Monday, October 25, 2010

చీకూ చింతా లేని పాలన అంటే ఇదేనేమో!

లక్కీ సీఎం
cm-laguh
కాడి కట్టలేదు... మేడి పట్టలేదు... రిజర్వాయర్ల నిండుగా నీళ్ళు, భాం డాగారాల-నిండా ధాన్యరాశులు ఇంతకంటే ఎవరికైనా ఇంకేం కావాలి? అం దుకే అయన్ను అందరూ లక్కీ సీఎం అంటున్నారు. గతంలో రాష్ట్రానికి ముఖ్య మంత్రులుగా పనిచేసినా వారంతా ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో సతమత మైనవారే. రాష్ట్ర ప్రజలు కూడా అటు కరువులో ఇటు వరదలతోనోగుడ్లు తేలేసే వారు. ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం అందుకు పూర్తి విరుద్ధ్దం. మంత్రి వర్గాల్లో పనిచేసిన అనుభవతం తప్ప మరేమీ లేని రోశయ్యకు ముఖ్యమంత్రి పదవి అయాచితంగా కలిసివచ్చినట్టుగానే వాతావరణ పరిస్థితులు కూడా అం తకు మించి అనుకూలిస్తున్నాయి. చిన్నా చితకా సమస్యలు ఇక ముఖ్య మం త్రులు ఎవరన్న దానితో నిమిత్తం లేకుండా ఎప్పుడూ ఉండేవే అంటున్నారు.

వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న రాష్ట్రంలో ఈసారి సకాలంలో సాధారణ స్థాయికి మించి 30శాతం అధికంగానే వర్షాలు కురుస్తూ వచ్చాయి. జూన్‌ ప్రారంభం నుంచి ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే నాటికి సాధారణ వర్షపాతం 617.7 మిల్లీమీటర్లు కాగా, 803.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అది కూడా అన్ని జిల్లాల్లో అదను పదునుకు తగ్గట్టు కువరటంతో ఏరువాక మంచి జోరు మీద సాగింది. కరువు అన్న పదం ఈసారి రాస్ట్రంలో ఏ జిల్లాలోనూ విని పించకుండా పోయింది. ఖరీఫ్‌ పంటల సాగు సాధారణ విస్తీర్ణానికి మించి రికార్డు స్థాయిలో అయింది.

73.83 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సిన పం టలు సాధారణస్థాయికి మించి 83.27లక్షల హెక్టార్లలో సాగు కావటం రాష్ట్ర చరిత్రలోనే కొత్త రికార్డుగా వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. వరి నాట్ల ప్రారంభ దశలో యూరియా కొరత ఎదురైనా, ప్రభుత్వ ప్రమేయం అంతగా లేకుండానే సమస్య సర్దుకుంది. మరో వారం పది రోజుల్లో ఖరీఫ్‌ పంట కోత లు ప్రారంభం కానున్నాయి. పంట దిగుబడి కూడా రికార్డు స్థాయిలోనే ఉండ బోతోందని ప్రభుత్వ అంచనాలు చెబుతున్నాయి.

28 లక్షల హెక్టార్లలో సాగ యిన వరి సాగు ద్వారానే 140 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశం లోనే అంధ్రప్రదేశ్‌ అన్నపూర్ణగా తన స్థాయిని పదిలం చేసుకోనుందంటు న్నారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సైతం రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తులపై ప్రభుత్వ కృషిని ప్రశంశించటం గమనార్హం. ధాన్యం నిల్వలు దాచేందుకు గిడ్డంగుల సమస్య కేంద్ర ప్రభుత్వాన్నే కదిలించగలిగేంతగా ఉందంటే ముఖ్యమంత్రి రోశ య్య హయాంలో రాష్ట్ర వ్యవసాయరంగం అభివృద్ధిని చెప్పకనే చెబు తోందంటున్నారు.

ధీమాగా రబీ సాగు: రాష్ట్రంలో ప్రధాన జలాశయాలన్నీ వరదనీటితో తొణ ికిసలాడుతున్నాయి. ఖరీఫ్‌ పంటలకు సాగునీటి అవసరం తీరిపోవటంతో ఇక రబీ పంటల సాగుకు ఢోకా ఉండదని జలాశయాల్లో నిలువ ఉన్న నీరు భరోసా ఇస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, సోమశిల, శ్రీరాంసాగర్‌ తదితర ప్రధాన జలాశయాల్లోకి ఇంకా ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలతో వరద ప్రవాహం వస్తూనే ఉంది.ఎన్నడూ నిండని శ్రీరాంసాగర్‌ సైతం గేట్లెత్తుకుని ప్రవహిస్తోంది. మరోవైపు చెరువులు, కుంటల్లో జలకళ తగ్గలేదు. భూగర్భ జలాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి.

చీకూ చింతా లేని పాలన:చీకూ చింతా లేని పాలన అంటే ఇదేనేమో! రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరైనా విపక్షాలు ముప్పుతిప్పలు పెట్టేదాకా వదిలేవి కావు. అయితే అనుకోని పరిస్థితుల్లో అధికారపగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రి సందర్భాన్ని బట్టి విపక్షాలే పరోక్షంగా బాసటగా నిలుస్తూ రావ టం ఒకరకంగా రోశయ్యను ఆధికార స్థానంలో బలపడేలా చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ ముఖ్యమంత్రులుగా ఎవరున్నా సొంత పార్టీ నుంచే వారికి అస మ్మతి సెగల బుగబుగలు తప్పేవి కావంటున్నారు.

ఈ అంశంలో రాజకీయంగా వైఎస్‌ రాజశేఖరెడ్డికి కూడా మినహాయింపు లేకపోయింది. అయితే ముఖ్యమంత్రి రోశయ్యకు అటువంటి ఇబ్బందులేవీ లేవంటున్నారు. కడప ఎంపీ జగన్‌కు ముఖ్యమంత్రి పీఠంపై కోరికే తప్ప రోశయ్య మీద వ్యక్తి గత ద్వేషమేదీ లేదంటున్నారు. అటు కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌ కూడా రోశయ్య విషయంలో ఉన్నంత సాప్ట్‌కార్నర్‌ ఇదివరకటి వారిపై ఉండేది కాదంటున్నారు. తాత్విక ధోరణి కనబరిచే రోశయ్య అంతటి అదృష్టపు సీఎం ఇంతవరకూ ఎవరూ లేరనే కాంగ్రెస్‌ సీనియర్లు సైతం నొక్కి చెబుతున్నారు.

No comments: