Wednesday, October 27, 2010

ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్యకు గుదిబండలు

roshaiah
ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు చాలా మంది మం త్రులు గుదిబండలుగా పరిణమించారు. సగానికిపైగా మం త్రులు క్రియాశీలరాహిత్యంగా, నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తూ ముఖ్యమంత్రిపై పనిభారం మరింత పెంచుతున్నారన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నేతలనుంచే వినిపిస్తు న్నాయి. సచివులు ఏదో మొక్కుబడి కోసం పనిచేస్తున్నారే తప్ప, ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడే ఉద్దేశం ఏ కోశానా లేదన్న విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండుసార్లు మంత్రిపదవులు చేసిన వారు, అంతకన్నా మించి పనిచేసిన వారే నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తుండటంపై విస్మయం వ్యక్త మవు తోంది. దీనివల్ల.. ఈ మంత్రివర్గం రోశ య్యకు గుదిబండలా మారిందని, ప్రక్షా ళన చేస్తే తప్ప ప్రయోజనం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. రోశయ్య ముఖ్య మంత్రిగా పదవీ బాధ్య తలు స్వీకరించినప్పటి నుంచి వైఎస్‌ క్యాబినెటే ఇంకా కొనసాగుతోంది. వారిలో ఒక్క కొండా సురేఖ మినహా, మిగిలిన వారంతా పాతవారే ఉన్నారు. రోశయ్య సీఎం అయిన దాదాపు ఎనిమిది, తొమ్మిది నెలల వరకూ మంత్రులు మంత్రివర్గ సమావేశాల్లోనే నాన్‌ సీరియస్‌గా వ్యవహరించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అన్ని వైపుల నుంచి ఎదువుతున్న విమర్శలను తిప్పికొట్టి ఎదురుదాడి చేయడంలో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన మంత్రులంతా విఫలమయ్యారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. చాలామంది మంత్రులు ఇప్పటికీ జగన్‌ నామస్మరణ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో స్వయంగా ప్రతి పక్షంపై విరుచుకుపడి, తనపై విమర్శలు వస్తుంటే ఎదురు దాడి చేయవలసిన బాధ్యత మీకు లేదా అని పదే పదే అభ్య ర్థించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. దానితో అప్పటి కప్పుడు నలుగురైదుగురు మంత్రులు మీడియాను పిలిచి, హడావుడి చేయడం, ఆ తర్వాత మాయమవడం ఆనవాయితీగా మారింది. మళ్లీ పిలిచి ఆగ్రహంవ్యక్తం చేస్తే తప్ప మంత్రులెవరూ కనిపించడం లేదు. శాఖల వారీగా తలెత్తుతున్న రోజువారీ సమస్యలపై కూడా మంత్రుల నిర్లిప్త వైఖరి ముఖ్య మంత్రిని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. తమ శాఖ సమస్యలు పరిష్కరించుకోవాల్సిన మంత్రులే సీఎంపైనే భారమంతా నెట్టి.. వారు జారు కోవడం ఇటీవలి కాలంలో తరుచుగా జరగడంతో.. ముఖ్యమంత్రి సదరు మంత్రుల తీరుపై బాహాటంగా అసహనం వ్యక్తం చేయడం, వెటకార ధ్వని వచ్చేలా వ్యాఖ్యానించడం చేస్తు న్నా మంత్రుల పనితీరులో మార్పు కనిపించడం లేదంటున్నారు. ఈరకంగా వ్యవహరిస్తున్న మంత్రుల సంఖ్య రోశయ్య కేబినేట్‌లో సగానికిపైగానే ఉండడంతో.. వారిపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి నెలకొంది.

పెద్దాయనకు పెను సమస్యలు
రాష్ట్రంలో గనుల అక్రమ తవ్వకాలతో ప్రతిపక్షాలు రోశయ్య ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టి ఉక్కిరిబిక్కిరి చేశాయి. వరద ల్లో వైఫల్యం, విత్తనాల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యం, నిత్యావసర ధరలు, నకిలీ విత్తనాలు, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు డిమాండ్లు, తెలంగాణ న్యాయవాదుల పోరాటం, సోంపేటలో రైతులపై కాల్పులు, మైక్రోఫైనాన్స్‌ ఆగడాలు తదితర సమస్యలు ప్రత్యక్షంగా రోశయ్య సర్కారును, పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీనీ అప్రతిష్ఠ పాలు చేశాయి. వీటిపై విపక్షాలు విరుచుకుపడినా మం త్రులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్‌, బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, శ్రీధర్‌బాబు, చీఫ్‌ విప్‌ మల్లు భట్టి విక్రమార్క, విప్‌ శైలజానాధ్‌ వంటి కొందరు మాత్రమే విపక్షాలపై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తుంటే.. మిగిలిన వారంతా పత్తా లేకుండా పోయారు.

చివరకు రోశయ్య తర్వాత సీనియర్‌ మంత్రి అయిన గీతారెడ్డి సైతం ఈ విషయంలో వెనుకబడిపోయారన్న విమర్శలు వినవ స్తున్నాయి. స్వయంగా శాసనసభాపక్ష నేతగా వ్యవహరిస్తోన్న గీతారెడ్డి పాత్రికేయులతో సత్సంబంధాలు నెరపడంలో సైతం విఫలమవుతున్నారన్న వ్యాఖ్యలు మిగిలిన సహచర మంత్రుల్లో వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఒక్క గీతారెడ్డి మాత్రమే కాకుం డా మిగిలిన మంత్రులు కూడా పాత్రికేయులతో సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్నాయని, వైఎస్‌ ఉండగా, మంత్రులు వారితో సన్నిహిత సంబంధాలు నెరిపేవారని పార్టీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. మంత్రులు వట్టి వసంతకుమార్‌, ముఖేష్‌, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి, జూపల్లి, శిల్పా మోహన్‌రెడ్డి, బాలి నేని వంటి మంత్రులు మీడియాకు దూరంగా ఉంటారన్న విమర్శ ఉంది.

అసలు మీడియా విషయంలో గతంలో వైఎస్‌ అనుస రించిన వైఖరికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని కొందరు, ఇందులో ముఖ్యమంత్రి తప్పిదం కూడా ఉందని మరికొందరు వ్యాఖ్యానిస్తు న్నారు. కేవలం కొన్ని పత్రికలకే దగ్గరకావడంతో మిగిలిన వారం తా దూరమవుతున్నారని, వైఎస్‌ జీవించిన సమయంలో ఈ విధంగా ఎప్పుడూ జరగలేదని ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. స్వయంగా సీఎం హాజరయిన సమావేశాలకు సైతం మంత్రులు ఆలస్యంగా హాజరవుతున్న వైచిత్రి. సోమవారం జరిగిన ఒక సదస్సుకు రోశయ్య వచ్చిన ముప్పావుగంట తర్వాత గీతారెడ్డి హాజరుకావడం తెలిసిందే. వైఎస్‌ జీవించి ఉండగా ఈవిధంగా ఎప్పుడూ జరిగేది కాదని, మంత్రులు ఇలాంటి క్రమశిక్షణారాహి త్యానికి పాల్పడేందుకు సాహసించేవారుకాదంటున్నారు.

తాజాగా డిఎస్సీ, బీఎడ్‌ టీచర్ల పోరాటంతో సదరు శాఖ మంత్రి తీరుతో ముఖ్యమంత్రికి మరింత అసహనం కలిగించింది. గత ఏడాదిగా వివిధ అంశాలపై మంత్రుల వ్యవహారశైలి, వారు స్పందిస్తున్న తీరుపై సీఎం మంత్రి వర్గ సమావేశంలోనే వారికి ప్రత్యేకంగా క్లాస్‌ తీసుకుంటున్నారు. సొంత శాఖలపైనా పట్టు సాధించకుండా, సొంత నిర్ణయాలు తీసుకోకుండా వాటిని కూడా తనపైకే నెట్టివేయటంపై రోశయ్య బాహాటంగానే తన అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా రాష్ట్రంలో ప్రభుత్వం పనితీరు, పార్టీ రాజకీయ భవిష్యత్తు తదితర అంశా లపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, ప్రభుత్వం-పార్టీ పనితీరుపై తన అసంతృప్తిని రోశయ్య ముందే వ్యక్తం చేయగా.. అదే విషయాన్ని ఆయన ఢిల్లీ పర్యటన అనంతరం జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ మంత్రులకు ప్రత్యేకంగా హితబోధ చేసి నట్లు తెలిసింది.

చివరకు... ప్రతిష్ఠాత్మకంగా జరిగిన తెలంగాణ ఉప ఎన్నికల్లో సైతం మంత్రులు బాధ్యతారాహిత్యంగా, టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే తమ కు తెలంగాణకు ప్రాధాన్యం ఉంటుందన్న ధోరణి ప్రదర్శించడం పై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలి సిందే. మం త్రులు సైతం రెండు ప్రాంతాలుగా విడిపోవడం, ఒక ప్రాంతానికి చెందిన మంత్రులు మరో ప్రాంతానికి వెళ్లకపోవడం, అంతర్గత కలహాలు, నిధుల విడుదలలో జాప్యం వంటి అంశాలు రోశయ్య ప్రభుత్వానికి అప్రతిష్ఠగా పరిణమించాయి.

ప్రధానంగా.. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన అంశా లపై జగన్‌కు చెందిన పత్రికలో వస్తున్న వార్తా కథనాలు రోశయ్య ప్రభుత్వంపై మహిళల్లో వ్యతిరేకంగా మారాయన్న వ్యాఖ్యలు మంత్రుల్లో వినిపిస్తున్నాయి. జగన్‌కు సన్నిహితుడయిన మంత్రి సహకారం లేకపోతే ఈ వార్తలు రావన్న అభిప్రాయం సీఎం సన్నిహిత వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎమ్మార్‌ కుంభకోణంలో తెరవెనుక సూత్రధారి అయిన పెద్దగద్ద సలహాదారును రక్షిం చేందుకు.. ఆ సంస్థపై విచారణకు మంత్రులే మోకాలడ్డిన వైనం విమర్శలకు గురయింది.

No comments: