు జాగ్రత్త తీసుకున్నారు.

ఇది నిజంగా చంద్రబాబుకు అవమానకరమే! అంతమాత్రాన డీలా పడిపోతే ఎవరైనా నాయకుడు ఎలా అవుతారు? తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాం ధ్ర నాయకులు కూడా అడ్డు పడుతున్నారు. కానీ, చంద్రబాబు మాత్రమే అడ్డుపడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిరోధించపోవడం ఆ పార్టీ వైఫ ల్యం. తన పార్టీ శ్రేణులను ఆ మేరకు సన్నద్ధం చేయలేకపోవడం చంద్రబాబు వైఫల్యం.

చంద్రబాబు భవిష్యత్తు సంగతి పక్కనబెట్టి, తమ రాజకీయ భవిష్యత్తుదెబ్బ తినకూడదన్న ఉద్దేశంతో తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని కోరుతూ ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ ఇంటి ఎదుట ఆదివారం నాడు ధర్నా చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

తెలంగా ణ ఏర్పాటు అంశంపై ఇప్పటికే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని నియమించినందున, ఆ కమిటీ నివేదిక వచ్చేవరకు మౌనం గా ఉండాలని నిర్ణయించుకున్న టి.ఆర్.ఎస్. అధినేత కె.చంద్రశేఖరరావు, ఈ వ్యవధిలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఖాళీ చేయడానికి కంకణం కట్టుకున్నారు. తెలంగాణ కు అనుకూలంగా చంద్రబాబు ప్రకటన చేయాలని ప్రతిరోజూ కోరుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు, తమ పార్టీకీ చెందిన సీమాంధ్ర నాయకులు తెలంగాణ కు అడ్డుపడుతున్న విషయం గురించి మాట్లాడరు.

తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కూడా ఈ విషయంపై స్పందించరు. వాస్తవానికి రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీది ఎటువంటి పరిస్థితో, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీది అటువంటి పరిస్థితే! అయినా చంద్రబాబు టార్గెట్ అవుతున్నారంటే రాజకీయాలలో అది సహజం. రాజకీయాల లో ఇందుకు భిన్నంగా జరిగితే ఆశ్చర్యపోవాలి. తెలంగాణ ఏర్పాటుకు అంగీకరిస్తే, టి.ఆర్.ఎస్.తో కలిసినా, కలవకపోయినా తెలంగాణ ప్రాంతంలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుంది.

ఈ కారణంగా సీమాంధ్రలో నష్టం జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఒకవేళ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తే, సీమాంధ్రలో ఆ పార్టీకి ప్రయోజనం చేకూరవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకున్నా, తెలుగుదేశం పార్టీకి చేకూరే ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. తెలంగాణ కోసం ఆ పార్టీకి చెందిన తెలుగుదేశం నాయకులు ఎన్ని వీధి పోరాటాలు చేసినా ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని చెప్పలేం.

ఎందుకంటే తెలంగాణకు సింబల్‌గా కె.సి.ఆర్. ఇదివరకే అవతరించారు. రాష్ట్ర భవిష్యత్తుపై కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి ప్రయోజనం పొందలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. మంచోచెడో ప్రజారాజ్యం పార్టీ సమైక్యాంధ్ర నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిం ది. కాంగ్రెస్‌తో పోల్చితే తనది భిన్నమైన పరిస్థితి అని అంచ నా వేసుకోవడంలో చంద్రబాబు విఫలం అయ్యారు.

సంకట స్థితి ఎదురైనపుడే నాయకుడన్నవాడు స్థిత ప్రజ్ఞత ప్రదర్శించాలి. ప్రత్యర్థుల రాజకీయ ఎత్తుగడలను విశ్లేషించుకుని, ప్రతివ్యూహాలను రచించుకోవడం ఏ రాజకీయ పార్టీకైనా అవస రం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయా రు కాకుండా ఉండాలంటే, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఇప్పటికైనా ఉమ్మడిగా పరిస్థితులను విశ్లేషించుకుని, పద్మవ్యూహం నుంచి బయటపడడం ఎలాగో ఆలోచించుకోవాలి.

ఈ విషయంలో చొరవ తీసుకుంటున్నట్టు కనిపించని చంద్రబాబునాయుడు, కనీసం ప్రజల దృష్టిలో మరింత పలుచన అయ్యే చర్యలకు దూరంగా ఉంటే మంచిది. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఇది అత్యంత గడ్డు కాలం. ఈ గండం నుంచి గట్టెక్కడం అంత సులువైన విషయం కాదు.

అయితే రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కనుక, అవకాశం కోసం ఎదురు చూస్తూ, ప్రత్యర్థుల ఎత్తుగడలకు దీటుగా వ్యూహ రచన చేసుకుని, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం మినహా తెలుగుదేశం పార్టీగానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుగానీ చేయగలిగింది ఏమీ లేదు. చంద్రబాబు ఇందుకు భిన్నంగా తొందరపాటుతో వ్యవహరిస్తూపోతే ఆయనలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయని ప్రజలు కూడా నమ్మే స్థితి వస్తుంది. 

-ఆదిత్య


Tuesday, October 19, 2010

నిండుగా నిర్లక్ష్యం * ‘గోడౌన్ల సమస్య’ సాకుతో పర్మిట్లు ఇచ్చే యోచన

అసలు రోగం ఒకటైతే... చికిత్స మరొకటి
గోధుమలు, ఉప్పుడు బియ్యం నిల్వలతోనే అసలు సమస్య... అడిగేవారు లేక గోదాముల్లో ఉన్న మనకు పనికిరాని నిల్వలను పట్టించుకోని కేంద్ర మంత్రిత్వ శాఖలు
అవకాశాన్ని వాడుకుని సన్నబియ్యం పర్మిట్లకై మిల్లర్ల ఎత్తుగడలు
ఇప్పటికే పూర్తిగా నిండిన గోదాములు... మార్కెట్లోకి రానున్న ఖరీఫ్ ధాన్యం
గోదాముల పరిస్థితి చూసి పట్టు బిగిస్తున్న మిల్లర్లు...
వారికి తలొగ్గి పర్మిట్ల జారీకి సిద్ధమవుతున్న సర్కారు...
పర్మిట్లు ఇస్తే గోదాములు ఎలా ఖాళీ అవుతాయన్నది జవాబులేని ప్రశ్న


ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతు పక్షపాతి, దివంగత నేత వైఎస్ హయాంలో అమలు చేసిన విధానానికి పూర్తి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఒకవైపు రైతులకు సరైన ధర, మరోవైపు వినియోగదారుల ప్రయోజనాల రక్షణనూ ఆలోచించిన వైఎస్ ప్రభుత్వం అప్పట్లో సన్నబియ్యం ఎగుమతులపై పలు ఆంక్షలు అమలు చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల బెదిరింపులకు భయపడి ఆ ఆంక్షల సడలింపునకు సిద్ధమవుతోంది. ఎలాగైనా బియ్యం ఎగుమతికి పర్మిట్లు పొంది భారీగా గడించాలనే వ్యూహంతో, ముమ్మరంగా యార్డులకు ధాన్యం రాబోతున్న కీలక తరుణంలో కొనుగోళ్లు ఆపేస్తామంటూ మిల్లర్లు హెచ్చరికలకు దిగారు. కొన్ని రాజకీయపక్షాలు కూడా వారికి వంత పాడాయి. దీంతో ప్రభుత్వం కూడా ఆంక్షల సడలింపునకు సిద్ధమవుతోంది. మొన్నటికిమొన్న నెల్లూరు సన్నాల విషయంలో రోజుకోరకం జీవోలు విడుదల చేసి రైతును నిండా ముంచేసిన తీరు ఇంకా మరవకముందే ఆంక్షల ఎత్తివేతకు సిద్ధమవుతోంది. అదేమిటంటే గోదాముల సమస్యను సాకుగా చూపుతోంది. పర్మిట్లు ఇచ్చినా గోదాములు ఖాళీ అవుతాయన్న గ్యారంటీ లేదు. ఇప్పటికే మూలుగుతున్న గోధుమలు, ఉప్పుడు బియ్యం నిల్వలను తరలించేందుకు చర్యలు తీసుకోకుండా పర్మిట్లు ఇచ్చినంతమాత్రాన సమస్య ఎలా పరిష్కారమవుతుందనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు.

ఎక్కడెక్కడి నిల్వలూ రాష్ట్రంలోనే!

రాష్ట్రంలో ఎఫ్‌సీఐ, వివిధ విభాగాలకు చెందిన గోడౌన్ల నిల్వ సామర్థ్యం 36 లక్షల టన్నుల వరకు ఉంది. ఇందులో ఇప్పటికే 33 లక్షల టన్నుల ధాన్యం, గోధుమల నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఇందులో రాష్ర్టంలో ఉపయోగించని, ఇక్కడ పండని గోధుమలు 2-3 టన్నులు కాగా, ఉప్పుడు బియ్యం ఏకంగా 21 లక్షల టన్నులు మూలుగుతున్నాయి. ఇవి మన అవసరాలకు ఉపయోగపడవు. అలాగని వీటిని తరలించడానికి ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు. వివిధ ఆపదల సమయాల్లో ఇతర దేశాలకు చేసే సహాయం కింద ఆహారధాన్యాల నిల్వలను కూడా కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి తరలించిందే తప్ప... మన రాష్ట్రంలో నిల్వ చేసిన ఉప్పుడు బియ్యాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ర్ట ప్రభుత్వం గట్టిగా కోరితే ఉప్పుడు బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించే అవకాశం ఉండేది. కానీ ఈ విషయంలో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకురావడంలో రాష్ర్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో గోదాములనిండా ఉప్పుడు బియ్యమే మూలుగుతోంది.

ఈసారి ఖరీఫ్, రబీలో అధిక దిగుబడులు వస్తాయని తెలిసినా ఈ నిల్వల తరలింపుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఫలితంగా ఈ బియ్యం ఇక్కడ నిల్వ ఉన్నంత కాలం గోదాముల సమస్య ఇలాగే కొనసాగనుంది. ఆహార ధాన్యాల నిల్వల తరలింపునకు సరిపడా రైల్వే ర్యాకులను తీసుకురావడంలోనూ కొంత వైఫల్యం కనిపిస్తోంది. సరిపడా ర్యాకులను తెప్పించగలిగామని ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నా, అంతగా ర్యాకులు వచ్చి ఉంటే ఇప్పటికే సగం నిల్వలు ఖాళీ అయ్యేవని ఎఫ్‌సీఐ వర్గాలే పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రం వద్ద గట్టిగా ప్రయత్నించగల నేత లేకపోవడంతో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ ఈ విషయాల్లో నిర్లక్ష్యాన్ని కనబరిచాయి. మన ఉన్నతాధికారులు సైతం సీఎంతో కొన్ని లేఖలు కేంద్రానికి పంపించి, అదే సరిపోతుందనుకుని మిన్నకుండిపోయారు. ఫలితంగా ర్యాకులు రాక ఎక్కడి నిల్వలు అక్కడే ఉండిపోయాయి.

ఇదే అదునుగా మిల్లర్లు..!
గోదాముల్లో ఖాళీ లేకపోవడాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుని పర్మిట్లు సాధించేందుకు మిల్లర్లు ఎత్తుగడ వేశారు. గోదాముల్లో ఖాళీ లేదనే సాకు చూపి కొనుగోళ్ల సమ్మె ప్రకటించారు. ముందుగా ధాన్యం వచ్చే తెలంగాణ మిల్లర్లు ఈ ప్రకటన జారీ చేయగా... అనుకూల నిర్ణయం వస్తే తమకూ మంచిదనే భావనతో ఆంధ్రా మిల్లర్లు కూడా ఇదే డిమాండ్‌ను వినిపించడం మొదలుపెట్టారు. నిజానికి ఒక మిల్లర్ 100 లారీలు లెవీ పెడితే, తనకు ఎగుమతి పర్మిట్లు వచ్చేది కేవలం 25 లారీలకే! అందులోనూ మూడో వంతు మాత్రమే పచ్చిబియ్యం ఉండాలని, మిగతాది ఉప్పుడు బియ్యమైతే అభ్యంతరం లేదని గతంలో పూనం మాలకొండయ్య కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆంక్షలు విధించారు. తద్వారా విలువైన సన్నరకాల బియ్యం రాష్ట్రం నుంచి తరలిపోకుండా జాగ్రత్తపడ్డారు.

ప్రస్తుతం సన్న బియ్యం ధరలు చాలా అదుపులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ బియ్యం ధరలు పెరిగితే కిలోకు 21 చొప్పున తాము ఎంత బియ్యమైనా మార్కెట్‌లో అమ్ముతామని చెబుతూ మిల్లర్లు ఒకరిద్దరు రాజకీయ నేతల మద్దతు కోసం ప్రయత్నించారు. నిజానికి ఉప్పుడు బియ్యం ఎగుమతికి మిల్లర్లకు పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చినా అది ఎవరికీ నష్టం కలిగించదు. రైళ్లు, ఓడల ద్వారా ఎగుమతికి అవకాశం కల్పించినా మంచిదే. కానీ ఈ ముసుగులో సన్నరకాల బియ్యానికి రోడ్డు మార్గంలో (లారీల్లో...) పర్మిట్లు పొందాలనేది మిల్లర్ల ఎత్తుగడ. గతంలో ఇలా పర్మిట్లు పొంది భారీగా కాండ్లా రేవుకు తరలించి, అక్కడ్నుంచి విదేశాలకు అమ్మారని ప్రభుత్వమే ఒక దశలో నిర్ధారించుకుని భారీగా మిల్లులపై దాడులు చేసి కేసులు పెట్టింది. ఇప్పుడవన్నీ విస్మరించి, మిల్లర్ల హామీలను విశ్వసించి ఆంక్షల సడలింపునకు పూనుకోవడమే విచిత్రం!

నెల్లూరు సన్నాల పేరుతోనూ దోపిడీ!
నల్లమచ్చ పేరిట గత ఏడాది మిల్లర్లు నెల్లూరు సన్నాల ధాన్యాన్ని కొనడానికి ముందుకు రాలేదు. ప్రభుత్వం కూడా పౌరసరఫరాల కార్పొరేషన్, ఎఫ్‌సీఐ ద్వారా కొనిపించాలనే రైతుల డిమాండ్‌ను పక్కనబెట్టి, మచ్చ శాతాన్ని బట్టి ధాన్యం ధరలో కోత పెట్టి మిల్లర్లే కొనుగోలు చేసుకోవచ్చునని జీవో ఇచ్చింది. ఈ వాల్యూకట్ విధానంలో మిల్లర్లు అడ్డగోలు ధరలకు కొన్నాక, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చేయించటానికి అనుకూలంగా మరో జీవో ఇచ్చింది. మిల్లర్లు తమ నిల్వలను ఈ సంస్థలకు అమ్మేసి బాగుపడ్డారు. మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరించే ప్రస్తుత ఉన్నతాధికారుల వైఖరికి ఇదే పెద్ద ఉదాహరణ. కేవలం 25 శాతం పర్మిట్ల కోసం ఎగుమతికి అవకాశాలు ఇస్తే... మొత్తం గోదాముల సమస్య ఎలా పరిష్కారమవుతుందో ఆ అధికారులే చెప్పాలి. కొత్త గోదాముల అవసరాన్ని గతంలోనే వైఎస్ గుర్తించారు. 10 లక్షల టన్నుల సామర్థ్యం గోడౌన్లను నిర్మించాలని అప్పట్లోనే ప్రణాళికను రూపొందించారు. అందుకోసం ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రొత్సహించడానికి తగు చర్యల్ని తీసుకున్నారు. అంతలోనే ఎన్నికలు వచ్చాయి. తర్వాత ఆయన అకాల మృతికి గురయ్యారు. తర్వాత ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.

ఏడాది క్రితమే గోడౌన్ల నిర్మాణాలను చేపట్టినట్టయితే... ఈ పాటికి చాలా వరకు అందుబాటులోకి వచ్చేవి. ఎస్‌డబ్ల్యూసీ గోదాముల నిర్మాణానికి టెండర్లు పిలిచినా ఇప్పటికీ అవి ఖరారు కాలేదు. ఇప్పుడు నిర్మాణాలు ఆరంభించినా ఈ సీజన్‌కు ఆ కొత్త గోదాములు ఏమాత్రం ఉపయోగపడవు. ఉప్పుడు బియ్యం, గోధుమల నిల్వల తరలింపే ప్రస్తుత పరిష్కారం. కానీ దీనికి భిన్నంగా ప్రభుత్వం మిల్లర్ల పాటకు వంత పాడుతూ సమస్యకు పరిష్కారం చూపని పర్మిట్ల జారీకి సంసిద్ధమవుతోంది. ధాన్యం కొనుగోళ్లపై అఖిలపక్షం సమావేశం అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడుతూ అంతా బాగానే ఉందని, గోదాముల సమస్యతో సహా అన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. అలాగైతే బియ్యం ఎగుమతులకు పర్మిట్ల మాటేమిటని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం కొసమెరుపు!!
దాన్యం నిల్వలకు ప్రైవేటు గిడ్డంగులు
 సీఎం రోశయ్య
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఈ ఏడాది ధాన్యం ఉత్పతి అధికంగా వచ్చే అవకాశముందని, ధాన్యం నిల్వల కోసం ప్రైవేటు గిడ్డంగులను కూడా అద్దెకు తీసుకోవాలని ఆదేశించామని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. మార్కెటింగ్, సహకార శాఖలపై సోమవారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యాల నిల్వకు తగిన వసతికోసం గత రెండు మాసాలుగా ప్రభుత్వం కృషి చేస్తూనే ఉందని తెలిపారు. ఎఫ్‌సీఐ, రైల్వే, పౌరసరఫరాల శాఖ, అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్ తదితర శాఖలన్నిటితో సమన్వయం చేస్తూనే ఉన్నామని, మరీ ముఖ్యంగా రైల్వే విభాగాన్ని కనీసం 7 రాక్స్ కావాలని అడిగామని చెప్పారు. అదనపు స్పేస్ కోసం అవసరమైతే ప్రైవేటు గిడ్డంగులను కూడా అద్దె (హైర్)కు తీసుకోవాలని ఆదేశించామని వెల్లడించారు.

రాష్ట్రంలో ఉప్పుడు బియ్యం కూడా అత్యధిక సంఖ్యలో నిల్వ ఉన్నాయని, వాటిని కూడా ఇప్పుడు బయటకు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పి రైతులకు కనీస మద్దతు ధర ఉండేలా చూస్తామని స్పష్టంచేశారు. గోదాముల అద్దె ప్యాకేజీ ఆకర్షించే విధంగా లేదని, ఆ పాలసీని సవరించి, ఆమోదయోగ్య పాలసీని తీసుకురావాలన్న మిల్లర్ల కోరికను కూడా పరిశీలిస్తామన్నారు. ఈ విషయాలన్నిటినీ మంగళవా రం ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని రోశయ్య చెప్పారు.

తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన గిడ్డంగులు: ఖరీఫ్‌తో పాటు రబీలోనూ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుండటంతో రాష్ట్రంలో ధాన్యాల నిల్వలకు గాను తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదిక గిడ్డంగుల ఏర్పాటు చేస్తున్నట్టు మార్కెటింగ్ శాఖామంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ముఖ్యమంత్రి వద్ద సమీక్ష అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది 3 నుంచి 4 శాతం అధికంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని, రానున్న జనవరి నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇక యూనిఫైడ్ కో-ఆపరేటివ్ యాక్ట్
త్వరలోనే సహకార శాఖలో యూనిఫైడ్ యాక్ట్ రానుందని సహకార శాఖామంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సహకారశాఖపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ చట్టంపై ఇప్పటికే డ్రాఫ్ట్ రూపొందించి ముఖ్యమంత్రికి అందజేసినట్టు తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో రికార్డు స్థాయిలో రూ. 2831 కోట్లు రుణాలిచ్చామని, రబీలోనూ రూ. 1885 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈనెలాఖరులోగా చీపురుపల్లి, కుప్పం రెస్కోలకు ఎన్నికలు జరపాలని సీఎం ఆదేశాలిచ్చినట్టు మంత్రి తెలిపారు. ఇకపై రంగారెడ్డి జిల్లా తరహాలోనే రాష్ట్రంలో అన్ని సొసైటీ కార్యాలయాలను కంప్యూటరీకరిస్తామని ఆయన చెప్పారు.

Sunday, October 3, 2010

కలలూ - శిక్ష

తీరని కోర్కెలు కలల రూపంలో వస్తాయంటారు.
కోర్కెలు తీరని వాళ్లు దెయ్యాలై తిరుగుతుంటారంటారు.
ఈ రెండిట్లో మీరు ఏది కావాలనుకుంటున్నారు?

***

ఎసిబి వలలో చిక్కిన అధికారిని చెయ్యి చాపమని చెప్పి అందరూ
చూస్తుండగా చింతబరికెతో ఒక్కటిచ్చింది ఆవిడ.

భూమిని చాప చుట్టి భుజం మీద పెట్టుకుని పారిపోతున్న ఒకాయన్ని నేల
తగలకుండా చెట్టు కొమ్మకు వేళ్లాడగట్టింది.

రాజకీయాటలు ఆడుతున్న వాడ్ని ప్రజాకోట గుమ్మం ముందు నిలబెట్టి
వోటరు కనబడినప్పుడల్లా వందేసి గుంజీలు తీయమంది.

ఎరువులు దాచినవాడిని రచ్చబండ మీదికి పిలిచి చెంప ఛెళ్లుమనిపించింది.
యాసిడ్ బాటిల్ పట్టుకున్నవాడి చేతిని గోడకుర్చీ వేసి కూర్చోపెట్టింది.

కన్నీళ్లు తెప్పించేవాడి ఇంట్లో నీళ్ల కొళాయిని బంద్ చేసింది.
రక్తం కళ్లజూసినవాడి ఒంట్లో హెమోగ్లోబిన్‌ను తగ్గించేసింది.

***

అంటే ఈవిడ మొదటి కోవకు చెందింది. అందుకే కలల్లోనే న్యాయం
వెతుక్కుంటోంది.
రెండో కేటగిరీలో ఇప్పుడు ఎవరికీ చోటు లేదు. అక్కడ ఇప్పటికే కిక్కిరిసి ఉంది.