Tuesday, October 26, 2010

విడిపోవలసివస్తే, స్నేహితుల్లా విడిపోదాం, బహిష్కరణ పిలుపుతో జటిలం చేయవద్దు, రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ అవతరించిననాటినుంచి రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని, అందువల్ల బహి ష్కరించే ఆలోచనను పునరాలోచించుకోవాలని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తెలంగాణావాదులకు పిలుపు ఇచ్చారు.

రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో పాల్గొనడం ఇష్టం లేకపోతే ఎవరినీ బలవంతం చేయం అని స్పష్టం చేస్తూ.. గతంలో కూడా ఎన్నోసార్లు రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోవలసి వస్తే స్నేహితులుగానే విడిపోవాలి, ప్రతి విషయాన్ని జటిలం చేయవద్దు అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి సమైక్యంగా ఉన్నాం కాబట్టి ఉత్సవం చేసుకుంటున్నామని ఆయన వివరించారు.

ముఖ్యమంత్రి మంగళవారంనాడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫ్రీ జోన్ విషయమై కె.సి.ఆర్. తమ ఇంటిముందు ధర్నా చేస్తాననడాన్ని ప్రస్తావిస్తూ కె.సి.ఆర్. తమ ఇంటికి వస్తే మంచిమర్యాద చేస్తామని చెప్పారు. ఫ్రీ జోన్ విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని, అందువల్ల ఒక పార్లమెంటు సభ్యునిగా కె.సి.ఆర్. వచ్చే నెల 9న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పుడు తమ వంతు కృషి చేయాలని రోశయ్య విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, నేనో సైనికునిలా పని చేస్తానని ఆయన చెప్పారు.

మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ మీకున్నంత పరిజ్ఞానం నాకు ఉండదని ముఖ్యమంత్రి చెప్పారు. ఏదో పొరపాటునో, గ్రహపాటునో ముఖ్యమంత్రిని అయ్యాను అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
గ్రహపాటో.. పొరబాటునో.. ముఖ్యమంత్రినయ్యా...
Rosaiah1
ఆంధ్రప్రదేశ్‌ అవతరించి ననాటి నుంచి రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని, సంయుక్త రాష్ట్రాంగా ఉన్నంత వరకు అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకుంటామని, దీన్ని బహిష్కరించడం సరియైనది కాదని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. ఈ దినోత్సవాన్ని బహిష్క రణ ఆలోచనను పునరాలోచించుకోవాలని తెలంగాణ వాదులకు సూచించారు. మంగళవారం సచివాలయంలో ని సీఎం కార్యాలయం ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో పాల్గొనటం ఇష్టం లేకపోతే ఎవరినీ బలవంతం చేయమని ఆయన స్పష్టంచేస్తూ గతంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ ఉత్స వాల్లో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసీఆర్‌ పాల్గొన్నారన్నారు. అయితే రాష్ట్రం విడిపోవలసివస్తే స్నేహితులుగానే విడిపో వాలన్నారు. ప్రతివిషయాన్ని సమస్యగా మలచి జటిలం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నంతకాలం అవతరణ వేడుకలను నిర్వహిస్తామని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఫ్రీజోన్‌ విషయమై కెసీఆర్‌ తన ఇంటిముందు ధర్నా చేస్తాననడాన్ని సీఎం ప్రస్తావిస్తూ కేసీఆర్‌ తన ఇంటికి వస్తే సాదరంగా ఆహ్వా నించి మర్యాదచేస్తానని చెప్పారు.

ఫ్రీ జోన్‌ విషయమై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని, దీనిపై పార్ల మెంట్‌ సభ్యుడిగా కేసీఆర్‌ వచ్చే పార్లమెంటు సమావేశా ల్లో బిల్లు ఆమోదానికి కృషి చేయాలన్నారు. హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అంశంపై అందరినీ ఢిల్లీ తీసుకువెళ్ళాలన్న కేసీఆర్‌ డిమాండ్‌ ఆర్థ రహితమని ముఖ్యమంత్రి ఆన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, నేనో సైనికునిలా పనిచేస్తానని ఆయన చెప్పారు.

మీడియాపై రుసరుసలు...
డీఎస్సీ-2008 నియామకాలపై అడిగిన ప్రశ్నకు అందుకు సంబంధించిన ఫైలుపై 5 నిముషాల్లో సంతకం చేసి సంబంధిత మంత్రికి పంపామన్నారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఇటీవల జరిగిన ఆందోళనలపై మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రిని అడగగా అన్నీ విషయాలు నాకెలా తెలుస్తాయి, అన్నింటికీ నెనెందుకు సమాధానం చెప్పాలని ఒకింత అసహనం వ్యక్తంచేశారు. అంతేకాకుండా మీకున్నంత పరిజ్ఙాతం నాకు ఉండదని, ఏదో పొరబాటునో, గ్రహబాటునో ముఖ్యమంత్రిని ఆయ్యానంటూ ఫింగర్‌ప్రింట్స్‌పై అన్ని విషయాలుంటాయా? అని ముఖ్యమంత్రి రోశయ్య అసహనం వ్యక్తం చేశారు.

నేనూ సామాన్య భక్తుడినే..
కాగా పాలకొల్లు ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా నా ఫోటోను కలియుగ దైవం వెంకటేశ్వరునిగా చిత్రీకరించి, బ్యానర్లు పెట్టడంపై ముఖ్యమంత్రి స్పందించారు. వెంకటే శ్వరస్వామి ఆభరణాల మధ్య తన బొమ్మను పెట్టడం మంచిదికాదని, ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యే ఉషా రాణి ఈ విధంగా చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి నైనా నేనూ ఆ దేవ దేవునికి సామాన్య భక్తుడినేనని, దేశం లో, రాష్ట్రంలోగాని ఎక్కడైనా తన అభిమానులు భవిష్యత్తులో ఇటువంటి పనులు చేయవద్దని రోశయ్య విజ్ఞప్తి చేశారు.

No comments: